పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్

పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌
పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్


ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019 - ప్రస్తుతం
ముందు వరుపుల సుబ్బారావు
నియోజకవర్గం ప్రత్తిపాడు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 14 ఆగస్ట్ 1964
శంఖవరం గ్రామం, శంఖవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కొండల్ రావు
జీవిత భాగస్వామి సత్యవేణి
సంతానం నందిని, దీనా

జననం, విద్యాభాస్యం సవరించు

పూర్ణచంద్ర ప్రసాద్‌ 14 ఆగస్ట్ 1964లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తూర్పు గోదావరి జిల్లా, శంఖవరం మండలం, శంఖవరం గ్రామంలో జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు చదువుకున్నాడు.[2]

రాజకీయ జీవితం సవరించు

పూర్ణచంద్ర ప్రసాద్‌ 1989లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి శంఖవరం గ్రామా ఉపసర్పంచ్‌గా, ఆంధ్రా బ్యాంక్‌ ఎఫ్‌ఏసీఎస్‌ అధ్యక్షుడిగా, జెడ్పీటీసీ సభ్యుడిగా, అన్నవరం దేవస్థానం ట్రస్టు బోర్డు డైరెక్టర్‌గా, సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు. పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌ 2014లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయి ఓడిపోడదు, అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పై 7,398 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

మూలాలు సవరించు

  1. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 9 December 2021. Retrieved 9 December 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch (help)
  3. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.