గౌతమ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జనబా → జనాభా, బౌద్ద → బౌద్ధ, శుద్ద → శుద్ధ (14) using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 47:
[[దస్త్రం:SiddhartaBirth.jpg|thumb|200px|left| (2-3వ శతాబ్దం) సిద్ధార్థుని జననం.]]
[[బుద్ధుడు]] మరియు అతని శిష్యులు, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు బుద్ధుని బోధనలను చర్చించి ఆచరించేవారు. ఈ బోధనలను భద్రపరచి ప్రచారం చెయ్యడానికి బుద్ధుని నిర్యాణం తర్వాత ఒక సంఘం ఏర్పడింది. ఒక శతాబ్దం తర్వాత ఇంకో సంఘం ఏర్పడింది. ఈ రెండు సంఘాలు బుద్ధుని బోధనలను ప్రచారం చేయసాగాయి. ఈ సంఘాలు బుద్ధుని బోధనలను, వేర్వేరు భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో బౌద్ధ భిక్షువుకు అప్పగించాయి. అప్పటి నుంచి బుద్ధుని బోధనలు ముఖస్థంగా ప్రచారం కాసాగాయి. చరిత్ర ప్రకారం బుద్ధుని బోధనలను, రెండవ సంఘం ఏర్పడినప్పుడు గానీ, లేదా తర్వాత కొద్ది కాలానికి గానీ ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నాయి. కానీ, ఈ బోధనలు బుద్ధుని నిర్యాణానంతరం, మూడు, నాలుగు శతాబ్దాల వరకు ఎక్కడా గ్రంథస్థం చెయ్యబడలేదు. ఈ సమయంలో బౌద్ధ బిక్షువులు, గౌతమ బుద్ధుని జీవితాన్ని మరింత గొప్పగా మలచడానికి, అతని చరిత్రను, బోధనలను, మార్చడం గానీ, లేదా కొత్త విషయాలను జోడించడం గానీ చేసిఉండవచ్చునని కొందరి అభిప్రాయం.
ప్రాచీన భారతీయులు కాలక్రమము కన్నా తత్వశాస్త్రమునకే ప్రాముఖ్యతనిచ్చేవారు. అందువల్ల బౌద్ధ మత గ్రంథాలలో కూడా, శాక్యముని జీవిత చరిత్ర కన్నా ఆయన బోధనలకే ప్రాముఖ్యం ఉంటుంది. ఈ గ్రంథాలలో ప్రాచీన భారతీయ [[నాగరికత]] మరియు జీవన విధానం వివరించబడింది.
=== బుద్ధుని జననం ===
పంక్తి 61:
సిద్ధార్దుడు బాల్యం నుంచి రాకుమరుడిగా విలాసవంతమైన జీవితం గడిపాడు. శుద్ధోధనుడు, సిద్ధార్దుని గొప్ప చక్రవర్తిని చేయాలనే ధ్యేయంతో అతడికి ఎలాంటి తాత్విక విషయాలు గాని, సామాన్య ప్రజల కష్టసుఖాలు గాని తెలియకుండా పెంచాడు. సిద్ధార్దుడు తన పినతల్లి అయిన మహా ప్రజాపతి పెంపకంలో పెరిగాడు.
సిద్దార్డునకు 16 ఏండ్ల ప్రాయము వచ్చేసరికి యశోధరతో వివాహమయ్యింది. వీరికి రాహులుడనే కుమారుడు పుట్టాడు. ఈ విధంగా సిద్దార్డు 29 ఏళ్ల వరకు రాజభోగాలను అనుభవించాడు. [[మహారాజు]] శుద్ధోధనుడు, తన కుమారునకు కావలసిన రాజభోగాలనన్నింటినీ సమకూర్చినప్పటికీ, సిద్ధార్దుడు ప్రాపంచిక సుఖాలను అనుభవించడం జీవిత పరమ లక్ష్యం కాదని భావిస్తూ ఉండేవాడు.
