ఏకవింశతి అవతారములు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గాధ → గాథ, బ్రహ్మణ → బ్రాహ్మణ, యుద్దం → యుద్ధం using AWB
పంక్తి 2:
 
==21 అవతారాలు==
[[మహాభాగవతం]] [[ప్రధమ స్కంధం]]లో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల[[అవతారాలు|అవతారా]]<nowiki/>ల గాథలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించ బడుతాయి. ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.
 
శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు -
అన్ని అవతారాలకు ఆది అయిన [[శ్రీమన్నారాయణుడు]] పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.
 
#[[బ్రహ్మ|బ్రహ్మ అవతారము]]: దేవదేవుడు [[యవ్వనం|కౌమార]] నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
#[[వరాహ అవతారము]]: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.
#[[నారదుడు|నారద అవతారము]]: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి[[కర్మ]]<nowiki/>లనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు.
#[[నర నారాయణ అవతారము]]: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.
#[[కపిలుడు|కపిల అవతారము]]: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.
# [[దత్తాత్రేయ స్వామి|దత్తాత్రేయ అవతారము]]: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల[[పరమాత్మ]]<nowiki/>ల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.
#[[యజ్ఞుడుయజ్ఞ అవతారము]]: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
# [[ఋషభుడు|ఋషభ అవతారము]]: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై?) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.
#[[పృథువు|పృధు అవతారము]]: పృథువు అనే చక్రవర్తిగా[[చక్రవర్తి]]<nowiki/>గా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.
#[[మత్స్య అవతారము]]: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.
#[[కూర్మ అవతారము]]: దేవదానవులు [[క్షీరసాగర మథనం]] చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.
#[[ధన్వంతరి|ధన్వంతరీ అవతారము]]: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.
#[[మోహినీ అవతారము]]: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.
#[[వరాహావతారం]]:వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని[[భూమి]]<nowiki/>ని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము . రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.
#[[నృసింహ అవతారము]]: లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు [[స్తంభం]] నుండి బయలువెడలినాడు.
#[[వామన అవతారము]]: కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
"https://te.wikipedia.org/wiki/ఏకవింశతి_అవతారములు" నుండి వెలికితీశారు