శీరిపి ఆంజనేయులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 39:
==జీవిత విశేషాలు==
ధర్మవరం వీధిబడులలోను, మిషన్ స్కూలులోను ఇతని ప్రాథమిక విద్య సాగింది.
ఇతడు సాహిత్య పోషణ మాత్రమే కాకుండా భూరిదానములు చేశాడు. ఆంధ్రప్రదేశ్ సర్వోదయ భూదాన సమితికి 72 ఎకరాల నేలను దానం చేశాడు. 1949లో ధర్మవరం రైల్వేజంక్షన్ పడమరవైపు 120 ఎకరాల సొంతనేలలో ఆంజనేయపురం అనే పేటను నెలకొల్పాడు.
ధర్మవరం చెరువును శ్రీ క్రియాశక్తి యొడయరు నిర్మించి తన తల్లి ధర్మాంబ జ్ఞాపకార్థం గ్రామ నిర్మాణం చేసి ధర్మవరం అను పేరుపెట్టాడు. ప్రజలలో విద్యా విజ్ఞాన వికాసానికి పాటుపడవలెనను సంకల్పంతో తన కుటీరంలోనే "శ్రీ క్రియాశక్తి యొడయరు" పేరిట ఒక గ్రంథాలయమును స్థాపించాడు శీరిపి ఆంజనేయులు. పట్టణంలోని దాతల సహాయంతో 1 డిసెంబరు 1915 తేదీన శ్రీ క్రియాశక్తి యొడయరు సమాజాన్ని ఏర్పాటుచేసి గ్రంథాలయాన్ని అక్కడికి తరలించాడు. దాదాపు పదేళ్ళు ఈ గ్రంథాలయానికి కార్యదర్శిగా నిస్వార్థసేవ చేశాడు. ఈ గ్రంథాలయం 1960 వరకు స్వచ్ఛంద సేవా కార్యకర్తల నిర్వహణలోనే అభివృద్ధి గాంచింది. 1960లో జిల్లాగ్రంథాలయసంస్థ ధర్మవరంలో శాఖా గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసినపుడు దీనిని ఆ సంస్థకు అప్పగించాడు.
|