సుందర చైతన్యానంద: కూర్పుల మధ్య తేడాలు

చి Raghuveer Onbv (చర్చ) చేసిన మార్పులను Kvr.lohith యొక్క చివరి కూర్పు వరకు తిప్...
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
==ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవ సమారోహం==
 
శ్రోత్రీయ బ్రహ్మనిష్టా గరిష్టులైన పూజ్య గురుదేవుల యాభై వసంతాల పవిత్ర ఆధ్యాత్మిక సేవా ప్రస్తానం (1996 నుండి 2016వరకు) ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవ౦ గా కీర్తించబడింది.ఈ సందర్భంగా మార్చి 19 వ తేదీన భారత ప్రభుత్వ తపాలా శాఖ వారు ఈ సేవా స్వర్ణోత్సవం సందర్భంగా పూజ్య గురుదేవుల ఫోటో ముద్రించిన ప్రత్యేక పోస్టల్ కవరు మరియు పోస్టల్ స్టాంపును వేదికపై ఘనంగా విడుదల చేయడం జరిగింది.<ref>http://www.indianphilately.net/news0316.html<ref> ఈ అరుదైన ప్రతిష్టాత్మక కార్యక్రమమును శ్రీ సోమసుందరం, ఐ.పి.ఎస్., డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ వారు ఆవిష్కరించారు.<ref>http://www.bhaarattoday.com/news/regional-news/sundarachaitanya-postal-stamp/8359.html<ref> ఈ ఈవెంటు పూజ్య గురుదేవుల ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవానికి మకుటాయమానమై భాసించింది. భక్తుల ఆనందానికి అవధి లేకుండా పోయింది.
 
==శ్రీ చైతన్య జయ ధ్వజం==
పంక్తి 43:
1947 వ సంవత్సరం 25 వ తేదీన [[నెల్లూరు జిల్లా]] లోని కట్టుబడిపాళ్ళెం అనే గ్రామంలో [[బ్రహ్మ మూహూర్తం|బ్రహ్మముహూర్త]]మున [[వైష్ణవము|వైష్ణవ]] కుటుంబంలో శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారు జన్మించారు. అది పరమాత్మ స్వరూపమైన మార్గశీర్ష మాసం. ఆ రోజే వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి కలసి రావడం విషేషం కాదు, వైభవం.సనాతన ధర్మ పునర్వైభవ ప్రాప్తికి సంకేతం.
 
శ్రీ పెరుoబుదూరు వేoకట శే షాచార్యులు, రంగనాయకమ్మ అను పుణ్య దంపతులకి శ్రీ స్వామిజీ అష్టమ గర్భ సంజాతులుగా జన్మించారు. స్వామీజీ పూర్వాశ్రమం పేరు శ్రీ సుందర రాజన్. స్వామీజీ పూర్వీకులు [[తమిళనాడు|ద్రవిడ దేశము]] వారు. వీరి తాత గారు బాల్య దశలో [[ఆంధ్ర దేశము]] నకి వచ్చారు. చంగల్పట్టు జిల్లా లోని [[రామానుజాచార్యుడు|రామానుజాచార్యుల]] వారి జన్మ స్థలమైన శ్రీ పెరుoబుదూరు వీరి స్వగ్రామము.<ref>https://aboutyourphilosophy.blogspot.in/2013/07/swami-sundara-chaitanyananda.html<ref> స్వామి వారి తాతలు విద్వత్తు గల వారై గ్రంథ రచనలు చేసారు. దేవాలయార్చకులుగా, తోమాల సేవకులుగా, గాయకులుగా, భక్తీ ప్రబంధ రచయితలుగా వన్నెకెక్కారు. [[తిక్కన|కవిబ్రహ్మ తిక్కన]], [[ఆతుకూరి మొల్ల|కవయిత్రి మొల్ల]], జ్ఞాన బ్రహ్మ సుందర చైతన్యులు - ఈ ముగ్గురు [[సింహపురి]] సీమలో విరబూసిన జ్ఞాన మందారాలని స్తుతిస్తూ [[నెల్లూరు]] పట్టణంలో 15-6-1994 నుండి 24-6-1994 వరకు పూజ్య స్వామీజీ నిర్వహించిన 118 వ జ్ఞాన యజ్ఞంలో పూజ్య స్వామీజీకి కనకాభిషేకం చేసిన సందర్భంలో సింహ పురీయులు ఒక [[తెలుగు పద్యము|తెలుగు పద్య]] మందారమును సమర్పించుకుని యున్నారు.
 
శ్రీ స్వామీజీ బి.ఏ.లిట్ పట్టమును పొందారు. పూప వయస్సు నందే వేదాంత గ్రంథాలను రాత్రింబవళ్ళు అధ్యయనం చేశారు. చేతిలో వేదాంత గ్రంథం లేకుండా బాల్యంలో వారు ఎవ్వరికీ కనిపించి ఉండరు. నిత్యమూ నియమముతో ధ్యానము చేసే వారు. భక్తుల కోర్కె మేరకు [[యజ్ఞం|యజ్ఞాలు]] ప్రారంభించారు. ప్రతి యజ్ఞంలో వేలాది సంఖ్యలో వచ్చి భక్తులు వారి ఉపన్యాసాలను ఆలకించేవారు, ఆలకిస్తూ ఉన్నారు.స్వామి వారిది [[అద్వైతం|అద్వైత]] మార్గము. ఆ విషయంలో రాజీ పడకుండా భోదిస్తారు. జ్ఞానమును [[భక్తి]]ని సమన్వయం చేసి భోదించడం వారి ప్రత్యేకత.
"https://te.wikipedia.org/wiki/సుందర_చైతన్యానంద" నుండి వెలికితీశారు