కన్నారా అని కూడా పిలువబడే కృష్ణ (క్రస్నా సా.శ.1246-సా.శ.1261) భారతదేశంలోని దక్కను ప్రాంతంలోని సెయునా (యాదవ) రాజవంశానికి పాలకుడు. ఆయన మాల్వాలోని పరమారా రాజ్యం మీద విజయవంతంగా దాడి చేశాడు. వాఘేలా, హొయసల మీద అనాలోచిత యుద్ధాలు చేశాడు. యాదవ శాసనాలు ఆయనకు లేదా ఆయన సైనికాధికారులకు అనేక ఇతర విజయాల ఘనత ఇచ్చాయి. కాని ఈ వాదనలు సందేహాస్పదమైనవి.

Krishna
Yadava king
Reignc. 1246-1261 CE
PredecessorSimhana
SuccessorMahadeva
IssueRamachandra
రాజవంశంSeuna (Yadava)
తండ్రిJaitugi II

ఆరంభకాల జీవితం మార్చు

కృష్ణుడు యాదవ రాజు సింహానా మనవడు. సింహానా తరువాత ఆయన తండ్రి " రెండవ జైతుగి " సింహానాకు ముందు మరణించాడు. సింహానా పాలన రెండవ సంవత్సరంలో సా.శ. 1248 నవంబరు 2 న ఒక శాసనం జారీ చేయబడింది. ఆయన పాలన మూడవ సంవత్సరంలో 1248 డిసెంబరు 25 న మరొక శాసనం జారీ చేయబడింది. 1246 నవంబరు లేదా డిసెంబరులో సింహానా సింహాసనాన్ని అధిరోహించారని ఇది సూచిస్తుంది.[1]

వివిధ కన్నడ శాసనాలలో, కృష్ణుడి పేరు కన్హా, కన్హారా లేదా కంధారాగా కనిపిస్తుంది.[1]

యుద్ధాలు మార్చు

ఆయన తాత నుండి ఆయనకు రాజ్యాధికారం వారసత్వంగా వచ్చింది.[2]యాదవ శాసనాలు ఆయనకు అనేక విజయాల ఘనత ఇచ్చాయి. ఉదాహరణకు మునోలి శాసనం ఆయనను ఇలా వివరిస్తుంది:[3]

“... అన్ని శక్తులు కలిగిన ద్వారవతిపుర గొప్ప ప్రభువు, మదనా లాంటి మాళవాకు త్రినేత్ర, గుర్జారా-రాజా భయానక, కొంకణ-రాజా పతనానికి కారణమైనవాడు. హొయసల-రాజా నుండి థ్రస్టరు, తెలుంగు-రాయ పునరుద్ధరణ ...

పరమరాలు మార్చు

యాదవ రాజ్యానికి ఉత్తరాన. కృష్ణుడి ఆరోహణ సమయానికి, ఇల్టుట్మిషు నేతృత్వంలోని ఢిల్లీ సుల్తానేటు నుండి దండయాత్రల కారణంగా పరమారా శక్తి, ప్రతిష్ఠ క్షీణించింది.[1] కృష్ణుడు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకున్నాడు. పరమారా రాజు జైతుగిదేవ పాలనలో కొంత కాలం మాళ్వా మీద దాడి చేశాడు. ఈ దాడి సా.శ. 1250 లో లేదా అంతకు ముందు యాదవ వ్రాతపూర్వక ఆధారాలు మొదట ప్రస్తావించినప్పుడు జరిగి ఉండాలి.[2]

మునోలి శాసనం కృష్ణుడిని శివునితో (త్రినేత్ర), పరమారా రాజును మదానాతో పోల్చింది (హిందూ పురాణాలలో, శివుడు మన్మధుడిని కాల్చేస్తాడు).[3][2] మమదాపూరు శిలాశాసనం పరమరా రాజు మీద కృష్ణుడి విజయాన్ని సూచిస్తుంది.[3] ఈ దాడి ఎటువంటి ప్రాదేశిక అనుసంధానానికి దారితీసినట్లు లేదు.[2]

వఘేలాలు మార్చు

కృష్ణుడు వాఘేలా పాలిత గుజరాతు (గుర్జారా) ప్రాంతం మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించాడు.[2][3] వాఘేలా రాజు విశాల-దేవా ఒక హొయసల యువరాణిని వివాహం చేసుకున్నాడు: ఈ రెండు రాజ్యాలు యాదవులకు సాంప్రదాయ ప్రత్యర్థులుగా ఉన్నారు. ఈ వివాహం కృష్ణుడి దండయాత్రకు అదనంగా రెచ్చగొట్టే అవకాశం ఉంది.[2]

