నైనా దేవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 74:
వేరొక కథనం ప్రకారం ఈ దేవాలయం ఒక గుజ్జార్ బాలునితో ముడిపడి ఉంది. ఒకనాడు ఆ బాలుడు పశువులను కాపలా కాస్తున్నప్పుడు ఆ మందలో ఒక తెల్ల ఆవు ఒక రాతి పై తన పొదుగు ద్వారా పాలను వెస్తున్నట్లు గ్రహించాడు. తరువాత చారా రోజులు అదే విషయాన్ని గమనించాడు. ఒక రాత్రి ఆ బాలుడు తన కలలో దేవత కనబడి ఆ రాయి తన ఆసనమని చెబుతుంది. నైనా ఈ స్వాప్నిక వృత్తాంతాన్ని రాజా బీర్ చంద్ కు వివరించాడు. ఈ విషయాన్ని రాజు కూడా స్వయంగా చూసి అక్కడ ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించి దానిని నైనా యొక్క పేరును పెట్టాడు.
నైనాదేవి ఆలయం మహిష పీఠంగా కూడా పిలువబడుతుంది. ఎందుకంటే మహిసాసురుడనే రాక్షసుడిని ఈ ప్రాంతంలోనే సంహరించినట్లు కథనం. పురాణ గాథల ప్రకారం మహిసాసురుడు బ్రహ్మ వల్ల వివాహిత కాని స్త్రీ వల్ల మరణం పొందేటట్లు వరాన్ని పొందుతాడు. ఈ వరం వల్ల మహిసాసురుడు ప్రజలను హింసిస్తుంటాడు. ఈ సంఘటనతో మహిసాసురుడిని అంతమొందించుటకు అందరు దేవతలు వారి శక్తులను కలిపి దుర్గ అనే దేవతను సృష్టిస్తారు. ఈ దేవతకు అనేక రకాల ఆయుధాలను దేవతలు బహూకరిస్తారు. మహిసాసురుడు ఆ దేవత యొక్క అందాన్ని చూసి మోహించి తనను వివాహమాడవలసినదిగా కోరుతాడు. ఆమె తన కంటే శక్తివంతుడిని వివాహమాడతానని చెబుతుంది. జరిగిన యుద్ధంలో ఆమె రాక్షసుడిని ఓడించి ఆయన కళ్ళను తొలగిస్తుంది. ఈ చర్య దేవతలకు సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషంతో ఆరు "జై నైనా" అనే నినాదాలనిస్తారు. అందువలన ఆ ప్రాంతం నైనా గా స్థిరపడింది.
== 2008 లో తొక్కిసలాట ==
|