రామ రాయ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, చినాడు → చాడు (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు (2), ఉన్నది. → ఉంది., కూడ → కూడా , → (2), , → , using AWB
పంక్తి 8:
==పరిపాలన==
రామరాయలు శ్రీరంగరాజు, తిరుమలాంబల కొడుకు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో గొప్ప సేనాధిపతిగా, పరిపాలకునిగా, రాజకీయ తంత్రము తెలిసిన వాడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మామ చనిపోయిన తరువాత రాజకార్యములలో తన ప్రభావము చూపాడు. 1529లో శ్రీకృష్ణదేవరాయల చిన్న తమ్ముడు అచ్యుతరాయలు సింహాసనమెక్కి 1542వరకు పాలించి చనిపోయాడు. పిమ్మట అతని మేనల్లుడు, బాలుడగు సదాశివరాయలు రాజయ్యాడు. రాజ్యాధికారమంతయూ రామరాయల చేతిలోనే ఉన్నదిఉంది. సదాశివరాయని తొలగించి తానే రాజయ్యే అవకాశముందని కొలువులోని పెక్కుమందికి అనుమానము. కోశాధికారి, మహాయోధుడగు సలకము తిమ్మరాజు రామరాయలని హత్యచేయుటకు ఏర్పాటు చేస్తాడు. ఇది తెలిసి రామరాయలు గండికోట కుగండికోటకు పారిపోయి అచట విజయనగరరాజ్యానికి విశ్వాసపాత్రుడగు పెమ్మసాని యెర్ర తిమ్మానాయుని ఆశ్రయము పొందుతాడు. తిమ్మరాజు పెద్ద సైన్యముతో గండికోట వచ్చి రామరాయలను అప్పగించమని తిమ్మానాయుని కోరతాడు. ప్రతిగా తిమ్మానాయుడు "మమ్ములను ఆశ్రయించిన వారిని రక్షించుట మా ధర్మము. మీతో పోరునకు మేము సిద్ధము" అని కబురంపుతాడు. గండికోట కుగండికోటకు మూడు క్రోసుల దూరమున గల కోమలి వద్ద తిమ్మరాజుకు, యెర్రతిమ్మానాయునికి మధ్య భీకర యుద్ధము జరుగుతుంది. ఈ యుద్ధములో విజయనగర సేన ఓడిపోతుంది. తిమ్మానాయుడు, రామరాయలు తిమ్మరాజుని విజయనగరము వరకు తరిమి చంపుతారు. ఈ యుద్ధపరిణామముగా రామరాయలు విజయనగర సామ్రాజ్యాధిపతి అవుతాడు<ref>కోమలి వద్ద యుద్ధం: http://books.google.co.in/books?id=FqLfdZ0gcoEC&pg=PA184&dq=gandikota&lr=#PPA184,M1</ref>.
 
==సుల్తానులతో సంబంధాలు==
పంక్తి 23:
*[[1557]]లో బిజాపూర్, బీదర్ సుల్తానుల వైపు న ఉండి అహ్మద్ నగర్, గోలకొండ సుల్తానులతో తలపడ్డాడు.
*[[గోల్కొండ]] నవాబు అయిన [[జంషీద్ కులీ కుతుబ్ షా]] చివరి తమ్ముడు అయిన [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]]కి ఏడు సంవత్సరములు ఆశ్రయమిచ్చి తరువాత జాగీరు కూడా ఇచ్చాడు.
*[[1551]] లో రామరాయలూ, అహ్మద్‌నగర్‌ సుల్తానూ బీజాపూరు పైకి దండయాత్ర చేసి [[రాయచూరు]], [[ముద్గల్లు]], కృష్ణా, తుంగ భద్రా నదుల మధ్య భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
*[[1553]]లో ఏడు లక్షల ధనమును స్వీకరించి [[బీజాపూరు]] సుల్తానును అహ్మద్‌నగర్‌ సుల్తాను అయిన [[హుసేన్ నిజాం షా]] నుండి కాపాడినాడు.
* రామరాయలు తన సైన్యములో పలు ముస్లిమ్ సైనికులను చేర్చుకున్నాడు. వారిలో ముఖ్యులు జిలానీ సోదరులు. వీరే తళ్ళికోట యుద్ధములో రామరాయలకు ద్రోహము చేసి, సుల్తానులకు సహకరించి, యుద్ధ పరిణామములో నిర్ణయాత్మక పాత్ర వహించారు.
