పట్నం శేషాద్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వీరి తండ్రి గద్వాలకు చెందిన పట్నం నర్సప్ప, తల్లి పాగుంటమ్మ.
== విద్యాభ్యాసం ==
గద్వాలలో డిగ్రీ వరకు చదివిన శేషాద్రి, తరువాత [[ఎం.ఎస్సీ]]., వృక్షశాస్త్రం చదివారు. అందులో పరిశోధన చేసి [[డాక్టరేట్]] పట్టాను పొందారు.
== ఉద్యోగ జీవితం ==
[[1985]]లో [[మెదక్]] జిల్లాలో[[జగదేవ్‌పూర్]] మండలంలో తాహశిల్దారుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత [[వరంగల్]] డి.ఆర్.వో. గా, [[నిజామాబాద్]] జిల్లా అధనపు సంయుక్త [[కలెక్టర్]] గానూ పనిచేశారు.
== సాహిత్య జీవితం ==
మెదక్ జిల్లా [[జగదేవ్‌పూర్]] మండలంలో పనిచేస్తున్నప్పుడు అక్షరాస్యతా ఉద్యమంలో భాగంగా ఆ జిల్లాలో మంజీరా అక్షరప్రభ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలోని [[పాటలు]], సాహిత్యం వీరిని సాహిత్యం వైపు నడిపించాయి. ఆ తర్వాత తానే పాటలు, కవితలు, నానీలు రాయడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు మూడు పుస్తకాలు ప్రచురించబడ్డాయి. మరో రెండు పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఆచార్య ఎన్. గోపి తాను రాసిన 'రాతి కెరటాలు ' అనే వచన కవితాసంపుటిని శేషాద్రికి అంకితమిచ్చాడు.
పంక్తి 11:
# కవితాసుమాలు: 41 కవితలతో కూడిన ఈ సంకలనం [[2007]]లో వెలువడింది. దీనిని ప్రముఖ కవి [[ఎన్. గోపి]] ఆవిష్కరించారు.
# అక్షరదళాలు: ఇది నానీల సంపుటి. [[2008]]లో వెలువడిన ఈ పుస్తకాన్ని [[సి. నారాయణరెడ్డి]] ఆవిష్కరించారు.
# విచిత్ర వర్ణాలు: ఇది వచన కవితా సంపుటి [[2015]] జనవరిలో వెలువడింది. దీనిని అప్పటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఆవిష్కరించారు<ref>అక్షర దళపతి శేషాద్రి,మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజి సంఖ్య-9, [[ఈనాడు]] దినపత్రిక, తేది:08.10.2015</ref>.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పట్నం_శేషాద్రి" నుండి వెలికితీశారు