==ఇతర నామములు==
ఇతనికి అర్కబంధువు, గౌతముడు, మాయాదేవీసుతుడు, మునీంద్రుడు, శాక్యముని, శాక్యసింహుడు,
=== రాజ భోగాలనుంచి నిష్క్రమణ మరియు సన్యాసి జీవితం ===
పంక్తి 73:
అప్పుడు సిద్ధార్దుడు పరివ్రాజక జీవితం గడపడానికి, తన రథసారథి ఛన్న సహాయంతో, ఒకనాడు రాజభవనం నుంచి కంతక అనే గుర్రంపై తప్పించుకున్నాడు. ఈ విధంగా ఒక బోధిసత్వుని నిష్క్రమణ అతని భటులకు తెలియకుండా ఉండడానికి, అతని గుర్రపు డెక్కల చప్పుడు దేవతలచే అపబడిందని చెప్తారు. దీనినే ఒక గొప్ప నిష్క్రమణ (మహాభినిష్క్రమణ) అంటారు.
సిద్ధార్దుడు తన సన్యాసి జీవితాన్ని రాజగృహ (మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణం) లో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. కానీ బింబిసార [[మహారాజు|మహారాజ]] సేవకులు, సిద్దార్డుని గుర్తించడంతో, బింబిసారుడు, సిద్ధార్దుని అన్వేషణకు కారణం తెలుసుకుని, అతనికి తన సింహాసనాన్ని (మహారాజ పదవిని) బహుకరించాడు. కాని సిద్ధర్డుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ, తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదటగా మగధ సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాటిచ్చాడు.
తర్వాత సిద్ధార్దుడు, రాజగృహను విడిచిపెట్టి, ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేశాడు. అలరకలమ అనే సన్యాసి, తన బోధనలలో సిద్ధార్దుని ప్రావీణ్యున్ని చేసి, తన వారసుడిగా ఉండమని కోరాడు. కాని అ బోధనలవల్ల సిద్ధార్దుని జ్ఞానతృష్ణ తీరకపోవడంతో అ కోరికను నిరాకరించాడు. తర్వాత సిద్ధార్దుడు ఉదకరామపుత్త అనే యోగి శిష్యరికంలో యోగశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కాని ఇది కూడా సిద్ధార్దుని జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా నిరాకరించాడు.
పంక్తి 80:
=== జ్ఞానోదయం ===
తర్వాత సిద్ధార్దుడు ధ్యానం, అనాపనసతి (ఉశ్చ్వాస, నిశ్వాసలు) ద్వారా మధ్యయ మార్గాన్ని కనిపెట్టాడు (ఐహిక సుఖాలను, కోరికలను త్యజించడం). ఈ సమయంలో సుజాత అనే పల్లె పడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకునేవాడు. తర్వాత సిద్ధార్దుడు, బుద్ధ [[గయ]]లో ఒక బోధి వృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకొనుటకు భగవత్ ధ్యానం చేశాడు. కాని కౌండిన్యుడు మరియు అతని ఇతర శిష్యులు, సిద్ధార్దుడు జ్ఞాన సముపార్జన సాధనను విరమించినట్లుగా, క్రమశిక్షణా రహితుడుగా భావించారు. చివరకు, తన 35వ ఏట, 49 రోజుల ధ్యానం తర్వాత, సిద్ధార్దునకు జ్ఞానోదయమయ్యింది. కొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్దునకు బాధ్రపద మాసంలో జ్ఞానోదయమయ్యిందని, ఇంకొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్దునకు [[ఫాల్గుణమాసము|ఫాల్గుణ
జ్ఞానోదయమయ్యాక గౌతమ బుద్ధుడు, మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణమందురు. అప్పుడు గౌతమ బుద్ధుడు, ప్రతి బుద్ధునకు ఉండవలసిన 9 లక్షణాలను ప్రతిపాదించాడు.
