నాగార్జునకొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
[[కొండవీడు]] రాజధానిగా పాలించిన రెడ్డి రాజుల కాలంలో ఈ ప్రాంతంలో నాగార్జునగిరి దుర్గాన్ని నిర్మించి, వారి రాజ్యానికి చెందిన సైనిక స్థావరాలలో దక్షిణ దుర్గంగా ఉంచారు. తర్వాత [[గజపతులు]] నాగార్జునకొండను వశపరచుకొని వారి ప్రతినిధిని ఉంచారు. పురుషోత్తమ గజపతి కాలంలో ఈ ప్రాంతం అతని ప్రతినిధి శ్రీనాథ రాజసింగరాయ మహాపాత్రుని ఆధీనంలో ఉంది. వీరు 1413 లో ఇక్కడ నాగేశ్వరలింగ ప్రతిష్ఠ చేశారు.
 
క్రీ.శ. 1513 నుండి 1519 వరకు శ్రీకృష్ణదేవరాయల కళింగ దండయాత్ర జరిగింది. ఉదయగిరితో[[ఉదయగిరి]]తో మొదలైన ఈ దండయాత్ర [[కందుకూరు]], [[వినుకొండ]], [[అద్దంకి]], కవుతారం, తంగెడ, నాగార్జునకొండ, బెల్లంకొండ ల వరకు సాగింది. రాయలు గజపతుల సైనిక స్థావరాన్ని నిర్మూలించి, వశం చేసుకున్నాడు. నాగార్జునకొండలో అయ్యలయ్య, వీరభద్రయ్య అనే సేనాధిపతులను ఉంచాడు. వీరు నాగార్జునకొండను రాజకీయ పాలనాకేంద్రంగా చేశారు. నాగార్జునకొండ పేరు మొదటిసారిగా వీరి శాసనాలలో కన్పిస్తుంది. 1565 [[తళ్ళికోట యుద్ధం]]లో విజయనగర పతనం తర్వాత, ఈ దుర్గం [[గోల్కొండ]] నవాబుల ఆధీనమైనది. చివరి [[కుతుబ్ షాహీ]] ప్రభువుల శాసనాల ప్రకారం నాగార్జునకొండ దుర్గాన్ని నేటి కడప జిల్లాలోని [[పుష్పగిరి]] పీఠానికి అగ్రహారంగా ఇచ్చారు.
 
==శాసనాలు==
"https://te.wikipedia.org/wiki/నాగార్జునకొండ" నుండి వెలికితీశారు