సమాచార హక్కు: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి
చి Wikipedia python library
పంక్తి 1:
[[ప్రభుత్వము| ప్రభుత్వ]] కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే '''సమాచార హక్కు''' (Right to Information). మనం ఏ ఆఫీస్ లో కాలిడినా కావలిసిన సమాచారం పొందుట దుర్లభం. లంచం ఇచ్చుకోనిదే ఫైలు కదలదు. సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయుంచుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం చాలా కస్టo.ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం [[12 అక్టోబర్]] [[2005]] తేదీన ఈ '''సమాచార హక్కు చట్టం''' (Right to Information Act) * <ref>[http://www.persmin.nic.in/RTI/welcomeRTI.htm సమాచారహక్కు ప్రభుత్వవెబ్ సైట్]</ref> భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు [[పార్లమెంటు]], లేక [[విధాన సభ]] లేక [[విధాన పరిషత్]] సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ [[చట్టం]] ద్వారా ప్రజలందరికి కలిగింది,. ప్రభుత్వ అధికారులు అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 16 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి.
 
== సమాచారం ==
పంక్తి 10:
*'ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలు
 
ఏ ప్రభుత్వ యంత్రాంగము వద్దనున్న సమాచారమునైనను సేకరించుకొనే హక్కును సమాచార హక్కు చట్టము 2005 కల్పించుచున్నది. అంటే, సదరు సమాచారమును కలిగిన పనులు, పత్రాలు, రికార్డులు తనిఖీ చేసేందుకు, వాటి యొక్క నోట్సు తీసుకొనేందుకు, ధృవీకృత ప్రతులు పొందేందుకు, ఏదైనా పదార్ధము యొక్క ధృవీకృత నమూనాలు పొందేందుకు, కంప్యూటర్ లేదా ఏదైనా పరికరములో నిక్షిప్తము చేయబడిన సమాచారమును డిస్కెట్లు, ప్లాపీలు, టేపులు, వీడియో కేసెట్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ రూపములో గాని లేదా వాటి ప్రింట్లు గాని పొందేందుకు లేదా సమాచారమును సేకరించుకొనే హక్కును సమాచార హక్కు చట్టము అందుబాటులోకి తెచ్చినది.
 
== అన్వయింపులు ==
పంక్తి 25:
 
'''సమాచారము కోరుచూ నేరుగా సంబంధిత కేంద్ర సమాచార కమిషన్/రాష్ట్ర సమాచార కమిషన్ వారికి దరఖాస్తు చేయరాదు.'''
== సహ చట్టం వివరణలు ==
===అదనపు ఫీజు===
సమాచారం ఇచ్చేందుకు చట్టంలో నిర్దేశించిన రుసుం మినహా ఇతరత్రా ఎలాంటి అదనపు ఫీజు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయకూడదని సమాచార ప్రధాన కమిషనర్‌ తేల్చి చెప్పారు.<ref>ఈనాడు వార్త 9.11.2009 </ref> సాధారణంగా దరఖాస్తు రుసుం 10 రూపాయలు వసూలు చేయాలి. ఇది కాక ముద్రణ రూపంలో సమాచారాన్ని ఇస్తే ప్రతి పేజీకి రూ. 2 చొప్పున ఫోటోస్టాట్‌ ఖర్చుల్ని కూడా వసూలు చేయవచ్చు.కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని సమాచార కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రత్యేకంగా పుస్తకాలు, మ్యాప్‌లు, ప్లాన్లు, డాక్యుమెంట్లు సమకూరిస్తే ఇందుకు సంబంధించిన రుసుంను దరఖాస్తుదారుడి నుంచి వసూలు చేయవచ్చు. అలాగే సమాచారాన్ని తపాలా ద్వారా పంపితే అందుకయ్యే ఖర్చుల్ని కూడా దరఖాస్తుదారుడే చెల్లించాల్సి ఉంటుంది.
 
=== ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల ఆస్తి పాస్తుల వివరాలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఇవ్వాలి.===
పంక్తి 50:
* పీఐవోలు, అప్పిలేట్ అధికారుల్లో అవగాహన పెరగకపోవడానికి సమాచార అధికారికి దస్త్రాలు నమోదు చేయడం, వాటిని కార్యాలయాల్లో ప్రదర్శించడానికే సమయం సరిపోతోంది. కిందిస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వలేకున్నారు.
==అంతర్జ్జాలంలో==
* జీవోల ప్రతుల కోసం వెబ్ సైటు : www.goir.ap.gov.in
* రాస్ట్రప్రభుత్వం: www.apic.gov.in
* కేంద్ర ప్రభుత్వం: www.cic.gov.in. ఇది కేవలం కేంద్ర ప్రభ్యుత్వ కార్యాలయాలలో సమాచారం కోసమే
* తెలుగులో సమాచారచట్టం మరియి దారకాస్తు ఫారాలకోసం: www.rti.eenadu.net అందుబాటులో వున్నాయి.
* ఆఫీసులకు వెళ్ళలేనివాళ్ళు అంతర్జాలంలో సమాచారాన్ని దీనిద్వారా పొందవచ్చు.www.rtionline.gov.in.
 
దరఖాస్తుదారు ఏ ఆఫీసు నుంచయినా తనకవసరమైన సమాచారాన్ని 30 రోజులలోపు పొందవచ్చు. గడువులోగా సమాచారం రానియెడల ప్రజాసమాచార (P.I.O) అధికారికి రు.10/- రుసుం చెల్లించి ధరకాస్తు చేసి 30 రోజులలోపు సమాచారం పొందవచ్చు. ఫీజు ఆఫీసులో చెల్లించి రశీదు పొందవచ్చు. లేదా పోస్టల్ ఆర్డర్ పోస్టాఫీసులో కొని జతపర్చాలి. నాన్ జుడీష్యల్ స్టాంప్ దరకాస్తునకు అంటించాలి. నాన్ జుడీష్యల్ స్టాంప్ కేంద్రప్రభుత్వ కార్యాలయాలల్లో చెల్లదు. 30 రోజులలోపు సమాధానం రానియెడల రాస్ట్రసమాచార కమిషన్ కు దరఖాస్తుచేస్తూ తను ఇంతకుముందు సమర్పించిన దరఖాస్తు నకళ్ళను జతపత్చవలెను.
ప్రభుత్వంనుంచి లబ్ది పొడుతున్న జాతీయ పార్టీలకు కూడా ప్రభుత్వ సంస్థల్లాంటివేననీ, సమాచార హక్కుచట్టం వాటికి వర్తిస్తుందని జాతీయ సమాచార కమిషన్ తీర్పుయిచ్చింది. కానీ పార్టీలు దీని అమలుకు వ్యతిరేకిస్తున్నాయి. ఇది అమలుపర్చిననాడు దేశంలో ఎలాంటి ఇబ్బందులుఓడవు. అప్పడు సువర్ణభాతము అని గర్వంగా చెప్పుకోవచ్చు.
==వినియోగదారుల విజయాలు==
గడ్డిఅన్నారం వినియోగదారుల సంఘం అద్య క్ష్యులు శ్రీ ఎన్. వెంకటేశ్వర్లు సాధించిన కొన్ని విజయాలు.
# రైలులో భోజనం పెడతామని డబ్బులు వసూలుచేసి భోజనం అందించనందుకు రైల్వయ్నుంది రు.500/- నష్టపరిహారం మరియు భోజనం డబ్బు వసూలుచేయటం అయినది.
# కొత్త బస్సులో షిర్డీ ప్రయాణం అనిచెప్పి డొక్కుబస్సువేసి యాత్రికులను ఇబ్బందిపెట్టిన ప్రైవేట్ ట్రావెల్ ఏజంట్ మీద వినియోగదారుల కోర్టులో కేసువేసి తనతోపాటు పదిమందికి పరిహారం ఇప్పించడం జరిగింది.
# బిల్లు కట్టినా టెలీఫోను కనెక్షన్ తీసివేసినందుకు ఆడిపాట్మెంట్ మీద కేసువేసి నష్టపరిహారం పొందారు.
పంక్తి 76:
* [http://rti.eenadu.net/ ఈనాడు ముందడుగు పేరుగల సమాచార హక్కు అంతర్జాల స్థలము]
* [http://pressacademy.ap.gov.in/booksForFree.asp సమాచార హక్కు చట్టం, 2005, వర్కింగ్ జర్నలిస్టుల శిక్షణ మాన్యువల్ ]<br />
*[http://www.nyayabhoomi.org/rti/downloads/RTI_Handbook.pdf సమాచార హక్కు చట్టము కరదీపిక ( ఇంగ్లీషులో) మాదిరి అర్జీలతోకూడినది.]
[[వర్గం:భారత రాజ్యాంగం]]
 
"https://te.wikipedia.org/wiki/సమాచార_హక్కు" నుండి వెలికితీశారు