పంక్తి 90:
జ్ఞానోదయమయ్యాక, గౌతమ బుద్ధుడు, తపుస్సా, భల్లక అనే ఇద్దరు వర్తకులను తన ప్రథమ శిష్యులుగా చేసుకున్నాడు. వారికి గౌతమ బుద్ధుడు తన తల నుండి కొన్ని వెంట్రుకలను ఇచ్చాడనీ, వాటిని ఇప్పటికీ రంగూన్ లో ఉన్న ష్యూ డాగన్ ఆలయంలో భద్రపరిచారనీ ప్రజలు నమ్ముతున్నారు. తర్వాత బుద్ధుడు తన పూర్వాచార్యులైన అలరకలమ మరియు ఉద్దకరామపుత్తలకు తను తెలుసుకున్న పరమ సత్యం గురించి చెప్పాలని భావించాడు. కాని వారు అప్పటికే మరణించారు.
అప్పుడు బుద్ధుడు ఉత్తర భారతదేశంలో ఉన్న
=== దేశ పర్యటన మరియు బౌద్ధ మత ప్రచారం ===
[[దస్త్రం:Dasavatara9.png|thumb|దేశ పర్యటన చేస్తున్న బుద్ధుడు]]
[[File:Buddha Statue at amaravati. AP.JPG|thumb|left|[[అమారవతి]]లో గౌతమ బుద్ధుని విగ్రహము]]
మిగిలిన 45 సంవత్సరాల జీవితంలో గౌతమ బుద్ధుడు గంగా నదీ పరీవాహక ప్రాంతాలైన [[ఉత్తర ప్రదేశ్]], [[బీహార్]] మరియు దక్షిణనేపాల్ ప్రాంతాలలో పర్యటించి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. ఈ ప్రజలలో గొప్పతత్వ వేత్తలను మొదలుకొని, వీధులను శుభ్రం చేసే అంటరానివారు, అంగుళీమాల లాంటి హంతకులు, అళవక వంటి నర మాంసభక్షకులు ఉండేవారు. బౌద్ధ మతంలో అన్ని జాతులు తెగలకు చెందిన ప్రజలు మారడానికి వీలుండడం మరియు కుల, వర్గ విభజనలేకపోవడంతో బౌద్ధ మత సంఘంలోకి వేల కొద్దీ ప్రజలు రావడం మొదలు పెట్టారు. దీని వల్ల గౌతమ [[బుద్ధుడు]] ఇతర మతస్తుల నుండి బెదిరింపులు, హత్యా యత్నాలు ఎదుర్కొన్నాడు.
బౌద్ధ మత సంఘం భిక్షువులతోనూ, సన్యాసులతోనూ, భారతదేశంలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ధర్మ ప్రచారం గావిస్తూ, ఒక్క వర్షా కాలం తప్ప, మిగతా సంవత్సరమంతా ప్రయాణించేది. వర్షాకాలంలో వచ్చే వరదలవల్ల అన్ని మతాలకు చెందినసన్యాసులు ఆ కాలంలో తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేశేవారు. ఈ సమయంలో బౌద్ధ మత సంఘం ఒక ఆశ్రమాన్నిఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేది. చుట్టుపక్కల ప్రాంతాలనుండి ప్రజలంతా ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చేవారు. దీనినేవస్సాన అని అంటారు.
పంక్తి 101:
మొదటి వస్సాన బౌద్ధ మత సంఘం ఏర్పడిన మొదటి సంవత్సరం వారణాసిలో ఏర్పాటు చేశారు. తర్వాత బుద్ధుడు గతంలో బింబిసారునికిచ్చిన మాట ప్రకారం మగధ సామ్రాజ్య రాజధాని అయిన రాజగృహను సందర్శించాడు. అప్పుడు బింబిసారుడు రాజగృహ సమీపంలో వేలువన వెదురు ఉద్యానవనంలో బౌద్ధ మత సంఘానికి ఒక ఆశ్రమాన్ని కట్టించాడు. గౌతమ బుద్ధుడు, తనశిష్యులతో కలిసి ఇక్కడ కొంత కాలం బస చేశాడు.
