అముద్రిత గ్రంథ చింతామణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
==చరిత్ర==
నెల్లూరులోని విక్టోరియా ముద్రాక్షరశాలలో ముద్రించబడిన ఈ పత్రిక ప్రారంభించే సమయానికి [[పూండ్ల రామకృష్ణయ్య]] వయసు పాతిక సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసులోనే వీరనాగయ్య ఒడయరు సహాయ సంపాదకత్వంలో వెంకటగిరి మహారాజా గోపాలకృష్ణ యాచేంద్ర బహద్దరు ఆర్థిక సహకారంతో ఈ పత్రికను ప్రారంభించాడు. నాలుగు సంవత్సరాలు పత్రిక నడచిన తరువాత ఎందువల్లనో వీరనాగయ్య పత్రిక నుంచి తప్పుకున్నాడు. అయినా [[పూండ్ల రామకృష్ణయ్య]] ఒక్కడే ఈ పత్రికను నిరాటంకంగా తను మరణిచేంత వరకూ అంటే [[1904]], [[జూన్]] నెల వరకు ఈ పత్రికను నడిపాడు.
 
అముద్రితంగా తాళపత్ర్రాల రూపంలో పడిఉన్న అనేక తెలుగు గ్రంథాలను పత్రికలో ప్రచురించడం సంకల్పమైనప్పటికీ ప్రారంభం నుండి ఈ పత్రిక విమర్శలకు, చర్చలకు కూడా వేదిక అయ్యింది. చాటుపద్యాల ప్రచురణ మొదటిసారిగా ఈ పత్రికలోనే ప్రారంభమైంది.