సింగరేణి బొగ్గుగనులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
తెలంగాణాలో సిరుల మాగాణి [[సింగరేణి]]. 125 ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో మొదలైన సింగరేణి సంస్థ క్రమక్రమంగా నాలుగు జిల్లాలకు విస్తరించింది. 23 డిసెంబర్ 1920న పబ్లిక్ సెక్టార్ కంపెనీగా అవతరించింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ... దేశంలో వేలాది పరిశ్రమలకు ఇంధనాన్ని అందిస్తున్న నల్ల బంగారుగని 'సింగరేణి'.తరువాత కాలంలో నిజాం ప్రభువుల ఆధీనంలోకి కంపెనీ వెళ్లింది. సింగరేణిపై అధికారం తరువాత హైదరాబాద్ రాష్ట్రానికి వెళ్లింది.1920లో ఈ సంస్థ పేరును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా మార్పు చేశారు కాబట్టి ఆ రోజును 93వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నది.
==విస్థరణ==
మొదట్లో చాల కొద్ది ప్రాంతానికే పరిమితమైన ఈ [[బొగ్గు]] గనులు కాల గమనంలో ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి లోయలో 350 కిలో మీటర్ల మేర నిక్షిప్తమై ఉన్న అపార బొగ్గు ఖనిజాన్ని ఈ సంస్థ తవ్వి తీస్తోంది. దక్షిణ భారత దేశంలో సుమారు నాలుగు వేల పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కావలసిన ఇంధనం ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంలో కొనసాగుతోంది.
==బొగ్గు నిక్షేపాలు ఇలా బయటపడ్డాయి==
|