జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
కుప్పుస్వామి కుమారుడు [[జాగర్లమూడి చంద్రమౌళి]]. ఇతడు తండ్రిని మించిన దాత మరియు విద్యాపోషకుడు.
 
'''పండిత పోషకుడు జాగర్లమూడి'''
కవి పండిత పోషకునిగా . నిష్కలంక రాజకీయవేత్తగా. సంఘ సేవకునిగా . ధార్మికవేత్తగా . విద్యాదాతగా జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి చరిత్ర
గుంటూరు జిల్లా పుటల్లో సువర్ణాక్షర లిఖితం<ref>http://epaper.andhrajyothy.com/c/11695336</ref>.
అవిభక్త గుంటూరు జిల్లాల అంతర్భాగమైన కారంచేడు గ్రామంలో లక్ష్మయ్య, రంగమ్మ దంపతులకు 1892 ఆగస్టు 15న కుప్పస్వామి చౌదరి జన్మించారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించినా రైతాంగ సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. ఆంగ్ల భాష ఆవశ్యకతను
గుర్తించి కులమతా లతో సంబంధం లేకుండా విద్య అందరికీ చేరువ కావడానికి కృషి చేశారు. జస్టిస్ పార్టీలో చేరినా ఆ పార్టీ సిద్ధాంతాలకు లోబడక విద్యా వ్యాప్తికి అన్ని కులాల వారినీ పోత్సహించారు. 1920లో మద్రాసు రాష్ర శాసనసభకు గుంటూరు జిల్లా నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1936 వరకు అన్ని ఎన్నికలలోనూ కుప్పస్వామి గెలుపొందడం గమనా రం. 1927లో గుంటూరు జిల్లా బోరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. పదవీ కాలంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థల స్థాపనకు కృషి చేశారు. జిల్లాలో అన్ని ప్రాంతాలకు రోడ్డు వసతి మొదటిగా కల్పించింది వీరి హయాంలోనే. ఏటుకూరి. తుమ్మల, జాషువా వంటి మహాకవులను డిగ్రీ లతో నిమిత్తం లేకుండా తెలుగు ఉపాధ్యాయులుగా నియమించారు. ఉన్నవ దంపతులు స్థాపించిన శారదా నికేతనానికి భూరి విరాళం ఇచ్చారు. కావూరులో గొల్లపూడి సీతారామశాస్త్రి స్థాపించిన వినయాశ్రమా నికి కూడా భూమిని దానంగా ఇచ్చారు. విద్యావ్యాప్తి, అనాథ పోషణ, దేవా లయాల పనర్నిర్మాణానికి విశేషంగా కృషి చేశారు. 1960 డిసెంబర్ 14న కుప్పస్వామి చౌదరి కన్నుమూశారు.
 
 
==మూలాలు==