ఇ.వి. రామస్వామి నాయకర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), స్వాతంత్ర → స్వాతంత్ర్య using AWB
పంక్తి 2:
'''పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి నాయకర్''' పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలోని [[ఈరోడ్]] పట్టణంలో [[1879]] వ సంవత్సరం [[సెప్టెంబర్ 17]] వ తారీఖున జన్మించారు. ఈయన పెరియార్ గా, తందై పెరియార్ గా, రామస్వామిగా, ఇ.వి.ఆర్.గా కూడా సుప్రసిద్దులు.
 
ఈయన నాస్తికవాది మరియు సంఘ సంస్కర్త. [[తమిళనాడు]] లో ఆత్మగౌరవ ఉద్యమం మరియు ద్రావిడ ఉద్యమ నిర్మాత. దక్షిణ భారతీయులను రాక్షసులుగా, వానరులుగా చిత్రీకరించిన [[రామాయణము|రామాయణాన్ని]], [[రాముడు|రాముడి]]ని ఈయన తీవ్రంగా విమర్శించాడు. [[1904]]లో ఈయన [[కాశీ]] లోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్ళినపుడు అచట జరిగిన అవమానంతో ఈయన నాస్తికుడిగా మారాడు. అప్పటినుండి హేతువాదిగా మారి [[హిందూమతము|హిందూ మతా]]న్ని అందులోని కులవ్యవస్థను అసహ్యించుకున్నాడు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాన్ని ద్వేషించాడు. వీరి పూర్వీకులు మదుర, తంజావూరు రాజ్యాదీశులుకు బంధువర్గీయులు, చంద్రవంశ బలిజలుగా పేరున్నవారు.
 
ఈయన [[1919]] నుండి [[1925]] వరకు [[కాంగ్రెస్]] పార్టీలో ఉండి దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడాడు. తదనంతర కాలంలో ఈయన మరియు ఇతని అనుచరులు దేశ స్వాతంత్రంస్వాతంత్ర్యం కన్నా సాంఘిక సమానత్వం కొరకు ఎక్కువగా పోరాడారు. అన్నికులాలవారికీ సమానంగా దేవాలయ ప్రవేశార్హత ఉండాలని వాదించారు. [[1937]] వ సంవత్సరంలో [[రాజాజీ]] నేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం [[హిందీ]] భాషను మద్రాసు రాష్ట్ర పాఠశాలల్లో ప్రవేశపెట్టినపుడు పెరియార్ తన [[జస్టిస్ పార్టీ]] ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేకోద్యమాన్ని పెద్దయెత్తున చేపట్టి చివరికి హిందీ బోధనను విరమింపచేశాడు.
తరువాత ఈయన పార్లమెంటరీ రాజకీయాల మీద విశ్వాసం కోల్పోయి జస్టిస్ పార్టీని [[ద్రావిడర్ కళగం]] అనే సామాజికోద్యమ సంస్థగా మార్చాడు. రాజకీయాలవైపు మొగ్గుచూపిన కొందరు అనుచరులు ఆయన నుండి విడిపోయి [[అన్నాదురై]] నాయకత్వంలో [[ద్రవిడ మున్నేట్ర కళగం ]] (డి.యమ్.కె.) అనే పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. ఆ తదుపరి [[1969]] లో అన్నాదురై మరణం తర్వాత [[కరుణానిధి]] నాయకత్వంతో విభేదించిన [[యమ్.జి.రామచంద్రన్]] డి.యమ్.కె. నుండి విడిపోయి [[అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం]] (ఎ.ఐ.ఎ.డి.యమ్.కె.) అనే పేరుతో మరో పార్టీ స్థాపించారు. ఈ రెండు పార్టీలే అప్పటి నుండి నేటివరకు [[తమిళనాడు]] రాజకీయాలను శాసిస్తున్నాయి.
 
[[వర్గం:1879 జననాలు]]