దత్తాత్రేయ దేవాలయం (ఎత్తిపోతల)

దత్తాత్రేయ దేవాలయం (ఎత్తిపోతల) అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని అతి గొప్ప విశేషమైన మహిమగల దత్తక్షేత్రమిది. సహజసిద్ధ ఎత్తిపోతల జలపాతంతో పాటు దిగువ భాగంలో ఉన్ష్న వందల సంవత్సరాల నాటి దేవాలయా దత్తాత్రేయ దేవాలయం.[1]

ఎత్తిపోతల దత్తక్షేత్ర ప్రత్యేకత మార్చు

యతి – తపః – తలం (ఎత్తిపోతల) త్రివేణి సంగమ దత్తక్షేత్ర ప్రదేశం. ఇక్కడ (ఎత్తిపోతల) కృష్ణానది ఉప-ఉప నదులైన మూడు ఉప-ఉప (వంకలు) నదులు చంద్రవంక, అగ్నివంక, సూర్యవంక నదులు ఒకదానికొకటి సంగమిస్తాయి. ఈ మూడు నదులు ఎత్తిపోతల జలపాతం వద్ద కలిసి ఒకటిగా ఏర్పడి ఆ మొత్తం ‘మధువంక’ గామారి అది కృష్ణానదిలో కలవడం జరుగుతుంది. అందువల్లనే ఎత్తిపోతల జలపాతం వద్ద సంగమేశ్వర దేవాలయాన్ని (ప్రస్తుతం జీర్ణ స్థితిలో కలదు) మనం చూడవచ్చు, ఈ మూడు వంకలు కలిసి పైనుండి క్రిందకు పడేచోట గల ప్రదేశం చూచుటకు గోవు యొక్క కర్ణం (ఆవుచెవి) మాదిరిగా ఉండడమూ, మూడు వంకలు కలిసి ( చంద్రవంక, అగ్నివంక, సూర్యవంక) ‘మధువంక’గా దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి అయిన మధుమతీదేవి యొక్క నేత్రముల ఎదురుగా జరుగుతుండడం వల్ల ఈ క్షేత్రాన్ని ‘త్రివేణి మధు గోకర్ణ’గా ఒకప్పుడు పిలిచేవారు. ఇక్కడగల పరిసర ప్రదేశాల్లో మధుమతీ సమేత దత్తాత్రేయుని ఆవాసంవల్ల ఇక్కడ యతులు తపస్సు చేసుకోవడానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఫలితంగా ‘త్రివేణి మధు గోకర్ణ’ కాస్తా ‘యతి – తపః – తలం’గా తదుపరి ‘ఎత్తిపోతల’గా మారింది.

ఎత్తిపోతల దత్తాత్రేయుడు స్వయంభూ దత్తాత్రేయుడు. కొండగుహలో ఉన్న స్వయంభూ దత్తాత్రేయమూర్తిని పునః ప్రతిష్టించాడు ‘హైహయ’ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు. హైహయ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు ఈ క్షేత్రానికి దగ్గర లోగల మహీష్పతి నగరాన్ని (నేటి మాచర్ల) రాజధానిగా పరిపాలన సాగించేవాడు. అందువల్ల ఇక్కడే కార్త్యవీర్యార్జునుడు ముఖ్య పర్వదినములలో తప్పని సరిగా అనఘాస్టమీ వ్రతాలను ఆచరించేవాడు. ఈ క్షేత్ర మహిమ తెలుసుకున్నపరుశురాముడు (కార్త్యవీర్యార్జునుడి సంహరించినవాడు, రేణుకామాత – జమదగ్నిల కుమారుడు) కార్త్యవీర్యార్జునుడి తదుపరి ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేసాడు. ప్రపంచంలోని ఏకైక సింధూరలేపన దత్తాత్రేయుడు ఇక్కడ కనిపిస్తాడు, అలాగే ప్రపంచంలోని ఏకైక ‘నాగకిరిటాభారణ’ (నాగుపామును కిరిటంగా ధరించిన) దత్తాత్రేయుడు ఏకముఖ, చతుర్భుజుడుగా కనిపిస్తాడు. విష్ణురూప, అలంకారప్రియ, చిద్విలాస, నామధారి (నామమును ధరించిన) దత్తాత్రేయుడు. భక్తులు ఇక్కడి దత్తాత్రేయుడుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కార్త్యవీర్యార్జున విరచిత దత్తస్తోత్రాలను చదివితే మిక్కిలి ప్రీతి చెందుతాడట. అలాగే కష్టాలలో ఉన్నవారు వారి కస్టాలు తీరిన తరువాత ఇక్కడి ’ఝెండా ప్రాంగణం’లో ఝెండాలను కడతారు.[2]

