మొల్ల రామాయణము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[మొల్ల రామాయణము]], సంస్కృతములో శ్రీ వాల్మీకి విరచితమయిన శ్రీమద్రామాయణమును ఆధారముగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్యకావ్యము. దీనిని 16వ శతాబ్దికి చెందిన మొల్ల అను కవయిత్రి రచించెను. మొల్ల ఆంధ్రదేశములోని కడప జిల్లాలోని గోపవరము అను గ్రామములో
నివసించినదని చరిత్రకారుల అభిప్రాయము. మొల్ల రామాయణములోని మొదటి కొన్ని పద్యాలలో
మొల్ల ఏ విధమయిన సంప్రదాయ విద్యను అభ్యసించలేదు. తన సహజ పాండిత్యమునకు ఆ భగవంతుడే కారణమని మొల్ల చెప్పుకొనినది. తాను రచించిన రామాయణమును నాటి రోజుల్లో అనేక కవులు చేసిన విధముగా ఏ రాజులకు అంకితము నివ్వలేదు. ఇది ఆమె యొక్క రామభక్తికి నిదర్శనము. మొల్ల రామాయణము ఆరు కాండములలో 138 పద్యములు తో కూడుకున్నది. అంతకు మునుపే పలువురు రామాయణమును గ్రంధస్తం చేసిన విషయమును ప్రస్తావించుచూ తన పద్యకావ్యములోని మొదటి పద్యములో, ప్రతి దినమూ భుజించునప్పటికీ, ఏ విధముగానయితే తినే తిండిని ఇష్టముతో తింటామో, అదే విధముగా ఎందరు ఎన్ని విధములుగా వ్రాసినప్పటికినీ, రామాయణము ఎన్ని సారులయిననూ మరల మరల వ్రాసి మరియు చదివి ఆనందింపవచ్చునని చెప్పుకొన్నది.
|