కొల్లేరు సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ప్రధమ → ప్రథమ, ఉన్నది. → ఉంది. (2), , → , using AWB
పంక్తి 95:
[[బొమ్మ:Kolletikota.kolleru.2.jpg|right|thumb|250px|కొల్లేరులో పడవప్రయాం.]]
 
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[పశ్చిమ గోదావరి]] జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు - '''కొల్లేరు'''. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు [[వలస]]వచ్చే పక్షులలో ముఖ్యమైనవి - [[పరజ]], [[పురాజము]], [[నులుగు పిట్ట]]. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి. గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలుకలు నీటిని చేరుస్తున్నాయి. కోల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెలుతుంది. సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు [[బంగాళాఖాతం]] చేరుతుంది. కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నదిఉంది. సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉన్నదిఉంది.<ref>[http://www.springerlink.com/content/q67537341886k145/fulltext.pdf The calanoid and cyclopoid fauna (Crustacea Copepoda) of Lake Kolleru, South India], Hydrobiologia, Volume 119, Number 1 / December, 1984, 27-48</ref>
 
==పెద్దింట్లమ్మ దేవాలయము==
పంక్తి 108:
 
==అయిదో కాంటూరు వరకు ఆక్రమణల తొలగింపు==
కొల్లేరు 60శాతం ఆక్రమణలకు గురైంది. ప్రభుత్వం ఇక్కడి లంకల గ్రామాల ప్రజలకు ఇచ్చినది, ప్రజలు సరస్సును అక్రమంగా ఆక్రమించుకుని, కట్టలు పోసి, చేపల చెరువులుగా మార్చినది పోగా కేవలం 40 శాతం సరస్సు మాత్రమే మిగిలి ఉంది. చేపల పెంపకం కారణంగా సరస్సులో కాలుష్యం కూడా పెరిగింది.ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ సంస్థల పోరాటాల పలితంగా [[2005]] లో [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం ఈ ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపట్టింది.
కొల్లేరు సరస్సును అయిదో కాంటూరు వరకు విస్తరించాలంటే రైతుల దగ్గర నుంచి 15,335 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని, దీనికి రూ.679.38 కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఈ నిధులను విడుదల చేస్తేనే విస్తరణ కార్యక్రమం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.వివిధ ప్రాజెక్టుల కోసం అటవీ భూములను తీసుకుని నష్ట పరిహారంగా ఇచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని ఇందులో ఇప్పటివరకు రూ.120 కోట్ల నిధులనే విడుదల చేశారని, మిగిలిన నిధులనూ పూర్తిగా విడుదల చేస్తేనే కొల్లేరు విస్తరణ పనులు చేపట్టడానికి అవకాశం ఉందన్నారు. కొల్లేరును అయిదో కాంటూర్ వరకు కాకుండా [[మూడో కాంటూర్]] వరకు విస్తరిస్తామని అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం దానిని తిరస్కరించింది. మూడో కాంటూర్ లోపల 475 ఎకరాల రైతుల సొంత భూములను సేకరించడానికి రూ.21.38కోట్లు ఖర్చవుతుంది. అయిదో కాంటూర్ లోపలైతే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 13,899 ఎకరాలకు రూ.628.48 కోట్లు, కృష్ణా జిల్లా పరిధిలో 961 ఎకరాలకు రూ.30 కోట్లు వ్యయం అవుతుంది.కొల్లేరును అయిదో కాంటూరు వ్యన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా సంరక్షించాలని న్యాయస్థానాల ఆదేశాలు, ప్రధాని మన్మోహన్ చేసిన ప్రకటనల నేపథ్యంలో కొల్లేరును అయిదో కాంటూరు వరకు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, తెదేపా సహా దాదాపు అన్ని పక్షాల నాయకులు, పోటీచేసిన అభ్యర్థులు అంతా కొల్లేరును మూడో కాంటూరు వరకే పరిమితం చేసి, వ్యవసాయానికి, జలసాయానికి, కొల్లేటి ప్రజల ఉపాధికి ఢోకా లేకుండా చేస్తామని హామీలు గుప్పించేశారు. కొల్లేరును మూడో కాంటూరు వరకే వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఉంచాలని కేంద్రానికి కోరుతూ అసెంబ్లీలో తీర్మానించారు. న్యాయస్థానాల ఆదేశాలకు వ్యతిరేకంగా నాయకులు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, అసెంబ్లీ తీర్మానం కేంద్రంలో చెల్లుబాటు కాలేదు. ఇందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం అయిదో కాంటూరు వరకూ కొల్లేరును రక్షించాల్సిందేనని ఎన్నికల అనంతరం స్పష్టం చేసింది. కొల్లేట అయిదో కాంటూరు వరకు ఉన్న చేపల చెరువులను ధ్వంసం చేసి, వాటిపై ఆధారపడి ఉన్న ప్రజల పునరావాస ప్యాకేజి అమలు చేయడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2005 నుంచి ఇంతవరకు సుమారు రూ.80 కోట్లు వ్యయం చేసింది. అయినా ఆశించిన ఫలితం ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. ధ్వంసం చేసిన చెరువులనే పునరుద్ధరించడం ప్రారంభించారు. వీటిని మళ్లీ ధ్వంసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఏడాది జూన్‌లో జిల్లాకు నీటిపారుదల శాఖ ద్వారా రూ. 3 కోట్లు నిధులు మంజూరు చేసింది. పార్టీలన్నీ ఎన్నికల్లో మూడో కాంటూరు వరకే కొల్లేరును పరిమితం చేస్తామని హామీలిచ్చి, ఇప్పుడు అయిదో కాంటూరు వరకూ అంటున్నారని [[గుడివాకలంక]] తదితర గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అధికారులు చెరువులను ధ్వంసం చేయించడానికి కొలతలు వేస్తుంటేనే జిరాయితీ రైతులు అభ్యంతరాలు తెలుపుతూ అడ్డుకుంటున్నారు.అయిదో కాంటూరు లోపల చెరువులను పునర్ధురిస్తున్నారనే ఆరోపణలపై వన్యప్రాణి సంరక్షణాధికారులు ఇంతవరకు 200కి పైగా ప్రజలపై కేసులు నమోదు చేశారు.
==కేంద్రం చేతిలోకి కొల్లేరు==
పంక్తి 114:
 
