ఉన్నమాట: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 1:
ఉన్నమాట వ్యాససంకలనాన్ని ప్రముఖ పాత్రికేయులు, సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి రాశారు.
== రచన నేపథ్యం ==
తెలుగు పత్రికారంగంలో రెండు దశాబ్దాల పాటు సాగిన ఉన్నమాట కాలమ్ నుంచి ఎంపికచేసిన వ్యాసాల సంకలనం ఇది. ఈ శీర్షిక 1990దశకంలో ఆంధ్రప్రభ పత్రిక ఆదివారం సంచికలను వారపత్రికల సైజులో ముద్రించిన సందర్భంగా కొత్తశీర్షిక(కాలమ్) శాస్త్రి ఉన్నమాటను ప్రారంభించారు. 1992 మే 24 తేదీ సంచికలో ''సభవారు చెప్పింది వేదం'' అన్న శీర్షిక(టైటిల్)తో శాసనసభా హక్కుల వైరుధ్యాలను చర్చించే వ్యాసంతో ఉన్నమాట ప్రారంభమైంది. 1994 డిసెంబరులో ఆంధ్రభూమి దినపత్రికకు శాస్త్రి సంపాదకత్వ బాధ్యతలు చేపట్టాకా, [[ఆంధ్రభూమి]] ఆదివారం సంచికలో కాలమ్ కొనసాగింది.<ref>ఉన్నమాట పుస్తకం తొలిముద్రణకు ''ఇదీ సంగతి'' శీర్షికన ఎం.వి.ఆర్.శాస్త్రి ముందుమాట.</ref><br />
విజయవంతంగా కొనసాగిన ఉన్నమాటలో ఎంపిక చేసిన వ్యాసాలను ఆగస్ట్ 2008లో అప్పాజోస్యుల విస్సాభొట్ల ఫౌండేషన్(ప్రస్తుతం అప్పాజోస్యుల విస్సాభొట్ల కాందాళం ఫౌండేషన్) వారు తొలి ముద్రణ చేశారు. దుర్గా పబ్లికేషన్స్ సంస్థ ద్వారా మే 2010లో ద్వితీయ ముద్రణ చేశారు.
 
== రచయిత గురించి ==
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, చరిత్ర రచయిత, కాలమిస్టు. ఆయన 1952 ఏప్రిల్ 22న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు. 1975లో [[ఆంధ్రజ్యోతి]] పత్రికలో విలేకరిగా, 1978 నుంచి 1990 వరకూ [[ఈనాడు]] దినపత్రికలో వివిధ హోదాల్లో అసిస్టెంట్ ఎడిటర్ స్థాయి వరకూ పనిచేశారు. 1990 నుంచి 1994 వరకూ [[ఆంధ్రప్రభ]] దినపత్రికకు సంపాదకునిగా పనిచేస్తున్నారు. 18 సంవత్సరాలుగా [[ఉన్నమాట]], 14 సంవత్సరాలుగా [[వీక్ పాయింట్]] శీర్షికలను నిర్వహించారు. రచయితగా ఆయన [[మన చదువులు]], [[ఉన్నమాట]], [[వీక్ పాయింట్]], [[ఏది చరిత్ర? (పుస్తకం)|ఏది చరిత్ర?]], [[ఇదీ చరిత్ర]], [[1857 (పుస్తకం)|1857]], [[మన మహాత్ముడు]], [[కాశ్మీర్ కథ]], [[కాశ్మీర్ వ్యథ]], [[ఆంధ్రుల కథ]] తదితర గ్రంథాలు రచించారు.
"https://te.wikipedia.org/wiki/ఉన్నమాట" నుండి వెలికితీశారు