ఈ వివాదం బహుశా కొన్ని సరిహద్దు వాగ్వివాదాలకు పరిమితం చేయబడింది. ఇది యాదవులు, వఘేలాలకు వివిధ రకాల ప్రయోజనాలను కలిగించింది. ఎటువంటి ప్రాదేశిక మార్పులకు దారితీయలేదు. యాదవ, వాఘేలా రికార్డులు రెండూ ఈ అసంబద్ధమైన సంఘర్షణలో విజయం సాధించాయి. విశాల-దేవ సైన్యాలనును కృష్ణుడు నాశనం చేశాడని యాదవుల పైథను శాసనం, వారి న్యాయస్థాన-కవి హేమద్రి రాసిన ప్రశంసలు పేర్కొన్నాయి. మరోవైపు విశాల-దేవా కృష్ణుడిని ఓడించాడని వాఘేలాల దభోయి శాసనం పేర్కొంది.[2][3]

హొయశిలలు మార్చు

కృష్ణ సైన్యాధ్యక్షుడు చాముండా 1250 కి ముందు కొంతకాలం హొయసల రాజు సోమేశ్వరుడి "అహంకారాన్ని అణగదొక్కారని" పేర్కొన్నాడు. చరిత్రకారుడు ఎ. ఎస్. అల్టేకరు అభిప్రాయం ఆధారంగా ఇది సరిహద్దు వాగ్వివాదంలో యాదవ విజయానికి సూచన కావచ్చు.[2] ప్రస్తుత చిత్రదుర్గ జిల్లాలో కనుగొన్న కృష్ణుడి శాసనాలు ధ్రువీకరించినట్లు, యాదవ దళాలు హొయసల భూభాగంలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోగలిగాయని చరిత్రకారుడు టి. వి. మహాలింగం సిద్ధాంతీకరించారు. హొయసల వ్రాతపూర్వక ఆధారాలు సోమేశ్వరుడు విజయం సాధించినట్లు పేర్కొన్నాయి.[3]

పాండ్యులు మార్చు

యాదవరాజ్యం దక్షిణ భాగానికి వైస్రాయి అయిన కృష్ణ సైనికాధికారి బిచనా సా.శ. 1253 కి కొంతకాలం ముందు పాండ్యులను ఓడించారని పేర్కొన్నారు.[2] చరిత్రకారుడు టి. వి. మహాలింగం ఇది ఎటువంటి చారిత్రక ఆధారం లేని సాంప్రదాయిక వాదన అని విశ్వసించారు.[3]

చరిత్రకారుడు ఎ. ఎస్. అల్టేకరు అభిప్రాయం ఆధారంగా ఈ వాదనకు కొంత నిజం ఉండవచ్చు: పాండ్య రాజు జాతవర్మను సుందర పాండ్యను కాకతీయా రాజ్యం మీద దాడి చేసి నెల్లూరు వరకు రాజ్యవిస్తరణ చేసాడు. అనేక సంవత్సరాలు యాదవ పాలెగాడుగా పరిపాలించిన కాకతీయరాజు గణపతి, పాండ్య దండయాత్రకు వ్యతిరేకంగా కృష్ణుడి సహాయం కోరాడు. కృష్ణుడు తనకు సహాయం చేయమని బిచానాను పంపించాడు. [2]

చోళులు మార్చు

కృష్ణుడి సైనికాధికారి చముండా మునోలి శాసనం కృష్ణుడు చోళులను ఓడించాడని పేర్కొన్నది. అయితే ఇది అతిశయోక్తిగా కనిపిస్తుంది. [2]

కలాచూరీలు మార్చు

త్రిపురాను కృష్ణుడు స్వాధీనం చేసుకున్నట్లు మునోలి శాసనం పేర్కొంది. 13 వ శతాబ్దం మధ్య నాటికి కలచురి రాజ్యం ఉనికిలో లేదు. వారి పూర్వ భూభాగం ఆచరణాత్మకంగా మానవ నివాస భూమిగా మారిపోయింది. కృష్ణుడు లేదా ఆయన సైనికాధికారులలో ఒకరు త్రిపురిని కొంతకాలం ఆక్రమించి ఉంటారు.[2]

