నిడుదవోలు వేంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వెంకటేస్వర → వెంకటేశ్వర, లో → లో (3), లు → లు (2), గా → గా (4 using AWB
పంక్తి 38:
 
==జీవిత విశేషాలు==
ఈయన [[విజయనగరం]] జిల్లాలో [[జనవరి 7]], [[1903]]లో ఒక పండిత కుటుంబములో విజయనగరంలోని[[విజయనగరం]]లోని సుంధరంపంతులు, నాగమ్మ దంపతులకు జన్మించారు.ఆర్వేల [[నియోగులు]], కౌండిన్యసగోత్రులు ఆపస్తంబ సుత్రులు.తండ్రి సుంధరంపంతులు గ్రంథాలయోద్యమ కార్యకర్తగా పైరు పొందినవారు.ఈ పండితుని ఇంట్లో 19౦౦ నాటికే ౩౦౦ ముద్రిత గ్రధాలు,15౦౦ తాళపత్ర గ్రధాలు ఉండేవి.వీరు విజయనగరంలోనే ప్రారంభ విద్యాభ్యాసం చేసి, అక్కడ కళాశాలలో [[తెలుగు]], చరిత్రఅభిమాన విషయాలు గా 192౦ లో బి.ఏ పట్టా పొందారు. తరువాత పైచదువులకు చదవటానికి తగినవసతులు లేక, విజయనగరంలోని [[మద్రాసు]] ఇంపీరియల్ బ్యాంకులో గుమాస్తాగా చేరారు.
 
ఆయన ఉన్నత పాఠశాల, ఇంటరు చదువు విశాఖపట్నంలోనూ[[విశాఖపట్నం]]లోనూ, [[బి.ఎ]]. విజయనగరంలోనూ[[విజయనగరం]]లోనూ పూర్తి చేసారు. 1925లో బి.ఎ. పట్టం అందుకుని ఆర్థికపరిస్థితులు కారణంగా పైచదువుకి వెళ్లలేక, ఇంపీరియల్ బాంక్ (ఈనాటి స్టేట్ బాంక్) లో గుమాస్తాగా చేరేరు 1926లో. 1939 వరకూ గుమాస్తాగా పని చేసేరు. ఆ రోజుల్లో పిఠాపురం రాజావారు సూర్యారాయాంధ్ర నిఘంటువులో ఉద్యోగం ఇచ్చేరు. 1944 నుండి 1964వరకూ మద్రాసు విశ్వవిద్యాలయంలో[[మద్రాసువిశ్వవిద్యాలయం]]లో ఉద్యోగం.
 
ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు తీరిక కాలంలో, అనేక పద్య గద్య రచనలు చేస్తూ [[భారతి]] మొదలగు పత్రికలలో ప్రచురిస్తుండేవారు. తండ్రి సమకూర్చి ఉంచిన తాళపత్రాది గ్రంథాలు తనివితీరా చదివి క్రమంగా సాహిత్య పరిశోధన జిజ్ఞాసను పెంపొందించుకున్నారు. 1939 లో వీరు కాకినాడలోని[[కాకినాడ]]లోని సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయంలో పండితులుగా చేరి, నిఘంటు నిర్మాణంలో కొంత కాలం పాల్గొన్నారు. 1941 లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకం సహా, ఎం. ఎ. పట్టా పొంది, 1942 వరకు కాకినాడలోని కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసారు. 1944 వీరు [[చెన్నై]] వెళ్లి అక్కడి విశ్వవిద్యాలయంలో ఐదేళ్ళు జూనియర్ లెక్చరర్ గా పనిచేసి, తరువాత 1949 నుండి సీనియర్ లెక్చరర్ గా, తరువాత క్రమంగా రీడరుగా, ఆంధ్ర శాఖాధ్యక్షులుగా 1964 వరకు పనిచేసి, భాషా సాహిత్యాలలో విశిష్ట పరిశోధనను సాగించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పదవీ విరమణ చేసిన తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో[[ఉస్మానియావిశ్వవిద్యాలయం]]లో 1966 వరకు యు. జి . సి ప్రొఫెసరుగా ఆంధ్ర మహాభారత పరిశోదిత ప్రతికి సంబంధించిన పధకంలో పనిచేసారు. 1942 లో నరసరావుపేట ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు వీరికి “విద్యారత్న” గౌరవం ఇచ్చారు. 1951 లో విశ్వనాధ సత్యనారాయణ అద్యక్షతన విజయవాడలో జరిగిన సన్మాన సభలో “పరిశోధన పరమేశ్వర ” గౌరవం ఇచ్చారు. 1973 లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వీరిని “కళా ప్రపూర్ణ ” గౌరవం ఇచ్చింది. వీరి రచనలన్నింటినీ స్థూలంగా నాలుగు విధాలుగా విభజించవచ్చు. 1 : పద్యరచనలు: [[గాంధీ]] మహాత్ముని 50 వ జన్మదినోత్సవ సందర్భంలో 2-10-1919 న రచించిన పద్యాలే, ఈ పండితుని తొలి పద్య రచనలు. తరువాత పరవస్తు రంగాచార్యుల గురించి (1921), వెంకట రమణ అనే పేరుతో రచించిన వివిధ పద్యాలను ఆ తరువాత అన్నింటిలోనూ, వీరికి కవిగా పేరు తెచ్చిన రచనలు “మించుపల్లె ”, “తెలుపుపొలుగు”, “ఆంధ్రనలందా” అనే మకుటంతో రాసిన కవి స్తుతులు. “పోట్టిశ్రీరా మోదరణము” అనే ఉదాహరణ కావ్యం, “శ్రీరామ గీతామృతం” ఈ కోవకు చెందినవే. వార్ధక్యంలో విశ్రాంతి తీస్కోనే సందర్భంలో, రోజుకు నాలుగైదు పద్యాల చొప్పున మంగాసమేత శ్రీ వెంకటేశ్వర స్తుతి పద్యాలు రాయటమే కాక, తెలుగు దేశపు సాహిత్య రంగంలో వీరికి తెలిసిన వారిలో ప్రతి ఒకరి గురించి ఒక పద్యం చొప్పున 2500 పద్యాలు రాసారు. ఆధునికాంధ్ర సాహిత్య రచనకు ఈ పద్యాలు కొంతవరకు ఉపకరించగలవు. 2. గ్రంథ పరిష్కరణలు, పీఠికలు; తెలుగు ప్రాచీన గ్రంథ పరిష్కరణలో పేరు ప్రతిష్ఠలను తెలుగుదేశంలో[[తెలుగుదేశం]]లో పొందిన ముగ్గురు పండితులలో వీరు ఒకరు. తక్కిన ఇరువురు; మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకర శాస్త్రి. అసమనధారణ శక్థితో వేలకు వేలు ప్రయోగాలను, పద్యాలను గుర్తుంచుకొని కావ్య పరిష్కరనలను ఒక కళగా రూపొందించిన పరిశోధకులు వీరు. మద్రాసు ప్రభుత్వపు ప్రాచ్య లికిత గ్రంథాలయం ప్రక్షణ, తంజా ఊరు[[తంజావూరు]] [[సరస్వతీ మహల్]] పక్షాన తెలుగు రాత ప్రతులను ఎన్నిక్క చేసే నిపుణుల స౦ఘంలో సభ్యులుగా వీరు గణనీయ కృషి చేసారు. ఆ గ్రంథాలయంలో కొన్ని గ్రంథాలను వీరు పరిష్కరించారు. వీటిలో పేర్కొనదగ్గవి : ‘ఖడ్గ లక్షణ శిరోమణి’, ‘కట్టావరదరాజ రామాయణము’ ‘రాజ గోపాల విలాసము’ వావిళ్ళవారు, [[ఆంధ్ర గ్రంథమాల]], ఆంధ్ర సాహిత్య పరిషత్ మొదలగు పలువురు ప్రచురణ కర్తలు తమ గ్రంథాలలో ప్రముఖ మైన కొన్నింటిని వీరిచేత పరిస్కరింప చేసి ప్రచురించారు. సివతత్వసారం, కుమార సంబవము, అన్యవాదకోలాహలము, బసవపురానము, ఉత్తర హరివంశ ము, భాస్కర రామాయనము ఈ కోవకు చెందినవాటిలో కొన్ని. ఈ పరిశోధనకు పండితుడు పీఠికలు సంతరించిన ప్రభందాలు ఇరవైకి పైగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి, శ్రీ వెంకటేశ్వర శతకము, శతక సంపుటము, పట్టాభిరామ పాండిత్యం, రావిపాటి గురుమూర్తి శాస్త్రి రచించిన వ్యాకరణము, ప్రస్నోత్తరాంధ్ర వ్యాకరణము, లఘు వ్యాకరణము, ప్రౌఢవ్యాకర్ణము మొదలైన వ్యాకరణ గ్రంథాలు వీరు సామకూర్చిన పీఠికలతో వెలువడ్డాయి. బహుజన పల్లె వారి శభ్ధ రాత్నాకరానికి అదనంగా 10 వేల శబ్దాలను చేర్చడమే కాక ఆ నిఘంతువుకు వీరి పీఠికను కూడా సమకూర్చారు. అది 1958 లో ముద్రితం. వీరు పీఠికలు సంతరించిన మరికొన్ని గ్రంథాలు: వీరి వీరచిత “వీరశైవ ప్రమాణ శతకాభరణము”; పాల్కురికి సోమనాధుని బసవోదాహరణము; భాస్కరలింగ శాస్త్రి కృత వీర భద్ర సముచ్చయము; వంగూరి సుబ్బారావు గారు వాజ్మయ చరిత్ర, శతక కవుల చరిత్ర.
 
==పరిశోధన గ్రంథాలు==