నర్తనశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
[[మహాభారతం]]లోని '[[విరాట పర్వం]]'లో జరిగిన [[పంచపాండవులు|పాండవుల]] అజ్ఞాతవాస గాథ ఈ చిత్రానికి ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం ముగించుకొన్న తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసం మధ్యలో భంగపడితే వనవాసం పునరావృతమౌతుంది.
 
[[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] సలహా ప్రకారం పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మిచెట్టుపైనుంచి, గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు. [[ధర్మరాజు]] ''కంకుభట్టు''గాను, [[భీముడు]] వంటలవాడు ''వలలుని''గాను చేరుతారు. 'పేడివి కమ్మ'ని [[ఊర్వశి]] ఇచ్చిన శాపం అజ్ఞాతవాసములో వరంగా వినియోగించుకొని [[అర్జునుడు]] ''బృహన్నల''గా విరాటరాజు కుమార్తె [[ఉత్తర]]కు 'నర్తనశాల'లో నాట్యాచార్యుడౌతాడు.[[నకులుడు]] ధామగ్రంథి అనే పేరుతో అశ్వపాలకుడిగా [[సహదేవుడు]] తంత్రిపాలుడు అనే పేరుతో [[ఆవు|గో]]సంరక్షకుడిగా చేరుతారు. [[ద్రౌపది]] ''సైరంధ్రి''గా విరాటరాజు భార్య సుధేష్ణాదేవి పరిచారిక అవుతుంది.
 
పాండవుల అజ్ఞాతవాసాన్ని ఎలాగైనా భంగం చేయాలని [[కౌరవులు]] చారులను పంపి ప్రయత్నాలు సాగిస్తారు.[[పాండవులు]] ఈ విధంగా అజ్ఞాత వాసం వెలుబుచ్చుండగా ఒకరోజు విరాటరాజు బావ, ఆ రాజ్యానికి రక్షకుడు, మహా బలవంతుడు అయిన [[కీచకుడు|కీచకుని]] కన్ను ద్రౌపదిపై[[ద్రౌపది]]పై పడుతుంది. ఉపాయంగా కీచకుని రాత్రివేళ నర్తనశాలకు పిలిపించి [[భీముడు]], అతడిని హతం చేస్తాడు.
 
కీచకుని మరణంతో అక్కడ పాండవులుండవచ్చునని అనుమానించిన [[కౌరవులు]], వారి ఉనికిని బయట పెట్టేందుకు సుశర్మ సాయంతో దక్షిణ గోగణాలను బలవంతంగా తీసుకుపోతారు. వారిని ఎదుర్కోవడానికి విరాటుడు సకల సైన్యాలతో యుద్ధానికి వెళతాడు. ఇక కలుగులో ఎలుకలను లాగడానికి [[కౌరవులు]], భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులతో ఉత్తరగోగణాలను తోలుకుపోవడానికి వస్తారు.
"https://te.wikipedia.org/wiki/నర్తనశాల" నుండి వెలికితీశారు