నిజాం పాలనలో లంబాడాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''నిజాం పాలనలో లంబాడాలు''' పేరిట భంగ్యా భుక్యా రాసిన పరిశోధన గ్రంథం నిజాం వంశీయుల పరిపాలనలో లంబాడాల జీవనాన్ని వివరించిన పరిశోధన గ్రంథానికి తెలుగు అనువాదం. భంగ్యా ఆంగ్లంలో రాసిన గ్రంథాన్ని రచయిత, అనువాదకుడు ఆకెళ్ళ శివప్రసాద్ అనువదించారు.
== రచన నేపథ్యం ==
సబ్‌జుగేటెడ్ నోమాడ్స్ అనే శీర్షికతో ది లంబాడాస్ అండర్ రూల్ ఆఫ్ నిజాం అనే ఉపశీర్షికతో ఈ గ్రంథాన్ని భంగ్యా భుక్యా ఆంగ్లంలో రచించారు. ఆయన ఆంగ్లంలో 2010లో రచించిన ఈ పుస్తకాన్ని 2012లో అనువాదకుడు, వ్యక్తిత్వవికాస గ్రంథకర్త ఆకెళ్ళ శివప్రసాద్ అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ సంస్థ ఈ గ్రంథాన్ని తెలుగులో ప్రచురించింది.<ref>నిజాం పాలనలో లంబాడాలు:తెలుగు అనువాదానికి ముందుమాట:భంగ్యా భుక్యా</ref>
 
== విషయం ==
నిజాంల పరిపాలనలో లంబాడా వర్గం స్థితిగతుల గురించిన అధ్యయనం ఈ పుస్తకంలోని ముఖ్యవిషయం. మొఘల్ పరిపాలనలో దక్కన్ సుబేదారుగా ప్రారంభమైన నిజాం వంశీకుల అధికారం పోను పోను విస్తరించి స్వతంత్ర్య రాజ్యంగా స్థిరపడింది. అనంతర కాలంలో బ్రిటీష్ పరిపాలనలో కొన్ని ప్రాంతాలను వదులుకొని రాజ్యాన్ని నిలబెట్టుకున్నారు. భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం నిజాం హైదరాబాదును స్వతంత్ర్య రాజ్యంగా ప్రకటించుకున్నారు. 1940 దశకంలో ప్రారంభమైన నిజాం వ్యతిరేక పోరాటం ఉధృతరూపం దాల్చగా తుదకు 1948లో జరిగిన పోలీసు చర్యలో నిజాం రాజ్యాన్ని భారతదేశంలో అంతర్భాగంగా విలీనం చేశారు. ఈ క్రమంలో నిజాం రాజుల పరిపాలనలో లంబాడాల చరిత్రను విశ్లేషించడం ఈ పుస్తకంలోని ఉద్దేశం. అందులో భాగంగా ఆనాటి జీవన విధానం, ఆర్థికస్థితి, సాంఘిక స్థితిగతులు, రాజకీయ వ్యవహారాలు విశ్లేషించారు.