పీపీజీ లేదా ఫొటో ప్లెతిస్మోగ్రాంతో కాంతి తరంగాల ద్వారా నాడి యొక్క స్వస్థత, శ్వాసప్రక్రియని తెలుసుకోవచ్చు. పల్స్ ఆక్సీమీటర్ అనే పరికరం ద్వార పీపీజీ ని రికార్డు చేస్తారు. చర్మం మీద కాంతిని వెలువరించి ప్రతిబింబించిన లేదా వక్రీభవించిన కాంతిని గ్రహించి తద్వారా నాడిని కానీ శ్వాసప్రక్రియను కానీ నిర్ధారిస్తారు[1].  

చెవి ఆక్సీమీటర్ నుంచి గ్రహించిన పీపీజీ తరంగం. తరంగం యొక్క అసమాన వ్యాప్తికి కారణం శ్వాస వలన కలిగిన భంగం

గుండె అనునిత్యం శరీరం మొత్తానికీ రక్తాన్ని ప్రసరింపచేస్తుంది.గుండె సంకోచ వ్యాకోచాల ద్వారా రక్త పీడనం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో నరాలయొక్క పరిమాణం ఎప్పుడూ మారుతుంటుంది. ఈ మార్పు వలన చర్మం యొక్క కాంతి శోషణ కూడా మారుతుంది. ఈ మార్పుని కొలిచి గుండె యొక్క స్వస్థతను కనిపెట్టవచ్చు. 

సాధారణంగా ఎల్ ఈ డీ లతో చర్మాన్ని ప్రకాశింపజేసి అవతల వైపు ఒక ఫోటో డయోడ్ ద్వారా చర్మంగుండా ప్రయాణించిన కాంతి తీవ్రతను కొలుస్తారు. చిత్రంలో చూపించినట్లుగా ప్రతి గుండె సంకోచ వ్యాకోచ చక్రం ఒక శిఖరాన్ని సూచిస్తుంది. మనిషి మనిషికీ ఈ తరంగం మారుతూవున్నా గుణం మాత్రం ఒకేలా ఉంటుంది. ఇలా ఈ తరంగం బట్టి గుండె యొక్క పని తీరును లెక్కగట్టవచ్చు[2].  

References మార్చు

  1. K. Shelley and S. Shelley, Pulse Oximeter Waveform: Photoelectric Plethysmography,in Clinical Monitoring, Carol Lake, R. Hines, and C. Blitt, Eds.: W.B. Saunders Company, 2001, pp. 420-428
  2. పీపీజీ ద్వారా గుండె యొక్క స్వస్థత
"https://te.wikipedia.org/w/index.php?title=పీపీజీ&oldid=2891156" నుండి వెలికితీశారు