పరవస్తు వెంకట రంగాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: శ్రేష్ట → శ్రేష్ఠ using AWB
పంక్తి 36:
'''పరవస్తు వెంకట రంగాచార్యులు''' సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త మరియు చెప్పుకోదగిన తెలుగు కవి. తర్కము మరియు వ్యాకరణాలలో నిష్ణాతుడు.
రంగాచార్యులు [[1822]], [[మే 22]]న [[విశాఖపట్నం]]లో శ్రీనివాసాచార్యులు, మంగమ్మ దంపతులకు జన్మించాడు. ఎనిమిదేళ్ల వయసులోనే సంస్కృతములో 'కుంభకర్ణ విజయము' అనే కావ్యమును రచించాడు. [[ఉర్లాం]], [[విజయనగరం]] మరియు [[మైసూరు]] మహారాజులు ఈయనను గౌరవించి సత్కరించారు. అన్నింటి కంటే మించి ఈయన శతావధానములో నిష్ణాతుడై ''మహా మహోపాధ్యాయ'' అన్న బిరుదు పొందినాడు. ఈయన తెలుగు సాహిత్యములో శ్రేష్టశ్రేష్ఠ గ్రంధాలుగా ఎన్నదగిన ''కమలిని కలహంసము'', ''వేద రహస్యము'' మరియు ''మంజుల నైషదము'' లను రచించాడు.
 
తెలుగు వాజ్ఞ్మయము వ్యాపనకు ఈయన సలిపిన కృషి అత్యంత ప్రశంసనీయము. రంగాచార్యులు [[భారతదేశము]]లో క్రైస్తవ మత బోధనలను వ్యతిరేకించాడు. హిందూ తత్వము మరియు సంస్కృతులకు గట్టి మద్దతునిచ్చాడు. ఈయన చివరి రోజులు [[తుని]]లో గడిపాడు.
పంక్తి 43:
 
పరవస్తు వెంకట రంగాచార్యులు గారు తెలుగులో ప్రప్రధమముగా ఒక [[విజ్ఞాన సర్వస్వము]]ను ఆరంభించిన కృషీవలులు. ఆయన 40 సంవత్సరములు శ్రమించి "అ", "ఆ" వరకు మాత్రము పూర్తి చేయగలిగినారు. తరువాత బృహత్కార్యక్రమము [[కొమర్రాజు లక్ష్మణరావు]] గారు చేపట్టారు.
 
 
ప్రత్యేకించి ఈ "[[తెలుగు వికీపీడియా]]" కార్యక్రమము కొనసాగుతున్న నేపథ్యములో ఆయనను స్మరించుకొనుట మన కర్తవ్యము.
 
 
ఈయన [[1900]] [[జనవరి 20]]న [[తుని]] లో మరణించాడు.