బుద్ధునికి జ్ఞానోదయమయిన విషయం తెలుసుకుని, శుద్ధోధనుడు, బుద్ధుని,
తర్వాత శుద్ధోధనుడు మరల బౌద్ధ సంఘాన్ని రాజ భవనానికి భోజనం కొరకు ఆహ్వానించాడు. [[భోజనం]] తర్వాత ధర్మముపైజరిగిన చర్చలో, శుద్ధ్దోధనుడు బౌద్ధ సంఘంలో చేరి శొతపన్నునిగా మారాడు. ఈ సమయంలో చాలా మంది రాజకుటుంబీకులుబౌద్ధ సంఘంలో చేరారు. బుద్ధుని సోదరులైన ఆనందుడు, అనిరుద్ధుడు, నందుడు మొదలగు వారంతా బౌద్ధ సంఘములో చేరిసన్యాసులుగా మారారు. సిద్ధార్ధుని కుమారుడైన రాహులుడు కూడా బౌద్ధ మత సంఘములో చేరాడు. అప్పటికి అతని వయస్సు 7సంవత్సరములు మాత్రమే. దేవదత్తుడనే వ్యక్తి (వరుసకు బుద్ధుని సోదరుడు) మొదట బౌద్ధ భిక్షువుగా మారినా, తర్వాత బుద్ధునిశత్రువుగా మారి, బుద్ధుని చంపాలని చాలాసార్లు ప్రయత్నించాడు.
బుద్ధుని శిష్యులలో సరిపుత్త, మహా మొగ్గల్లన, మహా కశ్యప, ఆనంద, అనిరుద్ద మొదలగు ఐదుమంది ముఖ్యులు. వీరితో పాటూ ఉపాలి, సుభోతి, రాహుల, మహా కక్కన మరియు పున్న అనే ఐదుగురు సంగీత విద్వాంసులు ఉండేవారు.
పంక్తి 109:
బుద్ధుడు ఐదవ వస్సనలో వైశాలికి దగ్గరలో ఉన్న మహావాసనలో బస చేశాడు. అప్పుడు బుద్ధుని తండ్రి శుద్ధోధనుడు మరణశయ్యపైఉండడంతో, బుద్ధుడు అతని దగ్గరికి వెళ్లి ధర్మాన్ని బోధించడంతో, శుద్ధోధనుడు మరణానికి ముందు బౌద్ధ సన్యాసిగా మారాడు. శుద్ధోధనుని మరణం మరియి అంత్యక్రియలు సన్యాసినిల సంఘం ఏర్పడడానికి కారణమయ్యింది. బౌద్ధ గ్రంథాల ప్రకారం, బుద్ధుడుమొదట స్త్రీలను సన్యాసినిలుగా తీసుకోవడానికి నిరాకరించాడు. బుద్ధుని పిన తల్లి అయిన మహా ప్రజాపతి, బుద్ధుని బౌద్ధ సన్యాసదీక్షను ప్రసాదించమని అడుగగా బుద్ధుడు నిరాకరించి, కపిలవస్తుని విడిచి పెట్టి, రాజగృహకు ప్రయాణమయ్యాడు. కాని మహాప్రజాపతి నిరాశ చెందక, కొందరు శాక్య మరియు కొళియ వంశాలకు చెందిన స్త్రీలతో ఒక చిన్న గుంపుగా బయలుదేరి, బౌద్ధబిక్షువులను అనుసరిస్తూ రాజగృహకు చేరుకుంది. తర్వాత కొంత కాలానికి, అంటే బౌద్ధ సంఘం ఏర్పడిన ఐదు సంవత్సరాల తర్వాత ఆనందుని మధ్యవర్తిత్వంతో, స్త్రీలకు కూడా జ్ఞాన సముపార్జనకు సమాన శక్తి ఉందని బుద్ధుడు గ్రహించి, వారికి కూడా బౌద్ధ సంఘంలోస్థానం కల్పించాడు. కానీ బుద్ధుడు, బౌద్ధ సంఘానికున్న నియమాలతో పాటు, వినయమనే కొత్త నియమాన్ని, స్త్రీలకు ప్రత్యేకంగా జతపర్చాడు. తర్వాత సిద్ధార్దుని భార్య యశోధర కూడా బౌద్ధ సన్యాసినిగా మారింది.
