న్యాపతి నారాయణమూర్తి

న్యాపతి నారాయణమూర్తి తెలుగు పత్రికా సంపాదకుడు.

న్యాపతి నారాయణమూర్తి
జననంన్యాపతి నారాయణమూర్తి
1897
బరంపురం
మరణం1951
ప్రసిద్ధిపత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత
మతంహిందూ


ఇతడు 1897లో బరంపురంలో జన్మించాడు.

సంపాదకుడిగా మార్చు

ఎన్.జి.రంగా నడిపిన వాహిని వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. ఆంధ్రవాణి పత్రికకు సంపాదకునిగా ఉన్నాడు. ఆంధ్రప్రభ దినపత్రికకు ఖాసా సుబ్బారావు తరువాత సంపాదకుడిగా వ్యవహరించాడు. ఆంధ్రప్రభలో పాన్-సుపారి అనే శీర్షికను నిర్వహించాడు. భారతి, కళింగ పత్రికలకు అనేక వ్యాసాలు వ్రాశాడు. జైభారత్ అనే పత్రికను స్థాపించి నిర్వహించాడు. విజయప్రభ పత్రికకు 1951లో సంపాదకుడిగా ఉన్నాడు.[1]

స్వాతంత్ర్యోద్యమంలో మార్చు

ఇతడు సహాయనిరాకరణోద్యమంలో, విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. మద్యం దుకాణాలవద్ద, విదేశీ షాపులవద్ద పికెటింగ్‌లో పాల్గొని 1922లో నెలరోజుల పాటు జైలుశిక్షను అనుభవించాడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఏడాదికి పైగా కారాగారంలో ఉన్నాడు.[2]

మూలాలు మార్చు

  1. నరిశెట్టి ఇన్నయ్య (1 July 2014). "నేను రాసిన పత్రికలు - నాకు తెలిసిన ఎడిటర్స్" (PDF). కౌముది. Retrieved 24 March 2024.
  2. తుర్లపాటి రాజేశ్వరి (2012). ఒరిస్సాలో తెలుగువారు (1 ed.). హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. pp. 8–9. Retrieved 30 March 2024.