నింబార్కుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[బ్రహ్మసూత్రాలు | బ్రహ్మసూత్రాలకు]] భాష్యాలు వ్రాసిన మహామహులలో మరొక ప్రముఖుడు నింబార్కుడు.
==కాలం, జన్మస్థలం==
ఇతని జన్మస్థానం ఇథమిత్తంగా తెలియకపోయినా బళ్ళారిలోని[[బళ్ళారి]]లోని [[నింబ]] గ్రామమనీ అందుకే ఇతనికి నింబార్కుడని పేరు వచ్చిందనీ అంటారు. మరొక ఊహ ప్రకారం ఇతనిది గోదావరీ తీరప్రాంతం. ఇతని జనన కాలంకూడా ఖచ్చితంగా తెలియదు. 11వ శతాబ్దం వాడని ఒక వాదమైతే 13 వ శతాబ్దమని మరికొందరి లెక్క. ఇతడి తల్లిదండ్రులు జగన్నాథుడు, సరస్వతి.
 
వీరిది [[వైష్ణవ ]]సాంప్రదాయంలోని సనక సాంప్రదాయం. అనగా [[సనక మహర్షి]] నెలకొల్పిన సంప్రదాయం. వేదాంతపరంగా ఇతనిది [[ద్వైతాద్వైతం]]. దీనినే భేదాభేదవాదం అని కూడా అంటారు.
 
వీరిది వైష్ణవ సాంప్రదాయంలోని సనక సాంప్రదాయం. అనగా [[సనక మహర్షి]] నెలకొల్పిన సంప్రదాయం. వేదాంతపరంగా ఇతనిది [[ద్వైతాద్వైతం]]. దీనినే భేదాభేదవాదం అని కూడా అంటారు.
==రచనలు==
[[బ్రహ్మసూత్రాలు | బ్రహ్మసూత్రాలకు]] నింబార్కుడు వ్రాసిన భాష్యం పేరు "వేదాంత పారిజాత సౌరభం". దీనిని అర్థం చేసుకోవటానికి ఆయన శిష్యుడైన శ్రీనివాసాచార్యుడు "వేదాంత కౌస్తుభం" అనే వ్యాఖ్యానం వ్రాయవలసి వచ్చింది. దీనిని మరింత సుబోధకం చేయటానికి కేశవ కాశ్మీరీభట్టు "వేదాంత కౌస్తుభ ప్రభ" అనే మరొక వ్యాఖ్యాన గ్రంథం వ్రాసాడు.
"https://te.wikipedia.org/wiki/నింబార్కుడు" నుండి వెలికితీశారు