మాదయ్యగారి మల్లన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''మాదయ్యగారి మల్లన''' [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో ఒకడు. 16వ శతాబ్దపు తెలుగు కవి. ఇతడు శైవబ్రాహ్మణుడు. అప్పటికే మల్లన్న అని మరో కవి ఉండటంచేత ఈయన్ను తండ్రి పేరితోడగూడ జేర్చి మాదయ్యగారి మల్లన్న యని చెప్పుదురు.<ref name=kandukuri />
మల్లన 516 గద్యపద్యములతో కూడిన [[రాజశేఖర చరిత్ర (మాదయ్యగారి మల్లన కావ్యం)|రాజశేఖర చరిత్ర]] అను మూడు అశ్వాసాల కావ్యమును రచించినాడు. ప్రబంధ శైలిలో రచించబడిన రాజశేఖర చరిత్రలో అవంతీ పురాన్ని పాలించే ఒకానొక రాజశేఖరుడు అనే రాజు యొక్క యద్ధ విజయాలను, ప్రణయ విజయాలను వర్ణించాడు. ఈ గ్రంథమును ఈయన [[శ్రీకృష్ణదేవరాయలు|శ్రీకృష్ణదేవరాయల]] ఆస్థానములో చేరకముందే రచించాడు. రాయలసభలో ఉన్నపుడు ఈయన ఏ రచనలు చేసిన ఆధారాలు లేవు. కనీసము సభలో చెప్పిన చాటు పద్యములు కూడా లభ్యము కాలేదు. ఈతని కవిత్వము మృదుమధుర పదగుంభనము కలదయి మనోహరముగా ఉన్నది.<ref name=kandukuri>{{cite book|last1=కందుకూరి|first1=వీరేశలింగం పంతులు|title=ఆంధ్రకవుల చరిత్రము - రెండవ భాగము (మధ్యకాలపు కవులు)|date=1949|publisher=హితకారిణీ సమాజము|location=రాజమండ్రి|page=64|url=https://te.wikisource.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%95%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8|accessdate=7 December 2014}}</ref> సమకాలీన ప్రబంధ కవులకు భిన్నంగా, రాజశేఖర చరిత్ర యొక్క కథ పూర్తిగా మాదయ్యగారి మల్లన మేథోసృష్టే. దీనికి ఎటువంటి సంస్కృతమూలం లేదు. ఈయన సమకాలీనులతో పోలిస్తే, శృంగార వర్ణనలు చాలా సున్నితంగా, పరిమితంగా వ్రాశాడు.
రాయలతోపాటు దండయాత్రలకు, తీర్థయాత్రలకు తప్పకుండా వెళ్లే కవులలో మల్లన ఒకడు. రాయల కొలువులో మొదటినుండి ఉన్నా రాజశేఖర చరిత్రలో రాయల ప్రస్తావన లేదు. ఈయన తన కావ్యమును [[1516]] - [[1520]] మధ్య [[వినుకొండ]], [[గుత్తి]] సీమలను పరిపాలించిన [[నాదెండ్ల అప్పమంత్రి]] కి అంకితమిచ్చాడు. అప్పమంత్రి [[తిమ్మరుసు]] మేనల్లుడు మరియు అల్లుడు.
|