కొండవీటి వెంకటకవి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నెహ్రు → నెహ్రూ , లను గురించి → ల గురించి (3), షష్ఠి పూర్ using AWB
పంక్తి 2:
'''కొండవీటి వెంకటకవి''' ([[జనవరి 25]], [[1918]] - [[ఏప్రిల్ 7]], [[1991]]) ప్రసిద్ధ కవి, [[హేతువాది]] చలనచిత్ర సంభాషణ రచయిత. వీరి అసలు పేరు '''కొండవీటి వెంకటయ్య'''.
==జీవిత విశేషాలు==
వీరు [[గుంటూరు]] జిల్లా [[సత్తెనపల్లి]] తాలూకా [[విప్పర్ల]] గ్రామంలో జన్మించారు. వీరు నారాయణ, శేషమ్మ దంపతులకు [[జనవరి 25]], [[1918]] సంవత్సరంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసము తండ్రివద్ద జరిగింది. ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనము చేశారు. చిట్టిగూడూరు నరసింహ సంస్కృత కళాశాలలో చేరి దువ్వూరు వేంకటశాస్త్రిగారి శిశులై బాషా ప్రావిణపట్టా పొందారు. 1936లో కిసాన్ కాంగ్రేసుకు సహాయకార్యదర్శిగా పనిచేశాడు.1944-45లో శరభయ్యగుప్త హైస్కూల్లో తెలుగు పండితునిగా ఉద్యోగం ప్రారంభించారు. 1946 నుండి 1952 వరకు వెంకటకవి జిల్లా [[మాచర్ల]]లో బోర్డు ఉన్నతపాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశాడు.[[ బాబా]] లను విమర్శిస్తూ ఉపన్యాసాలిచ్చారు. [[ఈనాడు]], లో అనేక వ్యాసాలు రాశారు.1952నుంచి పొన్నూరు భావనారాయణ స్వామివారి సంస్కృత కళాశాలో ఆంధ్రఉపన్యాసకులుగా పనిచేసి పదవిపదవీ విరమణ చేశారు.
==రచనలు==
కవితా రచనకు తన 14వ ఏటనే శ్రీకారం చుట్టిన వీరు అనేక గ్రంధాలుగ్రంథాలు రచించారు. 1932లో వీరు కర్షకా! శతకాన్ని రచించారు. ఇది మూడు ముద్రణలు పొందింది. 1942లో “హితభోద”రచించారు. 1940లో “చేన్నకేసవశతకం” వెలువరించారు. దివంగతులైన ప్రముఖులనుప్రముఖుల గురించి దివ్య స్క్రుతులు 1954లో వీరు నెహ్రునెహ్రూ చరిత్ర మొదటి భాగం ప్రకటిస్తూ తాము బహుళ ప్రబంధయుతుడని పేర్కొన్నారు. ఈగ్రంధం [[బెజవాడ గోపాలరేడ్డి]] గారికి అంకితం ఇవ్యబడింది. [[నెహ్రు]] చరిత్ర రెండవ భాగం [[గుత్తికొండ నరహరి]]గారికి అంకితం ఈయబడింది. మూడవ భాగం అముద్రితంగానే ఉంది. బుద్దుడుబుద్ధుడు, వేమన, గాంధీజీలనుగాంధీజీల గురించి వీరు మూడు శతకాలు రాసి దాన్ని “త్రిశతి” పేరుతో 1960లో ప్రకటించారు. నిదబ్రోలుకు చెందిన ప్రముఖ విద్యా పోషకులు [[పాములపాటి బుచ్చి నాయుడు]] దీని కుతిపతి శ్రీకృష్ణవ్యాసావళి వీరి మరొక రచన. వీరు 1984 ప్రాంతంలో [[కడప జిల్లా]] [[కందిమల్లయపల్లె]]లోని బ్రహ్మమ్ గారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు. ఆమఠానికి సర్వఅధ్యక్షుడుగా ఉన్న శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాములు వారి ఆదేశానుసారం “శ్రీవీర బ్రహెంద్ర సుప్రభాతమును” సంస్కృతంలోకి రచించారు.
 
1932లో కర్షకులమీద, 1946లో చెన్నకేశవ [[శతకం]] రచించారు. తరువాత కాలంలో త్రిశతి పేరుతో [[బుద్ధుడు]], [[వేమన]], గాంధీలనుగాంధీల గురించి మూడు శతకాలు రచించారు. 1942లో ''హితబోధ'', 1944లో ''ఉదయలక్ష్మీ నృసింహ తారావళి'' రచించారు. 1984 ప్రాంతంలో [[బ్రహ్మం]]గారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు. మఠాధ్యక్షుల ఆదేశానుసారం ''[[శ్రీవీరబ్రహ్మేంద్ర సుప్రభాతం]]'' సంస్కృతంలో రచించారు.
 
