రఘుపతి వేంకటరత్నం నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
150 వ జయంతి సందర్భంగా ఎమెస్కో బుక్స్ ప్రచురణ.
*బ్రహ్మర్షి రఘుపతి వేంకతరత్నం నాయుడు*
దేశ రాజకీయ దాస్యం ఒకవైపు, సాంఘిక దురాచారాలు మరొకవైపు ఆవరించి, సమాజం అంధకార బంధురమై - ఒక ఆశాజ్యోతి కోసం, ఒక మార్గదర్సనం కోసం ఎదురుచూస్తున్న రోజులు 19 శతాబ్దపు ఆఖరి దశాబ్దాలు. సరిగ్గా అట్టి తరుణంలో సంఘంలో నైతిక ధార్మిక విద్యారంగాలను దేదిప్యమానం చేసినవి రెండు దివ్యజ్యోతులు. తమ దార్శనికతతో, చైతన్యంతో ఆంధ్రదేశాన్ని పునీతం చేసి పునరుజ్జీవింపచేసిన నవయుగ వైతాళికద్వయం శ్రీ వీరేశలింగం పంతులుగారు, రఘుపతి వేంకతరత్నం నాయుడు గార. ఇందు సర్వతోముఖ సంఘసంస్కరణకు ఆధ్యాత్మిక నవజీవనానికి వాసుధైక కుటుంబభావనకు పునాదులు వేసి జీవితాంతం కృషి చేసిన వారు శ్రీ వెంకటరత్నం నాయుడు గారు. వీరు ప్రాక్పశ్చిమ విచారధారకు పవిత్రవారధియై, దీనబాంధవుడై దాతయై, త్రాతయై, కులపతియై, సమాజాన్నే సాధనక్షేత్రంగా, విద్యాలయాలే తపోనిలయాలుగా చేసుకున్న కర్మయోగి. అందుకే ఆయనను అఖిలాంధ్రదేశము భక్తిప్రపర్తులతో బ్రహ్మర్షి అని సంభావించినది.
 
=దేవులపల్లి కృష్ణశాస్త్రి =