పాదుకా పట్టాభిషేకం (1932 సినిమా)

1932 చిత్రం

పాదుకా పట్టాభిషేకం బాదామి సర్వోత్తం దర్శకత్వంలో, చిలకలపూడి రామాజనేయులు, సురభి కమలాబాయి తదితరులు ముఖ్యపాత్రల్లో, సాగర్ స్టూడియోస్ నిర్మించిన తెలుగు పౌరాణిక చిత్రం. 1932లో నిర్మితమైన ఈ సినిమా రెండవ తెలుగు టాకీ పేరొందింది.[1]

పాదుకా పట్టాభిషేకం
(1932 తెలుగు సినిమా)
దర్శకత్వం బాదామి సర్వోత్తం
తారాగణం చిలకలపూడి సీతారామాంజనేయులు,
సురభి కమలాబాయి,
యడవల్లి సూర్యనారాయణ
నిర్మాణ సంస్థ సాగర్ స్టూడియోస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

ప్రసిద్ధ రంగస్థలనటుడు యడవల్లి సూర్యనారాయణ ఈ సినిమా ద్వారా సినీరంగంలోకి ప్రవేశించారు.

కథ మార్చు

సీత, లక్ష్మణులతో కలిసి రాముడు వారి తండ్రి దశరథుడు ఆజ్ఞ ప్రకారం అయోధ్య నగరం నుండి బయలుదేరాడు. రాముని సవతి సోదరుడు భరతుడిని సింహాసనంపై ఉంచడానికి భరతుని తల్లి, దశరథుని రెండవ భార్య కైకేయి తన భర్తకు వరం కావాలని కోరింది. భరతుడు సింహాసనంపై కూర్చోవడానికి నిరాకరించి, రాముడిని తిరిగి తేవడానికి అడవికి వెళ్తాడు. రాముడు తన కర్తవ్యాన్ని గుర్తుచేసుకున్నాడు. అడవిలో తన పద్నాలుగు సంవత్సరాల బహిష్కరణను నెరవేర్చాలని అనుకున్నందున తిరిగి వెళ్ళడానికి నిరాకరించాడు. భరతుడు అప్పుడు రాముడి పాదుకలు (చెప్పులు) తీసుకొని అయోధ్యకు తిరిగి రావాలని పట్టుబట్టాడు. అతను రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యపాలన చేస్తాడు. చివరికి రాముడు తిరిగి వచ్చే వరకు వేచి ఉంటాడు.

మూలాలు మార్చు

  1. "1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు". ఆంధ్రజ్యోతి ఆదివారం: 4. 28 జనవరి 2007.