విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
సన్యాసం తీసుకొన్నాక, విద్యారణ్యుడు [[కాశీ]] కి తీర్థయాత్రకు వెడతాడు. అక్కడ నుండి [[వ్యాసుడు|వేదవ్యాసుల]] మార్గదర్శకత్వములో బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ శ్రీ విద్య గ్రహిస్తాడు. ఉత్తర భారత యాత్ర పూర్తి చేశాక తిరిగి దక్షిణ భారత దేశానికి వచ్చి [[హంపి]] సమీపంలో ఉన్న మాతంగ పర్వతం వద్ద యోగ నిష్ఠలో కొంత కాలం గడిపాడు. అలా కాలం గడుపుతున్న సమయములో ఒక రోజు భారద్వాజస [[గోత్రం|గోత్రీకుడైన]] మయన కుమారులు మాధవ ,శయనలు విద్యారణ్యుడి దర్శనం చేసుకొంటారు. అప్పుడు విద్యారణ్యుడు తాను అసంపూర్తిగా రచించి వదిలి పెట్టిన వేదభాష్యాలను పూర్తి చేయమని వారితో చెబుతాడు. ఆ వేదభాష్యాలకు వారి పేర్లు పెట్టమనికూడా చెబుతాడు.ఆవిధంగా అవి శయనీయం, మాధవీయం అని ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ తరువాత కాలంలో వీరు [[మొదటి హరిహర రాయలు|హరిహరరాయలు]] , [[మొదటి బుక్క రాయలు|బుక్క రాయలు]] ఆస్థానంలో మంత్రులుగా పనిచేశారు.
 
==విజయ నగరవిజయనగర సామ్రాజ్య స్థాపన==
అప్పటి [[ఢిల్లీ]] సుల్తాను [[దక్షిణ భారతదేశం]] పై యుద్ధం చేసి [[మొదటి హరిహర రాయలు|హరిహర రాయలు]], బుక్కరాయలు లను బందీచేసి, ఖైదుగా ఢిల్లీ తీసుకెళ్ళుతాడు. బుక్కరాయలు, హరిహర రాయలలను [[ఇస్లాం]] మతం తీసుకోవాలని బలవంత పెడుతాడు. కాని వారు ససేమిరా అని నిరాకరించడముతో ఢిల్లీ సుల్తాను వారిరువురి విక్రమ ప్రరాక్రమాలను చూసి వారిద్దరినీ దక్షిణభారతదేశం లో దండయాత్రలు నిరోధించడానికి సేనాధిపతుల గా చేసి పంపుతాడు. వారిరివురు ఇదే అవకాశంగా తీసుకొని తమకు తాము స్వాతంత్ర్యం ప్రకటించుకొని తమకు స్వప్నములో వచ్చిన మార్గదర్శకత్వం ప్రకారం మతంగ పర్వతం మీద తపస్సు చేసుకొంటున్న విద్యారణ్యుని వద్దకు వెళ్ళి తమ గురించి చెబుతారు. విద్యారణ్యుడు వారిద్దరిని ఆశీర్వదించి, [[తుంగభద్ర నది]]కి కుడి వైపు సామ్రాజ్యస్థాపన చెయ్యమని సూచిస్తాడు. ఆ తరువాత వారు సామ్రాజ్యాన్ని తుంగభద్రానదికి ఎడమ వైపుకు కూడా విస్తరిస్తారు. రాజ్యం ఎడమ వైపుకు విస్తరణ జరిగినప్పుడు విద్యారణ్యుని గౌరవార్థంగా రాజధానికి విద్యానగరం అని పేరు పెడతారు. విద్యారణ్యుడు వారికి హంపి నగరం రూపానికి శ్రీచక్రము ఆధారం గా ప్రణాళిక తయారుచేస్తాడు. నగర మధ్యంలో విరుపాక్ష దేవాలయము ఉండేలాగ , కోటకు 9 గుమ్మాలతో నగరాన్ని నిర్మిస్తాడు. ఆ సామ్రాజ్యానికి రాజధాని పేరు క్రమంగా విజయనగరం (విజయాన్ని ప్రసాదించే నగరం కాబట్టి)గా మారుతుంది. క్రీ.శ.1336 రాగి ఫలకం అధారంగా "విద్యారణ్యుడి ఆధ్వర్యములో హరిహర రాయలు సింహాసనం అధిష్టించాడు" అని తెలుస్తోంది. విద్యారణుడు హరిహరునికి ఆత్మ విద్య బోధించి "శ్రీమద్రాజాధిరాజ రాజపరమేశ్వర అపరిమిత ప్రతాపవీర నరపతి" అనే బిరుదాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు శృంగేరి శంకర మఠం పీఠాధిపతి బిరుదులలో "కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య" కూడా చేర్చి చెబుతారు.
 
"https://te.wikipedia.org/wiki/విద్యారణ్యుడు" నుండి వెలికితీశారు