త్రిపురనేని గోపీచంద్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (3), గా → గా , గ్రంధం → గ్రంథం (3), పెళ్లి → పెళ్ళి, using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2) using AWB
పంక్తి 42:
గోపీచంద్ [[1910]], [[సెప్టెంబర్ 8]] న [[కృష్ణా జిల్లా]] [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]] గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ [[సంఘ సంస్కర్త]] [[త్రిపురనేని రామస్వామి]]. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం, ఆస్తి, శక్తి '''ఎందుకు?''' అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. '''ఎందుకు?''' అన్న ప్రశ్నే అతన్ని ఒక [[జిజ్ఞాసువు]] గా,[[తత్వవేత్త]]గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
 
గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన వ్రాసిన ''[[అసమర్థుని జీవయాత్]]ర'' తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. [[1963]] లో ''పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా''కు [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] వచ్చింది.<ref>[http://www.sahitya-akademi.org/sahitya-akademi/awa10321.htm#telugu కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు]</ref>
 
==జీవిత క్రమం==
పంక్తి 54:
* 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు.
* 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో [[ఆంధ్ర ప్రదేశ్]] సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు.
* 1957-62 వరకు [[ఆకాశవాణి]] లో పనిచేసాడు. ఈ దశలో [[అరవిందు]]ని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు.
* [[1962]] [[నవంబర్ 2]] నాడు గోపీచంద్ మరణించాడు.
* భారత ప్రభుత్వము సెప్టెంబరు 8, 2011న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది.