అతడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
=== అభివృద్ధి ===
పద్మాలయా స్టూడియోస్ లో [[త్రివిక్రం శ్రీనివాస్]] అతడు సినిమా కథను మహేష్ బాబుకి వివరించారు. విన్నాకా ఆ కథ నచ్చి మహేష్ తన తండ్రి, పద్మాలయా స్టూడియోస్ అధినేత, నటుడు కృష్ణకు కూడా వివరించారు. ఆయనకు కూడా సినిమా నచ్చడంతో పద్మాలయా బ్యానర్ పైనే సినిమా తీద్దామని వారు భావించారు. అప్పటికి త్రివిక్రం [[నువ్వే నువ్వే]] సినిమాకు దర్శకత్వం వహిస్తూండగా, [[మహేష్ బాబు]] టక్కరి దొంగ సినిమా చేస్తున్నారు. అయితే త్రివిక్రం శ్రీనివాస్ దర్శకుడు కాక ముందే ఆయన ప్రతిభ గుర్తించిన నటుడు, వ్యాపారవేత్త, నిర్మాత [[మురళీ మోహన్]] తన [[జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్]] బ్యానర్లో ఓ సినిమా చేయాలని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కాకుంటే అంతకుముందే స్రవంతి రవికిషోర్ కు ఒప్పుకోవడంతో త్రివిక్రం రెండవ సినిమా జయభేరి బ్యానర్లో చేస్తానని మాటయిచ్చారు. అదే విషయాన్ని మహేష్ బాబుకు చెప్పి, ఈ సినిమా జయభేరి సంస్థలో తీద్దామనడంతో అలాగే ఆలోచించి చూద్దామని చెప్పారు.<br />
ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకునిగా తొలి సినిమా నువ్వే నువ్వే పూర్తిచేశారు. రచయితగా [[విజయ భాస్కర్]], [[చిరంజీవి]] కాంబినేషన్లో [[జై చిరంజీవ]]కు కథ-స్క్రీన్ ప్లే-మాటలు రాసి ఇచ్చారు. మహేష్ కథానాయకునిగా [[టక్కరి దొంగ]], [[బాబి]], [[ఒక్కడు]], [[నిజం (సినిమా)|నిజం]] సినిమాలు పూర్తిచేశారు. [[నాని]], [[అర్జున్ (2004 సినిమా)|అర్జున్]] సినిమాలు షూటింగ్ సాగుతూండగా మహేష్, త్రివిక్రమ్ ని ఈ సినిమా విషయమై తిరిగి సంప్రదించారు. దాంతో సినిమాను మహేష్ ఓకే చేసిన 3 సంవత్సరాలకు ప్రారంభించారు.<br />
జయభేరి ప్రొడక్షన్స్ ఆఫీసులో సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యకలాపాలు పూర్తిచేశారు.
=== నటీనటుల ఎంపిక ===
 
==పాత్రలు-పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/అతడు_(సినిమా)" నుండి వెలికితీశారు