జయంతి రామయ్య పంతులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →బాల్యం, విద్య: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (2), గ్రంధ → గ్రంథ (2), బడినది. → బడి using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36:
}}
'''జయంతి రామయ్య పంతులు''' ( [[జూలై 18]], [[1860]] - [[ఫిబ్రవరి 19]], [[1941]]) కవి మరియు శాసన పరిశోధకులు.
==బాల్యం, విద్య==
వీరు కోనసీమలోని [[ముక్తేశ్వరం]] గ్రామంలో [[జూలై 18]], [[1860]] సంవత్సరంలో జన్మించారు. [[సంస్కృతాంధ్ర]] భాషలలో ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత రాజమండ్రిలో ఆంగ్లభాష అభ్యసించారు. 1882లో పట్టభద్రులై 1884 వరకు [[పిఠాపురం]] మహారాజా వారి పాఠశాలలో ప్రధాన అధ్యపకునిగా పనిచేశారు. తరువాత [[న్యాయవాది]] పరీక్షలో ఉత్తీర్ణులై ప్రభుత్వ మండలాధికారిగా చేరారు. 1911లో రాష్ట్ర న్యాయాధీశులయ్యారు.
ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. మండలాధికారిగా అనేక శాసనాలను సేకరించి పరిశోధించారు. వీటిలో దేవులపల్లి శాసనం, యుద్ధమల్లుని శాసనం ముఖ్యమైనవి. ఇలా సేకరించిన శాసనాలలోని పద్యాలను క్రోడీకరించి "[[శాసన పద్య మంజరి]]" అనే పేరుతో రెండు భాగాలుగా ప్రచురించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు తాము ప్రకటించినవి కాక 1926 వరకు సేకరించి ఉంచిన తెలుగు శాసనాలను వీరికి పరిష్కరించాలని ఇవ్వారు. అట్టి గ్రంథమే "దక్షిణ హిందూదేశ శాసనాలు" పదవ సంపుటంగా ప్రకటితమైనది.
వీరు రాష్ట్ర న్యాయాధీశులుగా [[పిఠాపురం]], [[బొబ్బిలి]], [[వెంకటగిరి]] సంస్థానాధీశుల ప్రోత్సాహంతో [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]]ను ఏర్పాటుచేశారు. దానికి ఐదు వేల తాళపత్ర గ్రంథాలను సేకరించారు. ఈ పరిషత్తు మొదట
==రచనలు==
వీరు రససిద్ధులైన కవి. ఉత్తర రామచరిత్ర, చంపూ రామాయణం వీరి స్వతంత్ర రచనలు. పిఠాపురం మహారాజా వారి ఆధిక సహాయంతో "[[సూర్యారాయంధ్ర నిఘంటువు]]"ను 1936లో రచించారు. "[[ఆధునికాంధ్ర వాజ్మయ వికాస వైఖరి]]" (1937) అనే విమర్శనాత్మక గ్రంథాన్ని రచించారు.
వీరు [[ఫిబ్రవరి 19]], [[1941]] సంవత్సరంలో పరమపదించారు.
పంక్తి 54:
==మూలాలు==
*20వ శతాబ్ది తెలుగు వెలుగులు, [[పొట్టి శ్రీరాములు
==బయటి లింకులు==
|