ఆంధ్రప్రదేశ్ అవతరణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 3:
==ఆంధ్ర ప్రదేశ్ అవతరణ==
[[1953]] లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై వత్తిడి పెరిగింది. హైదరాబాదు ప్రజలు తమ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా
[[1953]] డిసెంబర్ లో సయ్యద్ ఫజల్ ఆలీ నేతృత్వంలో [[రాష్ట్రాల పునర్విభజన కమిషను]] ఏర్పాటయింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, [[తెలంగాణా]] రాష్ట్ర ఏర్పాటును అది సమర్ధించింది. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, [[హైదరాబాదు]] శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. [[హైదరాబాదు]] శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు.
కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్ధించి, ఆంధ్ర తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. ఆ విధంగా వారిమధ్య [[పెద్దమనుషుల ఒప్పందం]] కుదిరింది
[[1956]] [[నవంబర్ 1]]న అప్పటి [[ప్రధానమంత్రి]] [[జవహర్లాల్ నెహ్రూ]] చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించింది. [[నీలం సంజీవ రెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉన్న [[బూరుగుల రామకృష్ణా రావు]]కు [[కేరళ]] గవర్నరు పదవి లభించింది. [[సి.ఎం. త్రివేది]] ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు అయ్యాడు.
|