చివరి రోజులు మార్చు

కృష్ణుడి చివరి శాసనం 1261 మే నాటిది.[4]కృష్ణ మరణించే సమయంలో ఆయన కుమారుడు రామచంద్ర బహుశా యువరాజా (స్పష్టమైన వారసుడు) బిరుదును స్వీకరించడానికి సింహాసనాన్ని అధిరోహించేంత వయస్సులో లేడు. కృష్ణ సోదరుడు మహాదేవ కనీసం సా.శ. 1250 నుండి వారసుడిగా నియమించబడి పరిపాలనలో రాజుకు సహాయం చేశాడు. సా.శ. 1261 లో అతని తరువాత అధికారం స్వీకరించాడు.[5][4] మహాదేవ తరువాత ఆయన కుమారుడు అమ్మానా వారసుడు అయినప్పటికీ రామచంద్ర అతన్ని బలవంతంగా తొలగించి సా.శ.1271 లో కొత్తగా రాజు అయ్యాడు.[6]

పాలనా నిర్వహణ మార్చు

సింహానా సైనికాధికారులు, అధికారులు, బిచానా, ఆయన అన్నయ్య మల్లిసెట్టి వంటివారు కృష్ణుడికి సేవలను కొనసాగించారు. సింహానా ఆధ్వర్యంలో జిల్లా అధికారిగా ఉన్న మల్లిసెట్టి కృష్ణుని పాలన ప్రారంభంలో సర్వ-దేశాధికారి (రాజప్రతినిధి) హోదాకు ఎదిగాడు. ఆయన కుమారుడు చాముండా-రాయ సా.శ. 1250 నుండి మహా-ప్రధాన, మహా-మాత్య అనే బిరుదులను కలిగి ఉన్నారు.[5]

గుజరాతీ బ్రాహ్మణుడైన లక్ష్మీదేవ కృష్ణుడి మరో ముఖ్యమైన మంత్రి, రాజు పాలనను ఏకీకృతం చేయడంలో సహాయపడ్డాడని పేర్కొన్నాడు. ఆయన కుమారుడు జల్హానా ఒక సలహాదారుడుగా గజ దళానికి నాయకుడుగా కృష్ణుడి కోసం అనేక యుద్ధాలు గెలిచినట్లు పేర్కొన్నాడు. జల్హానా సంస్కృత సంకలనం సూక్తి-ముక్తవళి కూడా సంకలనం చేసాడు. ఆయన కుమారులు రామచంద్ర, కేశవ ప్రస్తుత సతారా జిల్లాలో భూములు కలిగి ఉన్నారు. వారి తండ్రి మరణం తరువాత వారు యాదవులకు సేవలను కొనసాగించారు.[5]

మతం మార్చు

కృష్ణుడు వేద హిందూ మతాన్ని అనుసరించాడు, [7] ఆయన శాసనాలలో ఒకటి ఆయనను వేదోద్దార ("వేదాలను సమర్థించేవాడు") గా అభివర్ణిస్తుంది.[3] 13 వ శతాబ్దపు యాదవ న్యాయ విద్వాంసుడు హేమద్రి అనేక కర్మ యాగాలు చేసి బలహీనమైన ధర్మానికి చైతన్యం నింపాడు.[3] మహానుభావ వచనం లీల-చరిత ఆధారంగా కృష్ణుడికి మహానుభావులైన సాధువుల పట్ల ఎంతో గౌరవం ఉందని, ఆయన లోనారు వద్ద శాఖ వ్యవస్థాపకుడు చక్రధరను సందర్శించాడు.[3]

సంస్కృతిక కార్యక్రమాలు మార్చు

కృష్ణా పాలనలో రచించబడిన సాహిత్య రచనలు:

  • సూక్తి ముక్తావళి అనే సంస్కృత నీతిశాస్త్రం ప్రసిద్ధ కవుల రచనల ఎంపికలను కలిగి ఉన్న సంస్కృత సంకలనం: దీనిని కృష్ణ మంత్రి జల్హానా సంకలనం చేశారు లేదా నియమించారు.[5]
  • వాచస్పతి-మిశ్రా భమతి మీద అమలానంద " వేదాంత-కల్పతరు " పేరుతో వ్యాఖ్యానం చేసాడు.[5][3]

మూలాలు మార్చు

గ్రంధసూచిక మార్చు

  • A. S. Altekar (1960). Ghulam Yazdani (ed.). The Early History of the Deccan Parts. Vol. VIII: Yādavas of Seuṇadeśa. Oxford University Press. OCLC 59001459.[permanent dead link]
  • T. V. Mahalingam (1957). "The Seunas of Devagiri". In R. S. Sharma (ed.). A Comprehensive history of India: A.D. 985-1206. Vol. 4 (Part 1). Indian History Congress / People's Publishing House. ISBN 978-81-7007-121-1.

మూస:Seuna (Yadava) dynasty