తర్వాత కొంతకాలానికి, దేవదత్తుడు, బుద్ధుని కించపరచడం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో, [[దేవదత్తుడు]], తను బౌద్ధసంఘానికి నాయకత్వం వహిస్తానని బుద్ధుని కోరాడు. కానీ బుద్ధుడు నిరాకరించాడు. అప్పుడు దేవదత్తుడు మరియు బింబిసారుని కుమారుడైన అజాతశత్రు కలసి, బుద్ధుని, బింబిసారుని హత్య చేసి, తద్వారా వారి పదవులు తీసుకోవాలని పధకం వేశారు. [[దేవదత్తుడు]] మూడు సార్లు బుద్ధుని హత్య చేయాలని ప్రయత్నించాడు. మొదటి సారి కొందరు విలువిద్యా నిపుణులను బుద్ధుని హత్యచేయడానికి నియమించాడు. వారంతా బుద్ధుని కలిసి అతని శిష్యులుగా మారిపోయారు. రెండవ సారి దేవదత్తుడు కొండపైనుండి ఒకపెద్ద బండరాయిని బుద్ధుని పైకి దొర్లించాడు. అది వేరొక బండ రాయిని ఢీకొట్టి చిన్న చిన్న ముక్కలుగా పగిలి బుద్ధుని పాదాలనుమాత్రం తాకింది. మూడవ సారి ఒక
=== బుద్ధుని నిర్యాణం ===
మహా పరనిభాన సూక్తం ప్రకారం, [[గౌతమ బుద్ధుడు]], తన 80వ ఏట తాను కొద్ది రోజులలో మహా నిర్యాణమొందుతానని ప్రకటించాడు. తర్వాత, బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని (ఒక విషపు పుట్టగొడుగుల నుండి చేసిన వంటకం. పంది మాంసమని కొందరు భ్రమపడుతుంటారు.) భుజించాడు. అదితిన్న తర్వాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు బుద్ధుడు తన ముఖ్య అనుచరుడయిన ఆనందుని పిలిచి, తన అస్వస్థతకు కారణం, కుంద ఇచ్చిన ఆహారం కాదని, తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుంద చాలా గొప్పవాడని చెప్పి, కుందని ఒప్పించమని పంపాడు.
కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, సంసార సాగరంలో కొట్టు మిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణంగురించి తెలియజేయడానికి, కావాలనే నిర్యాణమొందాడని ఒక వాదన ఉంది.
పంక్తి 130:
* అనత్త (సంస్కృతం: అనాత్మ) : నేను అని నిరంతరం కలిగే భావన ఒక "భ్రమ"
* దుక్క (సంస్కృతం: దు:ఖం) : అజ్ఞానము కారణముగా అన్ని జీవులు దు:ఖానికి గురి అవుతున్నాయి.
=== భాష ===
బుద్ధుడు పండితుల భాషైన సంస్కృతాన్ని కాక సాధారణ ప్రజలు భాషించే [[పాళీ భాష|పాళీ]] భాషలో మాట్లాడేవాడని అధికుల భావన, ఆయన మాటలను త్రిపీఠికలో యథాతథంగా గ్రంథస్తం చేసారు కూడా. కొంత మంది మగథ ప్రాకృతి అని, మరికొందరు పరిశోధకులు నాటి ఈశాన్య భారతంలోని మరో భాషను మాట్లాడాడని అభిప్రాయపడుతున్నారు.
==బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతపు కళాకృతి==
''ప్రధాన వ్యాసం:[[బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతపు కళాకృతి]]''<br />
'''బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగుదంతపు కళాకృతి''' ఒకే [[ఏనుగు]] దంతంపై అంతర్భాగాలతో చెక్కిన కళాఖండం, ప్రస్తుతానికి న్యూఢిల్లీ నేషనల్ మ్యూజియంలోని అలంకరణ కళల గాలరీలో ప్రదర్శింపబడుతోంది.
<ref>{{cite news
|date= జూలై 6, 2013
|