==మారిన హద్దులు==
[[భీమడోలు]] మండలం [[గుండుగొలను]], ఆగడాలలంక మధ్య రోడ్డు పాయింటు వద్ద, [[ఆకివీడు]] మండలం సిద్ధాపురం, ధర్మాపురం గ్రామాల సరిహద్దులు, కృష్ణా జిల్లా సరిహద్దులతో కలిసేచోట అడంగల్‌లోని విస్తీర్ణం వంటి అంశాల ఆధారంగా రూపొందించిన మ్యాప్ కు,120 జీవోలో పేర్కొన్న 5వ కాంటూరు దిగువ సర్వే సంఖ్యల ఆధారంగా రూపొందించిన మ్యాప్ కు అభయారణ్య హద్దుల్లో తేడాలున్నాయి. గుండుగొలను, [[ఆగడాలలంక]] రోడ్డును అభయారణ్య పరిధి నుంచి మినహాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రోడ్డు గతం నుంచే ఉండటం ఇందుకు కారణం. ప్రస్తుతం నిర్ధారించిన మ్యాప్‌లో గుడివాకలంక ప్రాంతంలో 965, 966, 1003, 1004 సర్వే నెంబర్లతో కూడిన [[మొండికోడు]] ప్రాంతం అభయారణ్య పరిధిలోకి రాదు.అభయారణ్య సరిహద్దులు గుర్తిస్తూ స్తంభాలు ఏర్పాటు చేస్తారు.అభయారణ్యం చుట్టూ నక్లెస్ రోడ్డు, ఏలూరు నుండి కొల్లేరు మీదుగా కైకలూరుకు 25 కి.మీ.రైలుమార్గం వెయ్యాలని స్థానిక మత్స్యకార నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
 
==పురాతన గ్రంధాలలో కొల్లేరు ప్రస్తావన==
[[రామాయణం]] [[అరణ్యకాండ]]లో వర్ణింపబడిన పెద్ద సరస్సు కొల్లేరే నని ఆంధ్ర దేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడయిన [[చిలుకూరి వీరభద్రరావు]] భావించాడు. ఈ విషయమై "ఆంధ్రుల చరిత్రము - ప్రధమప్రథమ భాగము"లో ఇలా వ్రాశాడు - <ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp ఆంధ్రుల చరిత్రము - చిలుకూరి వీరభద్రరావు] ప్రచురణ: విజ్ఞాన చంద్రికా గ్రంధమండలి - 1910లో చెన్నపురి ఆనంద ముద్రణాశాల యందు ముద్రింపబడియెను. వెల 1-4-0. రాజపోషకులు: బొబ్బిలి రాజా, పిఠాపురం రాజా, మునగాల రాజా</ref>
 
:ఈ దండకారణ్య మధ్యమున యోజనాయుతమైన (100 చతురపు మైళ్ళ వైశాల్యము గల) మహా సరస్సొకటి గలదనియు, అది జల విహంగములతో నత్యంత రమణీయమై యొప్పుచున్నదనియు .... ఆప్రదేశమంత నిర్జంతుకముగా నున్నదనియు నగస్త్యుడు శ్రీరామ చంద్రునితో జెప్పినట్లు రామాయణమున చెప్పబడినది.... ఈ సరస్సెక్కడనున్నదని విచారింపగా నయ్యది యాంధ్ర దేశములోనిదిగా జూపట్టుచున్నది. ఏమన గొప్పదై దండకారణ్య మధ్యగతమై కొంగలకాకరమై యుండు తియ్యని కొలను మన యాంధ్ర దేశముననే గాని మఱియెచ్చటను గానరాదు.
"https://te.wikipedia.org/wiki/కొల్లేరు_సరస్సు" నుండి వెలికితీశారు