సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
[[బారిష్టరు]] పట్టా పుచ్చుకొని [[ఇంగ్లాండు]] నుంచి తిరిగి వచ్చిన వల్లబ్ భాయి పటేల్ దేశంలో జర్గుతున్న [[భారత జాతీయోద్యమం]] ప్రభావానికి లోనైనాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన [[సహాయ నిరాకరణ ఉద్యమం]] పట్ల ఆకర్షితుడయ్యాడు. [[1928]]లో [[బార్డోలీ]]లో [[బ్రిటీష్ ఇండియా]] ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా [[కిసాన్ ఉద్యమం]] చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి [[సర్దార్]] అనే పేరు వచ్చింది.
[[Image:Gandhi, Patel and Maulana Azad Sept 1940.jpg|thumb|1940, బాంబే, ఏ.ఐ.సి.సి. మీటింగులో గాంధీ, మౌలానా ఆజాద్ లతో పటేల్.]]
గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల [[విరాళాలు]] సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. [[గుజరాత్‌]]లో [[మద్యపానం]], [[అస్పృశ్యత]], కులవిచక్షణలకు వ్యతిరేకంగా పనిచేసారు.
 
[[1931]] [[కరాచి]] [[భారత జాతీయ కాంగ్రెస్]] సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. [[ఉప్పు సత్యాగ్రహం]], [[1942]] నాటి [[క్విట్ ఇండియా ఉద్యమం]] మొదలగు ఉద్యమాలలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు.