కుంతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ మాత్రమే చేసాను.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
== బాల్యం ==
పువ్వుపుట్టగానే పరిమలిస్తుంది. కుంతి చిన్ననాడే చాలా బుద్దిమంతురాలనిపించుకుంది.ఆమెను /br/చూస్తే పెద్దలకు ముద్దు వచ్చేది.ఆమె దైవభక్తి, గురుభక్తి, మెచుకోదగ్గవి.ఆ ఇంట్లో కుంతి అంటే ఎంతో అనురాగం వెల్లివిరిసేది. కుంతిభోజుడు క్రొత్తవాడు కాదు; తన తండ్రి మేనత్త కొడుకే. కనుక ఆమెకు చనువు కూడా కావలసినంత వుండేది. తమ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కుంతిభోజుడు కూతురుని పిలిచి ఆమె చేత వారికి పాదాభివందనం చేయించేవాడు, పరిచర్య చేయించేవాడు. ఆశీర్వదించమని అర్థించేవాడు. ఇలా కాలం గడుస్తూ వుంది. చంద్రరేఖ వలె కుంతీకన్య వర్థిల్లుతూ ఉంది.
=='''నీ ఓర్పుకిది గీటురాయి: =='''
ఒక నాడు కుంతిభోజుడు సభలో కొలువై ఉన్నాడు. ఆకస్మికంగా దుర్వాసుడనే ఋషి అచటికి వచ్చెను. ఆయన రుద్రాంశ సంభూతుడు. ఆయనను చూస్తే అందరికీ భయమే, ఆయనకు కోపం ముక్కుమీదే ఉంటుంది. ఆయన శపిస్తే తిరుగు లేదు. అటువంటి చండప్రచండుడైన ఋషికి ఆతిద్యమివ్వాలి. సపర్య చేయాలి. ఆ భారం కుంతిపై పడింది. తండ్రి బిడ్డ శిరస్సు నిమిరుతూ "తల్లీ! నీ ఓర్పుకిది గీటురాయి" అన్నాడు. కుంతి ఆనందంతో
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/కుంతీదేవి" నుండి వెలికితీశారు