తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
==మహర్షుల వివరాలు==
===అత్రిమహర్షి===
===[[భృగు మహర్షి]]===
భృగు మహర్షి బ్రహ్మ మానస పుత్రుడైన ప్రజాపతి మరియు సప్తర్షులలో ఒకరు. మొట్టమొదటి జ్యోతిష రచయిత మరియు వేదాల కాలంలో రచించిన భృగు సంహిత కర్త. భృగు మహర్షి బ్రహ్మహృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. వాయు పురాణం ప్రకారం భృగువు మామగారైన దక్షుని యజ్ఞంలో పాల్గొన్నాడు.
 
===మౌద్గల్య మహర్షి===
ముద్గలుడు ఇతఁడు నిర్జితవిషయేంద్రియుఁడు అయి ఉంఛవృత్తిని జీవించుచు దేవపితృ పూజనములు ఆచరించుటయందు దుర్వాసాదిమునులను ప్రమోదమగ్న మానసులుగ చేసెను. మఱియు ఇతఁడు దేవలోకమును ఒల్లక కేవలసత్వమును చేకొని నిర్వికల్పము అయిన జ్ఞానయోగమును అవలంభించి తుల్యనిందాస్తుతియును, సమలోష్ఠకాంచనుఁడును అయి పరమసిద్ధిని పొందెను. 2. అజమీఢుని రెండవ కొడుకు అగు నీలుని వంశస్థుఁడు. తండ్రి భర్మ్యాశ్వుఁడు లేక హర్యశ్వుఁడు. కొడుకు దివోదాసుఁడు. కూఁతురు గౌతముని భార్య అగు అహల్య. ఇతఁడు క్షత్రియుఁడు అయినను తపోమహిమచే ఇతని వంశజులు బ్రాహ్మణులు అయిరి. వారే మౌద్గల్య గోత్రులు.