[[నందమూరి తారకరామారావు]] వీరిని 1977లో పిలిపించి [[దానవీరశూరకర్ణ]] చిత్రానికి సంభాషణలు రాయించారు. ఈ సినిమాతోనే ఆయన చలనచిత్ర రంగంలో తొలిగా పరిచయమయ్యారు.<ref name="NAT productions 60 years">{{cite web|title=NTR's production house completes 60 years|url=http://www.nandamurifans.com/main/ntrs-production-house-completes-60-years/|website=nandamurifans.com|accessdate=18 August 2015|quote="నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన}}</ref> తరువాత [[శ్రీమద్విరాటపర్వం]] (1980), [[శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర]] (1984) చిత్రాలకు కూడా సంభాషణలు సమకూర్చారు.
 
==సత్కారాలు==
[[ఆంధ్ర విశ్వకళా పరిషత్తు]] వీరిని '[[కళా ప్రపూర్ణ]]' పురస్కారంతో గౌరవించింది. 1953 జనవరిలో కవిరాజు అనే బిరుదును కూడా పొందాడు. ప్రసిద్ధ కార్టూనిస్టు శ్రీధర్ ఈయన గురించి సోక్రటీసులాగా తన ప్రపంచంతప్ప మరోటి తెలియని వారు, అతి సామాన్యుడిగా కనిపించే అసాధారణ తాత్వికుడు, వేదాంతి అన్నారు. కవులైనవారు మానవులందర్నీ ఏకం చేసేలా, వారిని సంఘటితపరచి వారిలో సౌభ్రాతృత్వం పెరిగేలా చేయాలి. ప్రజల్ని విడదీసేలా రచనలు చేయకూడదు... అంటూ ఆయన విభజనతత్వాన్ని ఆనాడే ఖండించారు.
 
పెళ్ళికాక పూర్వం అచల మతంలో దిగంబరిగా వూళ్ళు తిరిగాడు. 1945 ప్రాంతాల్లో కమ్యూనిస్టులు ఒక్కొక్క బాబాగురించి వివరాలు తెప్పించి, వాస్తవాలే సన్మాన పత్రంగా సమర్పించారట. ఏ బాబా ఎలాంటి వాడు, ఆయన పూర్వాపరాలు ఏమిటి లాంటివి. [[వసుచరిత్ర]] అవలీలగా పాడి వినిపించేవాడు. [[భట్టుమూర్తి]] అంటే ఆయనకు విపరీత ప్రేమాభిమానం. వెంకటకవికి ఇంగ్లీషు రాదు. [[అష్టావధానం|అష్టావధానాలు]] చేశాడు. [[భువన విజయం|భువన విజయాలలో]] పాల్గొన్నాడు. లౌకిక వివాహాలు చేయించాడు; అంటే మంత్రాలు లేకుండా, [[త్రిపురనేని రామస్వామి]] రాసిన పెళ్ళి సూత్రాలు చదివించి, వివాహాలు జరిపించడం. ఇలా ఆవుల మంజులత గారి పెళ్ళి, [[హైదరాబాదు ఎగ్జిబిషన్]] మైదానంలో జరిపించారు. ఆయన [[పురోహితుడు]]. ఇన్నయ్య తోటి పురోహితుడు.
 
కొండవీటి వెంకటకవి హాస్యప్రియుడు. తన షష్ఠి పూర్తిషష్టిపూర్తి రాబోతున్నదనీ, తానేమంతగా ఆశించడం లేదనీ, ఎందుకైనా మంచిదని ముందుగా చెబుతున్నాననేవాడు. తనకు పెద్దగా కోరికలు లేవనీ, ఏనుగుపై వూరేగించి, కాలుకు [[గండ పెండేరం]] (రత్నాలు బంగారం అయితే సరేసరి, లేకుంటే చత్తతోడా (గడ్డితో చేసిన కడియం) అయినా సరే అనేవాడు.
 
విరుఅముద్రితంగా ఉన్న కొన్ని ప్రాచీన కావ్యాలను పరిష్కరించి ప్రచురించినారుప్రచురించారు. తురగ రాజకవి రచించిన “కిర్గియాలిని పరిణయం” అనే కావ్యం వార్ల సుందరయ్య రచించిన భావలింగ శతకం ఈకోవకు చెందినవే.చిన్నయసూరి రచించిన శబ్దలక్షణ సంగ్రహాన్ని కూడా వీరు ప్రకటించారు.వీరి గ్రంధాలన్నిగ్రంథాలన్ని కవి రాజు గ్రంధమాలగ్రంథమాల పేరుతో వీరు స్వయంగా ప్రకటించినవే కావటం విశేషం. వీరికి 1953లో గుంటూరు జిల్లా పెదకురపాడులో సన్మానం జరిగింది.అప్పుడే “కవిరాజు”గౌరవప్రధానం జరిగింది.ఆంధ్రవిశ్వ కళాపరిషత్ వీరిని “కళాప్రపూర్ణ”పురస్కారంతో సత్కరించింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని అధికారభాష సంఘంలో సభ్యులుగా నియమించింది.
 
== మరణం ==
పంక్తి 33:
# త్రిశతి (1960)
# నెహ్రూ చరిత్ర - ద్వితీయ భాగము (1962)
# బలి (1963)
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
 
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1918 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/కొండవీటి_వెంకటకవి" నుండి వెలికితీశారు