వరుపుల సుబ్బారావు

వరుపుల సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

వరుపుల సుబ్బారావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 - 2009
2014 - 2019
నియోజకవర్గం ప్రత్తిపాడు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1955
లింగంపర్తి, ఏలేశ్వరం మండలం, తూర్పు గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ , తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు సూర్యారావు
జీవిత భాగస్వామి వెంకటలక్ష్మి
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

వరుపుల సుబ్బారావు కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2014లో కాంగ్రెస్‌ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరి 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన 2016 ఏప్రిల్ 8న తెలుగుదేశం పార్టీలో చేరాడు. వరుపుల సుబ్బారావుకు 2019లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన 18 మార్చి 2019న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[1]

ఎన్నికల్లో పోటీ మార్చు

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ
2014 వరుపుల సుబ్బారావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్వత సత్యనారాయణమూర్తి (చిట్టిబాబు) తె.దే.పా
2009 పర్వత సత్యనారాయణమూర్తి (చిట్టిబాబు) తె.దే.పా వరుపుల సుబ్బారావు కాంగ్రెస్ పార్టీ
2004 వరుపుల సుబ్బారావు కాంగ్రెస్ పార్టీ పర్వత బాపనమ్మ తె.దే.పా
1999 పర్వత బాపనమ్మ తె.దే.పా వరుపుల సుబ్బారావు కాంగ్రెస్ పార్టీ
1989 ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ పార్టీ వరుపుల సుబ్బారావు తె.దే.పా
1983 ముద్రగడ పద్మనాభం స్వతంత్ర అభ్యర్థి వరుపుల సుబ్బారావు కాంగ్రెస్ పార్టీ

మూలాలు మార్చు

  1. Sakshi (18 March 2019). "'అందుకే మళ్లీ వైఎస్సార్‌సీపీలోకి వచ్చా'". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.