కంచిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
ఈ గ్రామం మొదట కర్నూలు జిల్లాలో ఉండేది. అప్పట్లో గ్రామంలో ప్రధాన రహదారి వెంట కాలువలూ, రీడింగ్ రూం, సామూహిక మరుగు దొడ్లూ, పంచాయతీ కార్యాలయం నిర్మించారు, పాఠశాలను ఏర్పరిచారు. తారు, సిమెంట్ రోడ్లు లేకున్నా రహదారులను చక్కగా తీర్చి దిద్దారు. విద్యుత్తు సౌకర్యంగూడా ఏర్పాటు చేయటంతో ఈ చూడచక్కని పల్లెను,ప్రభుత్వం ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసింది. ఆ సమయంలో శ్రీ వేమిరెడ్డి పిచ్చి రంగారెడ్డి గ్రామ సర్పంచిగా ఉన్నారు. గిద్దలూరు ప్రాంతం ప్రకాశం జిల్లాలో కలిసిన తర్వాత గూడా గ్రామంలో అభివృద్ధివీచికలు కొనసాగాయి. అప్పుడు గూడా ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా ప్రకటించారు. అప్పటి సర్పంచ్ దప్పిలి శ్రీనివాసరెడ్డి రు.25 లక్షలతో సిమెంట్ రహదారులు ఏర్పరిచారు.ప్రస్తుతం గ్రామంలో బీ.సీ కాలనీలో ఒక్క రహదారి తప్ప మిగతా అన్ని వీధులలో జన్మభూమి పధకం ద్వారా సిమెంట్ రహదారులతో పాటు పక్కా కాలువలు నిర్మించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి , పైప్ లైన్లు వేసి గృహాలకు మంచినీటి సరఫరా చేస్తున్నారు.యస్.సీ కాలనీలో సిమెంట్ రహదారులు నిర్మించారు.గ్రామంలో ప్రధాన రహదారిని చట్రెడ్డిపల్లె నుండి కంచిపల్లె వరకూ సిమెంట్ రహదారిగా మార్చారు. [1]
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
రంగారెడ్డి చెరువు:- వెంకటాపురం గ్రామ సమీప అడవిలో కురిసే వర్షాలకు ఎనుమలేరు వరద ప్రవాహంతో ఈ చెరువు నిండుతుంది. ఈ చెరువుకు 175 ఎకరాల ఆయకట్టు ఉన్నది. 2013 తరువాత ఈ చెరువు 2016 సెప్టెంబరు-26కి నిండి అలుగు పారినది. ఈ చెరువు నిండటంతో కంచిపల్లె గ్రామంతోపాటు, సమీప గ్రామాలయిన రాజుపేట, కృష్ణంశెట్టిపల్లె గ్రామాలలో గూడా భూగర్భజలాలు అభివృద్ధి చెందుతవి. []
రంగారెడ్డి చెరువు.
 
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/కంచిపల్లి" నుండి వెలికితీశారు