యామిజాల సుశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
==ప్రవచనాలు ==
[[File:యామిజాల సుశర్మ.jpg|thumb|తణుకు శ్రీ రామకృష్ణ సేవాసమితి లో శ్రీ శంకరాచార్య స్తోత్ర వైభవం ప్రవచనం]]
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ।
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం॥
తణుకు లోని ప్రముఖ సంస్థ శ్రీ రామకృష్ణ సేవాసమితి లో ఆగస్టు 3 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు జరిగిన జగద్గురు ఆది శంకరాచార్య స్తోత్ర వైభవం పై ప్రముఖ కవి మరియు స్థానిక సాహితీ పీఠం శ్రీ నన్నయ భట్టారక పీఠం ప్రధాన కార్యదర్శి శ్రీ సుశర్మ గారి ప్రవచనాలు చాలా అద్భుతంగా జరిగాయి.ఆరు రోజులపాటు ప్రతీ రోజూ సాయంత్రం 6.30 గంటలనుండి 8 గంటల వరకూ జరిగాయి.అందులోని ముఖ్య విషయం గురు పరంపరలోని గురువు లందరినీ స్మరించుకుని ధన్యులయిన పుణ్య దినం.ప్రస్తుతమ్ మన దేశంలో భక్తి,జ్ఞాన రంగాలలో గురువులు ఎవరు ఎటువంటి విధానాలను ప్రబోధించినా దానికి ప్రేరణ ,ఆత్మ సంకల్పం సాక్షాత్తూ శ్రీ వేద వ్యాసులే "వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం"భగవద్గీతను సమస్త లోకానికీ బోధించిన శ్రీ కృష్ణుడు జగద్గురువు "కృష్ణం వందే జగద్గురుం "అంటారు అందుకే.అలాంటి భగవద్గీత ను గ్రంధస్తం చేసి భారతీయులకు అందించిన వేదవ్యాస మహర్షి ఇంకొక జగద్గురువు "వ్యాసం వందే జగద్గురుం "ఉపనిషత్తులకు ,బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాసి మనకు అందించిన శ్రీ ఆది శంకర భగవత్పాదులు ఇంకో జగద్గురువు!ఈ సృష్టి ఉన్నంతవరకూ భారత దేశమంతటా భక్తజన బృందాలూ ,దేవాలయాల్లోనూ పఠించి తరించే స్తోత్ర శ్లోకాలలో 80 శాతం శ్రీ శంకరాచార్య కృతమే .వేలాది సంవత్సరాలుగా గురుశిష్య పరంపరగా మనవరకూ అందించిన మహానుభావులూ పరమగురువులూ వేల మంది ఉన్నారు.ఐతే భారతీయ విద్యలన్నింటి లోకీ ఆధ్యాత్మిక విద్య ఉత్తమోత్తమంగా భావిస్తాము సదాశివ సమారంభాం శంకరాచార్య మాధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం "నారాయణం పద్మభువం వసిష్టం శక్తిం చ తత్పుత్రం పరాశారంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్రం తదస్య శిష్యం శ్రీ శంకరాచార్య ఆధాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తమ్ తోటకం వార్తికాకార మన్యాన్ అస్మద్ గురూన్ సంతతమాన తోస్మి .ఆదిలో ఈ జ్ఞానాన్ని నిర్గుణ పరతత్వమైన ఈశ్వరుడి నుండి గ్రహించిన నారాయణుడితో గురు పరంపర ఆరంభమై నారాయణుడి నుండి బ్రహ్మకు,బ్రహ్మ నుండి వసిష్టుడికి,వశిష్టుడి నుండి శక్తికి,శక్తి నుండి పరాశరునుకి ,పరాశరుని నుండి శుకుడికి,శుకుడి ద్వారా గౌడ పాదునికి ,గౌడపాదుని నుండి గోవింద భగవత్పాదులకు వారి నుంచి శ్రీ శంకరాచార్యులకు వారి ద్వారా పద్మపాదుడు,హస్తామలకుడు,సురేశ్వరుడు,తోటకాచార్యులకు లభించినది.ఇలా పరంపరా గతమై తమ గురువు వరకు సంక్రమించిన ఈ అవిచ్చిన్న పరంపరను స్మరించుకుని తరిద్దాము.ఇలా మొదటి రోజునుండి చివరి రోజువరకూ ఎంతో ఆసక్తి కరంగా వారి స్తోత్రాలలోని వైభవాన్ని హృద్యంగా వర్ణించి చెప్పారు.
 
"https://te.wikipedia.org/wiki/యామిజాల_సుశర్మ" నుండి వెలికితీశారు