మధుమతీ దేవి మార్చు

మధుమతీ దేవి దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి. మధుమతి అనగా ‘తేనెవంటి హృదయం’ గలది అని అర్ధం. మధుమతీ దేవి కుడా స్వయంభూ గానే ఉద్భవించారు. విష్ణు కుండినుల కాలంలో ఈ ఆలయం జీర్ణోద్ధారణ గావింపబడింది. వారు, వారి తరువాత వచ్చిన రాజులందరూ అమ్మ వారికి భక్తులే. ఈవిడ లక్ష్మీ స్వరూపురాలు, అష్ట సిద్ధులకు తల్లి. ఈవిడ పనసచుట్టులో కుటుంబ సమేతంగా ఉంటారు. ఎత్తిపోతల దత్తక్షేత్ర దర్శనానికి వచ్చిన వారు ముందుగా మధుమతీ దేవిని దర్శించి ఆ తరువాత కొండమీద గుహలో ఉన్న దత్తాత్రేయుడిని దర్శించడం ఇక్కడి ఆనవాయితీ. ఎంతోమంది ఋషులకి,దత్త ఉపాసకులకి, దత్త భక్తులకీ మధుమతీ దేవి దర్శనం కలిగిందని చెబుతారు. ఈ తల్లి ప్రతినిత్యం రెండు నుండి మూడు సార్లు పైన గల కొండమీద గుహలో ఉన్న దత్తాత్రేయుడిని దర్శించడానికి వెళతారట.ఈ విధంగా పైకి వెళ్ళేటప్పుడు అమ్మ వారి పాదాలు మెట్లకు ఆనకుండా, మెట్లకు కొద్దిగా పైన గాలిలో నడుచుకుంటూ వెళ్ళడం అనేక మంది చూసారు.

దత్త శిల మార్చు

‘దత్త శిల’ ఎత్తిపోతల ప్రధాన ద్వారం నుండి దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళే మెట్ల మార్గంలో పెద్ద పుట్టకు సమీపంలో కుడివైపున ఉంటుంది. దత్తాత్రేయుడు ఈ రాయి మీద కుర్చుని విశ్రాంతి తీసుకునేవాడని అనేక మంది మహర్షులు చెప్పేవారు. ఒక్కోసారి ఈ శిల మీదే దత్తాత్రేయుడు కల్లు త్రాగువాని వలె కుర్చుని కల్లు తాగుతూ కనిపిస్తాడట. నడి రాత్రిలో ఈ దత్త శిలకు శిరస్సును ఆనించి దత్తాత్రేయుడిని ధ్యానించి ఈ శిలకు దరిదాపుల్లోనే నిద్రిస్తే వారికి తప్పని సరిగా దత్తదర్శనం కలుగుతుంది.

రంగనాయక స్వామి ఆలయం మార్చు

ఎత్తిపోతలలో గల మరొక ప్రధాన ఆలయం శ్రీదేవి – భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి ఆలయం. ఈ ఆలయం ఇక్ష్వాకుల కాలంలో నిర్మించగా విష్ణుకుండినులు అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీదేవి – భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి కుడా స్వయంభూనే. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో మధువంక పొంగి శ్రీ రంగనాయక స్వామి వారి పాదాల వరుకు వస్తుంది.

ఇష్టకామేశ్వరి దేవి ఆలయం మార్చు

ఇష్టకామేశ్వరి దేవి ఆలయం చోళరాజులు అభివృద్ధి చేసినట్లుగా చెబుతారు. ప్రస్తుతం జీర్ణస్థితిలో గలదు.

చౌడేశ్వరి దేవి ఆలయం మార్చు

చౌడేశ్వరిదేవికే ‘ఛాముండేశ్వరిదేవి’ అనికూడా పేరు. చౌడేశ్వరిదేవి ఎత్తిపోతల క్షేత్ర పాలకురాలు. దత్త భక్తులనూ, ఉపాసకులను అనుక్షణం రక్షించే బాధ్యతను తలకెత్తుకున్నగొప్ప తల్లి ఈమె.

మూలాలు మార్చు