కృష్ణమాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తెలుగున తొలి వచనకావ్యకర్తయు, వచన సంకీర్తన వాజ్మయమునకు మూల పురుషుడును, వైష్ణవభకతాగ్రేసరుడు నగు ఈ శ్రీకాంత కృష్ణామాచార్యుడు [[కాకతీయులు]] చక్రవర్తులలో కడపటి వాడగు రెండవ [[ప్రతాపరుద్రుడు]] కాలమున, అనగా క్రీ.శ.1295 నుండి 1326 వరకు గల కాలమున వెలసిల్లె నని [[ప్రతాపచరిత్రము]], [[ఏకశిలానగర వృత్తాంతము]] ను చెప్పుచున్నవి. తిరుపతి దేవస్థానమున సంకీర్తనాచార్యులలో ప్రధములు [[తాళ్ళపాక అన్నమాచార్యులు]] గారు కృష్ణమాచార్యుని తమ [[సంకీర్తనలక్షణము]] న పేర్కొనుటచే ఈకాలము ధ్రువమగుచున్నది. అన్నమయ్యగారి మనుమడు చిన్నన్న తన [[పరమయోగివిలాసము]] న ఈతననిని ప్రశంసించియున్నాడు. ఇంతేకాక [[ఆచార్య సూక్తి ముక్తావళి]] యందు ఈతని ప్రశంస కలదు. వీనిని బట్టి చూడ కృష్ణమాచార్యుడు వైష్ణవమత వాజ్మయమున ఆంధ్రదేశమున ప్రధమాచార్యుడని చెప్పవచ్చును.<ref>{{cite book|last1=శేషయ్య|first1=చాగంటి|title=ఆంధ్రకవి తరంగిణి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=aan%27dhra%20kavi%20taran%27gind-i%20gran%27tha%2014&author1=&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1949%20&language1=Telugu&pages=287&barcode=2030020029705&author2=&identifier1=&publisher1=aan%27dhra%20prachaarind-i%20limit%27ed%27&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=&numberedpages1=264&unnumberedpages1=25&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0191/560|accessdate=2 January 2015}}</ref>
 
==పుట్టుక==
క్రిష్ణమయ్య తన `జన్మ సంకీర్తన' లో తాను `తారణ' నామ సంవత్సరం,భాద్రపద కృష్ణ చతుర్దశి ,మంగళ వారం నాడు జ్యేష్టా నక్షత్రములో సంతూరు అనే గ్రామంలోజన్మించాననీ,తాను పుట్టుకతోనే అంధుడననీ, అందువల్ల తనజననీజనకులు తనను ఒక పాడైపోయిన నూతిలో పడవేయగా కృష్ణ కువ్వారు స్వామి అనే ఒక సాధువు తనను కాపాడి తమ ఆశ్రమానికి తీసుకుపోయి పెంచి పెద్దచేసారనీ నృసింహస్వామి అనుగ్రహంతో తనకి చూపు వచ్చిందనీ ,ఆయన ఆదేశం మేరకే తాను నాల్గు లక్షలకీర్తనలతో వాక్పూజ చేసినట్టు రాసుకున్నారు
 
ఈతడు [[సింహాచలం]] క్షేత్ర నివాసి అని, సింహాచల నరసింహస్వామికి భక్తుడై అతని పేర అనేక సంకీర్తనలు రచయించెనని [[సింహాచలక్షేత్ర మహత్యము]] తెలుపుచున్నది. సింహగిరి నరహరివచనము లను పేర సంకీర్తనలు కృష్ణమాచార్యుల వారివి నేటికిని వెలయచుండుటచే నిది నిజమని చెప్పవచ్చును.
"https://te.wikipedia.org/wiki/కృష్ణమాచార్యుడు" నుండి వెలికితీశారు