జయంతి రామయ్య పంతులు: కూర్పుల మధ్య తేడాలు

రామయ్య పంతులు బొమ్మ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
'''జయంతి రామయ్య పంతులు''' ([[1860]] - [[1941]]) కవి మరియు శాసన పరిశోధకులు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. దీని కారణంగా ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్యమైన స్థానం పొందారు.
 
==బాల్యం, విద్య==
వీరు కోనసీమలోని [[ముక్తేశ్వరం]] గ్రామంలో [[జూలై 18]], [[1860]] సంవత్సరంలో జన్మించారు. సంస్కృతాంధ్ర భాషలలో ప్రాధమిక విద్యాభ్యాసం తరువాత రాజమండ్రిలో ఆంగ్లభాష అభ్యసించారు. 1882లో పట్టభద్రులై 1884 వరకు [[పిఠాపురం]] మహారాజా వారి పాఠశాలలో ప్రధాన అధ్యపకునిగా పనిచేశారు. తరువాత న్యాయవాది పరీక్షలో ఉత్తీర్ణులై ప్రభుత్వ మండలాధికారిగా చేరారు. 1911లో రాష్ట్ర న్యాయాధీశులయ్యారు.
 
Line 45 ⟶ 46:
 
వీరు రాష్ట్ర న్యాయాధీశులుగా [[పిఠాపురం]],[[ బొబ్బిలి]], [[వెంకటగిరి]] సంస్థానాధీశుల ప్రోత్సాహంతో [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] ను ఏర్పాటుచేశారు. దానికి ఐదు వేల తాళపత్ర గ్రంధాలను సేకరించారు. ఈ పరిషత్తు మొదట చెన్నపురిలో ఉండి తరువాత కాకినాడకు మార్చబడినది. [[ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక]] ను ప్రకటించి దానిలో ఎన్నో ఆముద్రిత గ్రంథాలను ముద్రించారు.
 
==రచనలు==
 
వీరు రససిద్ధులైన కవి. ఉత్తర రామచరిత్ర, చంపూ రామాయణం వీరి స్వతంత్ర రచనలు. పిఠాపురం మహారాజా వారి ఆధిక సహాయంతో "[[సూర్యారాయంధ్ర నిఘంటువు]]"ను 1936లో రచించారు. "[[ఆధునికాంధ్ర వాజ్మయ వికాస వైఖరి]]" (1937) అనే విమర్శనాత్మక గ్రంథాన్ని రచించారు. ఆంగ్రభాషలో "డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు", "ద్రవిడియన్ లెక్సికోగ్రఫీ" (1925) అనే భాషా గ్రంథాలు రచించారు. వీరు గ్రాంథిక భాషావాది.