తేజో తుంగభద్ర నవల

తేజో తుంగభద్ర వసుధేంద్ర రచించిన కన్నడ చారిత్రిక కాల్పనిక నవల. 2019 లో దీనికి కర్ణాటక సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దీన్ని తెలుగు లోకి రంగనాథ రామచంద్రరావు అనువదించాడు.

తేజో తుంగభద్ర
కన్నడ తేజో తుంగభద్ర మొదటి అట్ట
రచయిత(లు)వసుధేంద్ర
దేశంభారతదేశం
భాషకన్నడం
శైలికాల్పనిక
ప్రచురణ సంస్థ2019
ప్రచురణ కర్తచంద్రా బుక్స్
ISBN978-93-84908-54-6

వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న తర్వాత పోర్చుగీసు ప్రజలు, లిస్బన్ నగరవాసులు మనదేశం నుంచి సుగంధద్రవ్యాలు తీసుకొని వెళ్ళి యూరోప్ లో అమ్మి బాగా డబ్బు గడించేవారు. "తేజో తుంగభద్ర" నవల కథ పోర్చుగీసు రాజధాని లిస్బన్‌లో, భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం లోని తెంబకపురంలో జరుగుతుంది. రెండు ప్రేమకథలు సమాంతరంగా సాగుతాయి. లిస్బన్లో గాబ్రియల్ అనే క్రైస్తవ యువకుడు ఇసబెల్లా అనే యూదు యువతిని ప్రేమిస్తాడు. ఆమె ధనవంతుని బిడ్డ, ఆతను పేద యువకుడు. తాను రెండేళ్లలో బాగా డబ్బు సంపాదించి తిరిగి వస్తానని ఆమెకు మాట ఇచ్చి, భారతదేశానికి వెళ్ళే నావలో ఒక వ్యాపారస్థుని వద్ద దినసరి లెక్కలు, నిత్యం జరిగే సంఘటనలు లిఖిత రూపంలో రాసిపెట్టడానికి లిస్బన్‌లో ప్లేగు వ్యాధితో జనం చనిపోతూన్న సమయంలో బయలుదేరుతాడు. తను శిల్పి, చెక్కడంపనులు, శాసనాలు చెక్కడం వంటి పనులు చేస్తాడు. నావలో అతనికి జాకోం అనే వ్యక్తి మంచి మిత్రుడవుతాడు.

గేబ్రియల్ గోవాలో దిగి ఆల్బుకరో వద్ద 'లేఖన' వృత్తిలో కుదురుతాడు. విజయనగర సామ్రాజ్యంలో తెంబకపురంలో కేశవ ఓజ కులస్డుడు,శిల్పి. అతను ద్వంద్వ యుద్దంలో గెలిచి 'హంపి'- హంపంమ్మను దక్కించుకొంటాడు. రాయలకు పురుషసంతానం కలిగితే తను 'లెంక' నవుతానని ప్రతిన పూనుతాడు. రాణి మగశిసువుకు జన్మనిస్తుంది. కేశవ బహిరంగ ప్రదేశంలో కత్తితో తన శిరసును ఖండించుకొని ప్రతిన నిలబెట్టుకొంటాడు. అతని వితంతువు హంపమ్మ ఆనాటి సంప్రదాయం ప్రకారం సహగమనం చేయవలసి వుంది. ఆమె గర్భవతి. గ్రామమంతా గుమిగూడి చుస్తూ వుండగా, ప్రాణంమీది ప్రేమతో హంపమ్మ సహగమనం చేయకుండా తప్పించుకొని పారిపోతుంది.

గేబ్రియల్ సుల్తానుల (ముస్లిమ్.ల) పాలనలో ప్రాణాలు కాపాడుకోడానికి బలవంతంవల్ల ముస్లింమతం తీసుకొని 'అహమద్ ఖాన్' పేరుతో తిరుగుతూ, తర్వాత శిక్షగ ముక్కూ, చెవులు కోయబడి 'అమ్మదకన్న' అనే పేరుతో పిలవబడుతూంటాడు. నవల చివరకు వచ్చేసరికి రెండే పాత్రలు- అమ్మకదన్న, హంపమ్మ ఇద్దరే ఒకరికికొకరు మిగులుతారు, తేజో-తుంగ నదులు సంగమించినట్లు.

ఇసబెల్లా 'అగ్వేద' చేతికి నాలుగు రంగు చేపపిల్లలను ఇచ్చిపంపుతుంది. చివరకు వాటిని తుంగభద్రలో వదిలిపెడతారు. ఈ చేపల కథ ప్రతీకాత్మకంగా రచయిత ప్రవేశపెట్టాడు. చివరకు గేబ్రియల్ హంపమ్మకు తోడూనీడా అవుతాడు.

నవల పూర్తిచేసే సమయానికి జాతిమత విభేదాలు, ప్రాంతీయ భేదాలు, అన్నీ కల్పితమని, మానవత్వమే మిన్న అనీ తోస్తుంది. రంగనాథ రామచంద్రరావు చాలా సరళంగా తెలుగులోకి నవలను అనువదించారు.

మూలాలు

మార్చు

1.Tejo Tungabhadra ( Kannada, VASUDHENDRA) https://www.blossombookhouse.in/product/tejo-tungabhadra-

2.బ్లోసమ్ బుక్ హౌస్ : తేజో తుంగభద్ర -తెలుగు నవల