తిరుపతి (పెద్దాపురం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) |
JVRKPRASAD (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 91:
|footnotes =
}}
''' తిరుపతి, పెద్దాపురం''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[పెద్దాపురం]] మండలానికి చెందిన గ్రామము
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలో ఉన్న ఒకానొక గ్రామం తిరుపతి. దీనిని చదలవాడ తిరుపతి, తొలి తిరుపతి అని అంటారు. ఇక్కడ స్వామి వారి పేరు శ్రీ శృంగార వల్లభస్వామి. సామర్లకోట రైల్వే స్టేషను నుంచి 12 కి.మీ, రాజమండ్రికి 45 కి.మీ దూరంలో ఉంది. ఈ ఆలయ స్తంభాలపై ఉన్న శిలా శాసనములను బట్టి 9 వేల సంవత్సరముల చరిత్ర గలదిగా తెలుస్తోంది. ఈ స్వామి ప్రత్యేకత ఏమంటే “ఎవరు ఎంత ఎత్తు ఉంటే వారికి అంతే ఎత్తు కనబడతాడు”.
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,949. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1,490, మహిళల సంఖ్య 1,459, గ్రామంలో నివాసగ్రుహాలు 698 ఉన్నాయి.
== ప్రార్ధనాస్థలాలు ==
=== లక్ష్మీ సహిత శృంగార వల్లభస్వామి ===
Line 128 ⟶ 103:
అలా బయలుదేరిన ధృవుడు, ఈ కీకారణ్య ప్రదేశమునకు చేరుకున్నడు. ఇచ్చట శాండిల్య మహాముని ఆశ్రమం ఉన్నది. ఆ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధృవుని చూచి, అతని మనసులోని కోరిక తెలిసినవాడై, ముని అతన్ని పిలిచి “నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ రూపం తలుచుకొంటూ తపస్సు చెయ్యి. స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పినారు. మునీశ్వరులు చెప్పినట్లుగా తపమాచరించుట మొదలుపెట్టినాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత, ధృవుని తపస్సుకి మెచ్చినవాడై విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూచి ధృవుడు భయపడ్డాడు. అంతట విష్ణువు “బాలక భయమెందుకు తత్తరపాటు చెందకు నేను నీ అంతే కదా ఉన్నాను” అని నవ్వుతూ పలుకటయే కాకుండా చెక్కిళ్ళు ఒత్తి భయము లేకుండా చేసినాడు. స్వామి అక్కడే శిలారూపంలో వెలసినాడు.
=== ఆలయప్రశస్థి ===
దృవునకు ప్రత్యక్షమైన విష్ణుమూర్తి శ్రీ శృంగార వల్లభస్వామిగా పేరుగాంచాడు. విష్ణువు దృవునితో “నీ అంతే ఉన్నాను కదా” అన్ని చెప్పిన కారణంగా చూసే భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంతే ఉన్నట్లుగా దర్శనమిస్తాడు స్వామి. చెక్కిళ్ళు ఒత్తిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన శంఖు చక్రములు ఎడమ, కుడిలకు ఉంటాయి. స్వామి వారు వెలిసిన కొంతకాలానికి దేవతలు వచ్చి స్వామి వారికి ఆలయనిర్మాణం చేసినారు. తరువాత లక్ష్మీదేవి, నారదుడు. ఈ యుగమున శ్రీ కృష్ణదేవరాయలు వారు భూదేవి అమ్మవారి తామ్ర విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు శిలాశాసనములు ద్వారా తెలియచున్నది. భోజమహారాజు, భట్టివిక్రమార్కులు, రుద్రమదేవి, పెద్దాపురం సంస్థాన మహారాణులు ఈ స్వామిని దర్శించుకొన్నవారిలో కొందరు. విక్టోరియా మహారాణి స్వామిని దర్శించి వెండి కవచము చేయించినట్లు చెబుతారు. పిఠాపురం రాజులు స్వామి వారికి 600 ఎకరాల భూమిని దానం ఇచ్చారు. కాని ప్రస్తుతం 21 ఎకరాలు మిగిలింది. నిత్య దీపధూప నైవేద్యాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం దివ్యంగా జరుగుతుంది. అయితే ఈ ఆలయమునకు అంతగా ప్రచారం లేకపోవడం వలన కేవలం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలే ఎక్కువగా దర్శించుకొంటారు.
==మూలాలు==
<references/>
{{పెద్దాపురం మండలంలోని గ్రామాలు}}
|