తాపీ ధర్మారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
==జీవిత చరిత్ర==
ధర్మారావు [[1887]] సంవత్సరంలో [[సెప్టెంబరు 19]]న ప్రస్తుతం [[ఒరిస్సా]]లో ఉన్న [[బెర్హంపూరు]] ([[బరంపురం]] )లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. ఈయన [[మాలపిల్ల]], [[రైతుబిడ్డ]] మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాధమిక విద్యను [[శ్రీకాకుళం]]లో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని [[మద్రాసు]]లోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. [[పర్లాకిమిడి]]లో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన [[గిడుగు రామ్మూర్తి]] ఈయనకు గురువు కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి [[ఇంటి పేరు]] మొదట్లో "బండి" లేదా "బండారు" కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పని చేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో "తాపీ లక్ష్మయ్యగారు" అన్న పేరు స్థిరపడిపోయిందట. [[కల్లికోట]] రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. '[[కొండెగాడు']], '[[సమదర్శిని']], '[[జనవాణి']], '[[కాగడా']] మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను [[1973]] [[మే 8]]న మరణించాడు. తెలుగు సినిమా దర్శకులు [[తాపీ చాణక్య]] ఇతని కుమారుడు.
 
==సినిమా జీవితం==
"https://te.wikipedia.org/wiki/తాపీ_ధర్మారావు" నుండి వెలికితీశారు