బాబర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
బాబరు ప్రశంసనీయమగు విమర్సనాశక్తిని, పర్షియన్, అరేబియన్, తుర్కీ భాషలలో అద్వితీయమగు పాండిత్యమును కలిగి యుండెను. తుర్కీ భాషలో ఈతడు పెక్కు కావ్యములను, చంధశాస్త్రములను రచించెను. సంగీతమునను, ధర్మశాస్త్రమునను కూడా ఈతనిచే రచింపబడిన గ్రంధములు కలవు. తనజీవతమందు వివిధ విశేషములను తెలియపరచు స్వీయ చరిత్రము చరిత్రమునకును, వాజ్మయమునకును మిగుల ముఖ్యమైనది. నిరాడంబరమును, స్వాభావికమగుశైలి యీతని గద్యపద్యములకు గల ముఖ్యలక్షణము. నూతనమగు ఒక చంధస్సును, మరియొక అపూర్య లిపి ఈతనిచే కనుగొనబడినది. చిత్రలేఖనమున గూడ బాబరుకు అభిరుచి మెండుగా నుండెడిది. ఈపాదుషా విద్వాంసుల సమావేసములందును, గ్రంధాలయములందును విశేషకాలముగడుపుచుండెనట
== సంపద ==
ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోఢి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబరు చేతిలో ఓటమిపాలై, చివరకు మరణించారు. ఇబ్రహీం లోఢీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమయ్యింది. హుమాయున్‌కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్‌తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్యవస్తువులు దానం చేయాల్సిందిగా సలహాఇచ్చారు. తనవద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని, ఆపైన కొద్దిరోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవదర్పణం చేసినా వజ్రాన్ని నిలపుకున్నారని అక్బరునామాలో వ్రాశారు. ఈ కారణంగా 1530లో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది.
 
==హుమాయూన్‌కు బాబరు వ్రాసిన వీలునామా==
"https://te.wikipedia.org/wiki/బాబర్" నుండి వెలికితీశారు