సాంఖ్య దర్శనం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా, బడినది. → బడింది., ఉన్నది. → ఉంది. (3), చినది. → చి using AWB
పంక్తి 5:
'''సాంఖ్యము''', [[యోగ దర్శనము|యోగము]], [[వైశేషిక దర్శనము|వైశేషికము]], [[న్యాయ దర్శనము|న్యాయము]], [[పూర్వమీమాంస]], [[ఉత్తరమీమాంస]] అనే ఆరు ఆస్తికదర్శనాలు. వీటిలో మూల ప్రకృతికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది '''సాంఖ్యదర్శనము'''.
 
ఇది '''[[కపిల మహర్షి]]'''చే ప్రవర్తింపజేయబడినదిప్రవర్తింపజేయబడింది. విశ్వ సృష్టికి మూలప్రకృతి ప్రధాన కారణమని ఈ దర్శన సారాంశము. ప్రకృతి సత్వము, రజస్సు, తమము అనే మూడు గుణాలతో కూడి ఉంది. ప్రకృతి, పురుషుల సంయోగము వలన బుద్ధి జనిస్తుంది. ఆ బుద్ధి చేసే చేష్టలు మనిషిని సంసారంలో బంధిస్తాయి.
 
ముందుగా ఇది నాస్తికవాదమనీ, తరువాత ఆస్తిక వాదాలలో ఒకటిగా విలీనం చేయబడిందనీ కొందరి వాదన. "ఈశ్వర కృష్ణుడు" రచించిన "సాంఖ్యకారిక" ఒకటే ఈ విషయంపైన స్పష్టమైన గ్రంథం.
పంక్తి 12:
 
సాంఖ్యవాదం ప్రకారం జ్ఞానానికి మూడు ప్రమాణాలను అంగీకరించవచ్చును
# ప్రత్యక్ష ప్రమాణాలు : మనకు ఇంద్రియాల ద్వారా తెలిసేది. (ఉదా:స్వయంగా చూసింది, విన్నది, స్పృశించింది...). వీటిలో మళ్ళీ రెండు విధాలున్నాయి <br /> ''నిర్వికల్ప ప్రమాణాలు'': ఇంద్రియాల ద్వారా గ్రహించింది, కాని అర్ధం కానిది. (ఉదా: ఒక పసిపిల్లవాడు ఒక జంతువును చూస్తాడు కాని వాడికి దాన్ని గురించి ఏమీ తెలియకపోవచ్చును) <br /> ''సవికల్ప ప్రమాణాలు'': ఇంద్రియాల ద్వారా గ్రహించడమే కాక అర్ధం చేసుకొన్నది. ఆ విషయానికి, మరో విషయానికి ఉన్న భేదం తెలుసుకున్నది. ఇది సరై జ్ఞానానికి ఆధారం.
# అనుమాన ప్రమాణాలు: ఇలా కావచ్చును అని ఊహించినదిఊహించింది. ప్రత్యక్ష ప్రమాణాల వల్ల గ్రహించిన విషయాన్ని ఉపయోగించి, తెలియని విషయాన్ని అంచనా వేయడం. (ఉదా: పొగ కనిపించింది కనుక నిప్పు ఉన్నదని చెప్పడం)
# శబ్ద ప్రమాణం: వేరేవారు చెప్పగా విన్న విషయాలు
 
పంక్తి 23:
 
* '''పురుషుడు'''
అంతటా వ్యాపించి ఉన్న స్వతంత్ర, నిరాకార ఆత్మ తత్వం. అంతటా ఉన్నదిఉంది. ఇంద్రియాలకు తెలియరానిది. మాటలలో చెప్పజాలనిది. ([[వేదాంతము]]లో "బ్రహ్మము" కూడా ఇలాగే వర్ణించబడింది.) పురుషునకు ఏవిధమై మాలిన్యాలు అంటవు. పురుషుడు శాశ్వతము. పురుషుని ఎవరూ సృజించలేదు. పురుషుడు దేనినీ సృజింపడు.
 
* '''ప్రకృతి'''
సృష్టి కారణమైన, శాశ్వతమైన అంశము. ప్రకృతి కూడా అనాదిగా ఉన్నదిఉంది. ప్రకృతిని ఎవరూ సృజింపలేదు. కాని ప్రకృతికి సృజించే లక్షణం ఉంది. అన్ని పరిణామాలూ, అశాశ్వతమై పదార్ధాలూ కూడా ప్రకృతి వల్లనే సంభవిస్తున్నాయి. అన్ని జీవులూ యదార్ధంగా పురుషుని బాహ్య స్వరూపాలు. కాని ప్రకృతి వలన ఉద్భవించిన భౌతిక దేహాలు పురుషుని బంధిస్తాయి. పురుషునకు తన గురించి సరైన జ్ఞానం లేనందువలన, తాను శరీరం మాత్రమే అని భ్రమించడం వలన, "సంసార బంధం" ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినపుడు ఆ బంధం నుండి విముక్తి లభిస్తుంది.
 
* '''ఈశ్వరుడు'''
పంక్తి 41:
 
వైవిధ్యం, ఘర్షణ అనేవి ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్న లక్షణాలు. వీటివల్లనే ప్రకృతి 24 వేర్వేరు
గుణాలు (తత్వాలు) గా విభజితమౌతుంది. ఆ గుణాలమధ్య ఉన్న మధనక్రియ పరిణామానికి మూలకారణం. ఇందుకు [[త్రిగుణములు|మూడు ముఖ్యమైన తత్వాలు]].
 
* ''సత్వము'' - సమతుల్యతను పెంపొందించే గుణము.
పంక్తి 63:
 
=== మోక్షము ===
అజ్ఞానమే బంధాలకు, కష్టాలకు కారణం - అని మిగిలిన చాలా సిద్ధాంతాలలాగానే సాంఖ్యం కూడా చెబుతుంది. "పరుషుడు" (అనగా జీవాత్మ) శాశ్వతమైన, నిర్మలమైన చైతన్యము. ప్రకృతి వల్ల కలిగే సత్వరజస్తమోగుణాలు, మనసు, అహంకారము, మహత్‌లుమహాత్‌లు ఈ జీవుని శరీరంలో బంధించివేస్తున్నాయి. జ్ఞానం వల్లం ఈ బంధం నుండి విముక్తులు కావచ్చును. అందువలన మోక్షం లభిస్తుంది.
 
ఇక్కడ సాంఖ్యానికి, వేదాంతానికి మధ్య విభేదాలను గమనించవలసి ఉన్నదిఉంది. [[అద్వైతం|అద్వైత వేదాంతం]] ప్రకారం బ్రహ్మమే అన్నిటికీ కారణం. వేరే పదార్థం లేదు. కాని సాంఖ్యం ప్రకారం ప్రకృతి, పురుషుడు అనేవి రెండూ అనాదిగా వేర్వేరు. శాశ్వతమైన దానినుండి అశాశ్వతమైనది జనిస్తుందనే వాదాన్ని సాంఖ్యం అంగీకరించదు.
 
== పాశ్చాత్య తత్వాలలో సాంఖ్యం ==
"https://te.wikipedia.org/wiki/సాంఖ్య_దర్శనం" నుండి వెలికితీశారు