పంక్తి 31:
సుల్తాల మధ్య వైవాహిక సంబంధాలు ఏర్పడినాయి. వారి మధ్య తగవులు తగ్గాయి. [[1564]] [[డిసెంబర్ 25]] న నలుగురు సుల్తానులూ ఏకమై తళ్ళికోట వద్ద యుద్ధమునకు సిద్దమయినారు. [[1565]] [[జనవరి 23]] న జరిగిన తళ్ళికోట యుద్ధములో రామ రాయలు శత్రువుల చేతిలో మరణించాడు. దీనితో శతాబ్దాల విజయనగర వైభవం క్షిణించినది. కేవలం యుద్ధ శిబిరాలనుండే కోటింపాతిక ధనమును పొందినారు. విజయనగరము సర్వనాశనము చేయబడింది. నగర విధ్వంసమునకు ఐదు నెలలు పట్టింది. ఆరునెలలు నలుగురు సుల్తానులు విజయనగరంలోనే మకాం వేసి తరువాత వారిలో వారికి గొడవలు వచ్చి ఎవరి రాజ్యానికి వారు తరలివెళ్ళారు.
==అరవీడు వంశము==
యుద్ధానంతరము రామరాయలు తమ్ముడు తిరుమలరాయలు సదాశివరాయలతో బాటు ధనసంపత్తిని తీసుకొని పెనుగొండకు తరలిపోతాడు. అచటి నుండి రాజ్యమ్ము చక్కదిద్దు ప్రయత్నాలు చేస్తాడు. చాల సంవత్సరములు రాజ్యము చేసి, రాజ్యానికి గౌరవప్రపత్తులు సంపాదించిన కారణముగా రామరాయలు, అతని వారసులు చారిత్రలకులచే అరవీటి వంశస్థులుగా పరిగణింపబడ్డారు. ఆరవీటి వంశస్తులు నాయకరాజులు.{{fact}} గ్రామాధిపతి, రక్షకుడు, మహాతలవరుడు ప్రధాన న్యాయాధికారి అని అర్థములు. (ఖండవల్లి లక్ష్మీనిరంజనం, బాలెందు రాజశేఖరం- ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర. పెనుగొండను పరిపాలించినది నాయకురాజులు {{fact}} వీరు ధైర్యవంతులు, నిజాయతీ పరులు, దేశభక్తి పరాయణులు. (శ్రీ తిరుమల రామచంద్ర-హంపి నుండి హరప్పా దాకా). విజయనగర ప్రాభవము మసకబారింది. మధుర, మైసూరు, కేలడి నాయకులు స్వతంత్రులయ్యారు. పలుచోట్ల ముస్లిమ్ సేనాధిపతులు చిన్న చిన్న ప్రాంతాలకు అధిపతులై బహమనీలకు, పిదప మొఘలులకు విధేయులుగా వ్యవహరించారు.
 
==యుద్ధానంతర చరిత్ర==
సుల్తానుల మధ్య తిరిగి భగ్గుమన్న విభేదాలు విజయనగరము దాటి వారి ప్రాభవము వ్యాపింపచేయుటకు నిరోధకమైనవి. వెనువెంటనే ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్ రాజ్యములను తన సామ్రాజ్యములో కలుపుకొనుటకు చేసిన ప్రయత్నాలవలన సుల్తానుల సమయము, వనరులు, సేనలు ఆత్మసంరక్షణకు వినియోగింపబడ్డాయి. విజయనగర విధ్వంసము గాంచిన సమర్థ రామదాసు తన శిష్యుడు శివాజీని హిందూ ధర్మ రక్షణకై పురిగొల్పుతాడు. ముసునూరి నాయకుల చరిత్ర, విజయనగర సామ్రాజ్య దీక్షా తత్పరత మరాఠాలకు ప్రేరణ కల్పించాయి. మరాఠాల దాడులతో ముఘల్ సామ్రాజ్యము కూడకూడా బలహీన పడింది. 1707లో ఔరంగజేబు మరణము తరువాత అరాచకము ప్రబలింది. తళ్ళికోట యుద్ధము తరువాత 150 సంవత్సరములకు మరాఠాల బావుటా ఢిల్లీ వరకు ఎగిరింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రామ_రాయ" నుండి వెలికితీశారు