చిట్వేలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →పాతచిట్వేలి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2), గాధ → గాథ, శిధిలా → శిథిలా (3), శిథిలావస్త using AWB |
||
పంక్తి 14:
==గ్రామంలోని దేవాలయాలు==
#మండల పరిధిలోని మట్లి రాజుల కాలంనాడు నిర్మించిన, పాత చిట్వేలి వరదరాజస్వామి ఆలయం, చోళరాజుల వైభవానికి సాక్షీభూతంగా నిలుచుచున్నది. గుంజన నదీతీరాన, ఒకటిన్నర ఎకరాల విశాల ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయం, అతి ప్రాచీనమైనది. గర్భగుడిలో నేటికీ వెలుగుతగ్గని వరదరాజస్వామి, భక్తులకు అభయమిచ్చుచున్నాడు. 15 అడుగుల ఎత్తయిన ప్రహరీగోడ, ఆలయానికి ప్రధాన రక్షణకవచంగా ఉంది. ఆలయానికి ముందుభాగాన 36 స్తంభాలతో మండపం ఉంది. రాతిస్తంభాలపైన వివిధ శృంగారభంగిమలతో నాట్యవిలాసాల చిత్రాలు, దేవతామూర్తులు మనకు కనువిందుచేయును. ఎత్తయిన రాతి మండపం ఇక్కడ మాత్రమే మనకు కనిపించును. ఈ మండపంలో వాలీ సుగ్రీవుల యుద్ధంలో చెట్టుచాటు నుండి, రాముడు వాలిపై బాణప్రయోగం చేసిన శిల్పాలు, ఇక్కడ ఒకే స్తంభంపై ఉండటం విశేషం. లేపాక్షిని గుర్తుకు తెచ్చే విధంగా రెండు పొరలను అంటించిన మండపస్తంభం, నాటి శిల్పుల నైపుణ్యానికి తార్కాణం. ఆలయ గర్భగుడి దక్షిణ గోడపై ఒక రాతి శాసనం కనిపించుచున్నది. ఈ ఆలయానికి 30 ఎకరాల మాన్యంభూమి ఉంది. ఎకరా స్థలానికి రు. 2 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇంత సంపద ఉన్న ఈ దేవాలయం
#ఈ గ్రామంలో వెలసిన గంగమ్మ జాతరను ప్రతి సంవత్సరం, పెంచల పౌర్ణమికి ముందు నిర్వహించెదరు. జాతరలో భాగంగా భక్తులు ముద్దలతో మ్రొక్కులు చెల్లించెదరు. పాడి పంటలు ఉన్న భక్తులు అమ్మవారి చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షణలు చేసి వెళ్ళెదరు. [3]
#మండల పరిధిలోని రాపూరు - తిమ్మాయపాలెం క్రాస్ వద్ద వెలసిన శ్రీ నరసింహస్వామివారి ఆలయం
#చిట్వేలి మండల కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో మారమ్మ ఆలయం ఉంది. [4]
#దేవగుడిపల్లె పంచాయతీలోని కొండమూల శ్రీ చౌడేశ్వరీదేవి ఆరాధనోత్సవాలు, 2014,
===పాతచిట్వేలి===
మండల పరిధిలోని పాతచిట్వేలి, మట్లిరాజుల కాలంలో ధన, ధాన్యాగారంగా వర్ధిల్లినది. ఇక్కడ వీరభద్ర, భద్రకాళి ఆలయం ఉంది. రు. 1.01 కోట్లతో నిర్మించిన భవనం, ఐదెకరాల విస్తీర్ణంలో పచ్చనిచెట్లనడుమ, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంది. ఆలయంలో ధ్వజస్తంభానికి దాతల ఆర్థిక సహకారంతో పంచలోహరేకులు అమర్చుచున్నారు. ఈ పనులు పూర్తి అయిన తరువాత ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించెదరు. ఈ ఆలయం దాతల సహకారంతో పూర్వవైభవం సంతరించుకున్నది. గ్రామానికి చెందిన చిరుద్యోగి శ్రీ సుబ్బరాయుడు రాజు, పట్టుదలతో రు. 50 లక్షలపైగా ఖర్చుచేసి మరమ్మత్తులు చేపట్టినారు. అభివృద్ధిపనులు చేసి రంగులద్దినారు. నేడు ఆలయ పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుచున్నవి. [5] & [7]
పంక్తి 60:
[5] ఈనాడు కడప; 2014, జూన్-21; 4వపేజీ.
[6] ఈనాడు కడప; 2014, జూన్-28; 3వ పేజీ.
[7] ఈనాడు కడప; 2014,
{{చిట్వేలు మండలంలోని గ్రామాలు}}
|