పార్వతీపురం
ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం మండల పట్టణం
పార్వతీపురం, (వినండి: // ( listen)), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పట్టణం, జిల్లా కేంద్రం.
పార్వతీపురం | |
---|---|
పట్టణం | |
![]() పార్వతీపురం ప్రధాన రహదారి | |
Coordinates: 18°46′48″N 83°25′30″E / 18.78°N 83.425°E | |
Country | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పార్వతీపురం మన్యం |
Government | |
• Type | పురపాలక సంఘం |
• Body | పార్వతీపురం పురపాలకసంఘం, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (BUDA) |
• శాసన సభ్యుడు | Alajangi Jogarao |
Area | |
• Total | 7.24 km2 (2.80 sq mi) |
Population (2011)[2] | |
• Total | 53,844 |
• Density | 7,400/km2 (19,000/sq mi) |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 535 501 |
ప్రాంతీయ ఫోన్కోడ్ | 91–8963 |
వాహనాల నమోదు కోడ్ | AP35 (Former) AP39 (from 30 January 2019)[3] |
భౌగోళికం మార్చు
రాష్ట్ర రాజధాని అమరావతి నుండి ఈశాన్యంగా 523 కి.మీ, సమీప నగరమైన విజయనగరానికి ఉత్తరంగా 87 కి.మీ దూరంలోవుంది.
జనాభా గణాంకాలు మార్చు
2011 జనగణన ప్రకారం, పట్టణ జనాభా 53,844.
పరిపాలన మార్చు
పార్వతీపురం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు మార్చు
జాతీయ రహదారి 16 పై గల శ్రీకాకుళం నుండి ఈ ఊరికి రహదారి వుంది. జార్సుగూడ-విజయనగరం లైన్లో పార్వతీపురం వుంది. పార్వతీపురం రైల్వే స్టేషన్, పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ అనే రెండు స్టేషన్లున్నాయి. సమీప విమానాశ్రయం 150 కి.మీ దూరంలో గల విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం.
పర్యాటక ఆకర్షణలు మార్చు
దేవాలయాలు మార్చు
- కాశీవిశ్వనాథ దేవాలయం, అడ్డపుసిల: 5 కి.మీ దూరంలోగల చారిత్రక ఆలయం,
- శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, తోటపల్లి: చిన్న తిరుపతిగా పేరొందినది.
- సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, బెలగాం: 1888లో నిర్మించబడింది.
- కేథలిక్ చర్చి,పార్వతీపురం.
జలాశయాలు, ఆనకట్టలు మార్చు
- ఝంజావతి రబ్బరు ఆనకట్ట: 15 కి.మీ దూరంలో వుంది. జలయజ్ఞం లో భాగంగా 2006 లో నిర్మించబడింది
- తోటపల్లి జలాశయం:నాగావళి నదిపై 2015 లో నిర్మించబడింది.
ప్రముఖ వ్యక్తులు మార్చు
- ఉప్మాక నారాయణమూర్తి -(1896 -1962) సాహితీ వేత్త, ప్రఖ్యాతి పొందిన న్యాయవాది.
- ఎస్.వి.జోగారావుగా - ప్రసిద్ధిచెందిన శిష్ట్లా వెంకట జోగారావు (1928 - 1992) సాహితీవేత్త, బహుముఖ కళా శిల్పి పార్వతీపురంలోనే జన్మించారు
- గణేష్ పాత్రోగా - ప్రసిధ్ధి చెందిన సినీ మాటల రచయిత తమ సమకాలికులైన ఓలేటి బుచ్చిబాబు, దోమాన సూర్యనారాయాణ, డొంకాడ సత్యానందం మొదలగు వారితో చాలా నాటికలను ప్రదర్శించాడు. ఇందులో పావలా, కొడుకు పుట్టాల మొదలగు నాటికలు విశేష ప్రాచుర్యం పొందినవి
- వేపా కృష్ణమూర్తి
- గొబ్బూరి వెంకటానంద రాఘవరావు
- పంతుల జోగారావు
- బెలగాం భీమేశ్వరరావు - బాల సాహితీ వేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత
ఇవీ చూడండి మార్చు
మూలాలు మార్చు
- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 19 August 2014.
- ↑ "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
Wikimedia Commons has media related to Parvathipuram.